Dhoni: స్కూల్లోనూ మాథ్స్లో వీక్.. ప్లేఆఫ్స్ లెక్కలు ఆలోచించట్లేదు: ధోనీ
చెన్నై జట్టు ఇప్పుడు ప్లేఆఫ్స్ గురించి ఆలోచించట్లేదని, నెట్ రన్రేట్ విషయంపైనా ఆలోచించడం అనవసరమని కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు...
ముంబయి: చెన్నై జట్టు ఇప్పుడు ప్లేఆఫ్స్ గురించి ఆలోచించట్లేదని, నెట్ రన్రేట్ విషయంపైనా ఆలోచించడం అనవసరమని కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు. గతరాత్రి దిల్లీతో జరిగిన మ్యాచ్లో చెన్నై 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు మొత్తం 8 పాయింట్లు సాధించి ఇంకా టెక్నికల్గా ప్లేఆఫ్స్ రేసులో కొనసాగుతోంది. అయితే, అదంత తేలిక కాదు. చెన్నై టాప్-4లో నిలవాలంటే మిగతా జట్లు భారీ ఓటములు చవిచూడటంతో పాటు చెన్నై ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లోనూ గొప్ప విజయాలు నమోదు చేయాలి. ఈ నేపథ్యంలోనే గతరాత్రి దిల్లీపై విజయం సాధించిన అనంతరం మాట్లాడాడు.
‘ఇలాంటి విజయాలు ముందే వచ్చి ఉంటే బాగుండేది. ఇదో గొప్ప మ్యాచ్. మా బ్యాటర్లు బాగా ఆడారు. మిగతావారు ఏదో ఒక విధంగా రాణించారు. మ్యాచ్ గెలవాలంటే స్కోర్బోర్డుపై భారీ లక్ష్యం నిర్దేశించడం ముఖ్యమైన విషయం. అలాగే దిల్లీ జట్టులోని బిగ్ హిట్టర్లను నియంత్రించడం కూడా ఎంతో ముఖ్యం. ముఖేశ్, సిమర్జీత్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మ్యాచ్లు ఆడేకొద్దీ మరింత మెరుగవుతారు. ఇక నా బ్యాటింగ్ విషయానికొస్తే క్రీజులోకి వెళ్లిన వెంటనే ఎడాపెడా బాదాలనుకోను. కానీ, ఈరోజు తక్కువ బంతులే మిగిలి ఉండటంతో ధాటిగా ఆడాల్సి వచ్చింది. అలాగే మేం ప్లేఆఫ్స్ చేరతామా లేదా అనే లెక్కలు వేసుకోవడం లేదు. నాకు లెక్కలంటే ఇష్టం ఉండదు. చిన్నప్పుడు స్కూల్లోనూ మాథ్స్ లో వెనుకబడిపోయాను. ఇప్పుడు నెట్ రన్రేట్ గురించి ఆలోచిస్తే ఉపయోగం లేదు. ఈ టీ20 లీగ్ను ఎంజాయ్ చేయాలంతే. తర్వాతి గేమ్లో ఎలా ఆడాలనేదాని గురించే ఆలోచించాలి. ఒకవేళ మేం ప్లేఆఫ్స్ చేరితే మంచిదే. వెళ్లకపోయినా పోయేదేం లేదు. దీంతో ప్రపంచం అంతరించిపోదు’ అని ధోనీ పేర్కొన్నాడు.
దురదృష్టంకొద్దీ అది ఈ మ్యాచ్లో జరిగింది: పంత్
ఈ ఓటమిపై దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ స్పందిస్తూ.. చెన్నై జట్టు అన్ని విభాగాల్లో రాణించిందని, తమని చిత్తుచిత్తుగా ఓడించిందన్నాడు. ‘ఈ సీజన్లో మేం కొన్ని మ్యాచ్ల్లో విజయపుటంచులదాకా వెళ్లాం. అయితే అప్పుడప్పుడూ రెండు జట్ల మధ్య ఇలాంటి భారీ తేడాల మ్యాచ్లు కూడా చోటుచేసుకోవాలి. దురదృష్టంకొద్దీ మేం ఈరోజు అలాంటి ఓటమివైపు నిలిచాం. కొద్ది రోజులుగా మా జట్టు మెరుగవుతోందని అనుకున్నా. కానీ, అది నిజం కాదు. ఇక మిగిలిన 3 మ్యాచ్ల్లో మేం విజయాలు సాధిస్తేనే ప్లేఆఫ్స్కు వెళతామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మా జట్టులో పరిస్థితులు కూడా అంత బాగోలేవు. కరోనా కేసులతో పాటు పలువురు ఆటగాళ్లు అనారోగ్యంతో ఉన్నారు. ఇవన్నీ మా ఓటములకు కారణాలుగా చెప్పట్లేదు. ఇకపై మా ఆటగాళ్లు సానుకూల దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. మిగిలిన మ్యాచ్ల్లో విజయాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటాం’ అని వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్