MS Dhoni: ఆ సమాచారమే లేదు.. ధోనీనే చెబుతాడు: సీఎస్కే సీఈవో
ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచింది. వచ్చే సీజన్లోనూ అతడి ఆటను చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మరో మూడు నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మినీ వేలం జరిగింది. ముంబయి జట్టుకు కొత్త సారథిగా హార్దిక్ పాండ్యను నియమించుకుంది. తీరా అతడు వచ్చే సీజన్లో ఆడతాడో లేదో అనే సందిగ్ధత మొదలైంది. అయితే, గత మూడేళ్లుగా ఐపీఎల్ వచ్చిన ప్రతిసారీ ఎంఎస్ ధోనీ (MS Dhoni) వార్తల్లో నిలుస్తుంటాడు. సీఎస్కే కెప్టెన్ ఈ సీజన్ ఆడతాడా? లేదా? అనే చర్చలు తలెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు మరోసారి ఈ సీజన్లోనూ ఇదే పరిస్థితి. 2024 అతడికి చివరి సీజన్గా మారే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ధోనీ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం 42 ఏళ్ల ధోనీ మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ధోనీ జట్టుతో కొనసాగే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీవో కాశీ విశ్వనాథన్ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు.
‘‘ఈ విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు. కెప్టెన్ ధోనీనే నేరుగా సమాధానం ఇస్తాడు. కానీ, ఇప్పటి వరకు దీనిపై చర్చించలేదు. ప్రస్తుతం ధోనీ శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడి ఫిట్నెస్ బాగుంది. జిమ్లో వర్కౌట్స్ కూడా ప్రారంభించాడు. మరో 10 లేదా 15 రోజుల్లో నెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది’’ అని విశ్వనాథన్ తెలిపారు.
ధోనీ పెళ్లికి అలా వెళ్లిపోయా: సురేశ్ రైనా
ఎంఎస్ ధోనీ-సాక్షి వివాహం 2010 జులై 4న దేహ్రాదూన్ వేదికగా జరిగింది. అయితే, ధోనీ వెడ్డింగ్ను నిరాడంబరంగా చేసుకున్నాడు. పెళ్లికి ఆహ్వానితుల జాబితాలో సురేశ్ రైనా కూడా ఉన్నాడు. తనను ధోనీ ఎలా పెళ్లికి పిలిచాడనేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో రైనా గుర్తు చేసుకున్నాడు. ‘‘పెళ్లి రోజే ధోనీ నాకు ఫోన్ చేశాడు. ‘ఎక్కడ ఉన్నావు’ అని అడిగాడు. లఖ్నవూలో ఉన్నానని చెప్పా. అప్పుడు ‘నేను దేహ్రాదూన్లో పెళ్లి చేసుకోబోతున్నా. ఎవరికీ చెప్పొద్దు. త్వరగా ఇక్కడికి వచ్చేయ్. నీ కోసం వేచి చూస్తున్నా’ అని ఫోన్ పెట్టేశాడు. కాసేపటికే బయల్దేరి వెళ్లిపోయా. అప్పుడు సాధారణ దుస్తులే ధరించి ఉన్నా. అక్కడికి వెళ్లి ధోనీ బట్టలనే నేను వేసుకున్నా’’ అని రైనా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!