48 రోజులు కీలకం
రాష్ట్రంలో తొలివిడతలో కరోనా టీకా అందించే 48 రోజులు చాలా కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో సుమారు 75 లక్షల మంది
తొలి విడతలో 75 లక్షల మందికి కరోనా టీకా
రెండు డోసుల పూర్తికి దాదాపు 48 రోజుల సమయం
రాష్ట్రానికి కోటిన్నర డోసులు
దుష్ఫలితాలు ఎదురైతే.. సత్వర చికిత్సకు 10 వేల ప్రత్యేక కిట్లు
అత్యవసరమైతే తరలించేందుకు 60 ఆసుపత్రుల గుర్తింపు
టీకా పంపిణీపై వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో తొలివిడతలో కరోనా టీకా అందించే 48 రోజులు చాలా కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో సుమారు 75 లక్షల మంది జనాభాకు తొలివిడతలో కొవిడ్ టీకాను అందించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య, రవాణా తదితర ఉద్యోగులు, 50 ఏళ్లు పైబడినవారు, 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు. వీరందరికీ 48 రోజుల్లో రెండు డోసుల టీకా పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వారి సమాచారం సేకరణే సవాల్
వైద్యసిబ్బంది సమాచారంలో దాదాపుగా స్పష్టత వచ్చేయగా.. పారిశుద్ధ్య, పోలీసులు, రవాణా సిబ్బంది సమాచారం కూడా త్వరలో ఆయా శాఖల నుంచి రానుంది. అయితే, 50 ఏళ్ల పైబడినవారి సమాచారాన్ని ఎలా సేకరించాలనేది ఇప్పుడు సవాల్గా మారింది. ఓటరు జాబితాలో నమోదు చేసుకునేటప్పుడు కచ్చితంగా పుట్టిన సంవత్సరం పొందుపరుస్తారు కాబట్టి.. ఆ కోణంలో సమాచారాన్ని సేకరించడంపై దృష్టిపెట్టారు. 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల సమాచార సేకరణ కూడా కష్టంగానే మారింది. ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో ఆయా వయస్సు లోపు ఉన్నవారి సమాచారం కొంత లభ్యమయ్యే అవకాశం ఉంది. అన్ని కేటగిరీల్లో టీకాకు అర్హులైన వారి సమాచారాన్ని కొవిన్ యాప్లో పొందుపరుస్తారు. ఈ విధానాల్లో తమ సమాచారం రానివారి కోసం.. నేరుగా యాప్లో పొందుపరుచుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.
10 వేల కేంద్రాలు.. 10 వేల బృందాలు
* నిర్దేశించిన వ్యక్తులకు 2 డోసుల చొప్పున ఇవ్వాలి. ఈ లెక్కన రాష్ట్రానికి సుమారు కోటిన్నర డోసులు రానున్నాయి.
* ఒక్కో బృందంలో నర్సు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్త చొప్పున.. ముగ్గురుంటారు.
* రాష్ట్రవ్యాప్తంగా ఇలా 10 వేల బృందాలు.. ఏక కాలంలో 10 వేల కేంద్రాల్లో టీకాలందిస్తుంటాయి.
* ఒక్కో బృందం రోజుకు సుమారు 80-100 మందికి టీకాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. 75 లక్షల మందికి తొలిడోసు వేయడానికి గరిష్ఠంగా 8-10 రోజుల సమయం పడుతుందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.
* తొలిడోసు ఇచ్చాక 28 రోజుల వ్యవధి అనంతరం మలిడోసు ఇవ్వాల్సి ఉంటుంది. మలిడోసునూ 10 రోజుల్లో పూర్తిచేస్తారు. తొలిడోసు నుంచి రెండోడోసును పూర్తిచేయడానికి మొత్తంగా సుమారు 48 రోజుల సమయం పడుతుందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.
* రాష్ట్రంలో వచ్చే నెల రెండోవారంలో టీకాలు అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ జనవరి 15న తొలిడోసు వేయడం ప్రారంభిస్తే.. అదే నెల 24 నాటికి రాష్ట్రంలో నిర్దేశించిన 75 లక్షల మందికి తొలిడోసు పంపిణీ పూర్తవుతుంది.
* తొలిడోసు మొదలైన 4 వారాల తర్వాత అంటే.. ఫిబ్రవరి 12న రెండో డోసు ఇవ్వడం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ తేదీ నుంచి 10 రోజుల తర్వాత అంటే.. అదే నెల 21 నాటికి రెండో డోసు కూడా పూర్తవుతుందనీ, అయితే ఇదంతా టీకా ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారు? అనే దానిపైనే ఆధారపడి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అత్యవసర చికిత్సకు ప్రాధాన్యం
రాష్ట్రంలో టీకాల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఇప్పటికే జిల్లా స్థాయిలో వైద్యసిబ్బందికి శిక్షణ ప్రారంభమైంది. మొత్తంగా టీకాల పంపిణీలో పాల్గొనే దాదాపు 50 వేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే 7-10 రోజుల్లో అన్ని స్థాయుల్లోనూ ఈ శిక్షణ పూర్తవుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. టీకాలు ఇచ్చే సమయంలో ఒకవేళ ఎవరిలోనైనా దుష్ఫలితాలు కనిపిస్తే.. వెంటనే విరుగుడు చికిత్స అందించేందుకు అన్ని కేంద్రాల్లోనూ ఒక్కో ప్రత్యేక కిట్ను అందుబాటులో ఉంచుతున్నారు. ఇందుకోసం మొత్తంగా 10 వేల కిట్లను సిద్ధం చేస్తున్నారు. మరింత మెరుగైన చికిత్స అవసరమైన సందర్భాల్లో తరలించేందుకు ప్రతి ఆరోగ్య కేంద్రంలోనూ ఒక అంబులెన్సును అందుబాటులో ఉంచనున్నారు. అవసరమైన చికిత్సలు అందించడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని 60 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఎంపిక చేశారు. టీకాపై అపోహలు తొలగించడానికి ప్రత్యేకంగా టోల్ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకురానున్నారు. టీకాపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో కొందరు అసత్య ప్రచారాలు చేస్తుండడంతో.. అపోహలు తొలగించడానికి యునిసెఫ్ సహకారంతో ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
50 ఏళ్లు పైబడినవారు 64 లక్షల మంది..
* ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఇప్పటి వరకూ 2.67 లక్షలున్నట్లుగా సమాచారం అందింది. అయితే, వీరు గరిష్ఠంగా 3 లక్షల వరకూ ఉంటారని అంచనా వేస్తున్నారు.
* పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, రవాణా ఉద్యోగులు తదితరులు సుమారు 2 లక్షల మంది వరకూ ఉంటారని ప్రాథమికంగా గుర్తించారు.
* 50 ఏళ్లు పైబడిన వారు రాష్ట్రంలో సుమారు 64 లక్షల మంది వరకు ఉంటారని అంచనా.
* 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు 6 లక్షల మందికిపైగా ఉంటారని భావిస్తున్నారు.
జులై తర్వాత బహిరంగ విపణిలోకి!
కొవిడ్ టీకా వచ్చే ఏడాది జులై తర్వాత బహిరంగ విపణిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి. వచ్చే జులై, ఆగస్టుల నాటికి సాధారణ ప్రజలందరూ కొనుగోలు చేసే విధంగా తీసుకొస్తారనీ, దాని ధర బహిరంగ విపణిలో సుమారు రూ.250-300 వరకూ ఉండొచ్చని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం