హైదరాబాద్ను వీడని వాన
రాజధాని హైదరాబాద్ నగరంలో వరుణుడు తెరిపినివ్వలేదు. శివారు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచీ దంచికొట్టగా.. నగరమంతటా తేలికపాటి జల్లులు కురిశాయి. గురువారం రాత్రి కురిసిన వర్షానికి చాలా
శివారులో బీభత్సం.. పలుచోట్ల చిరుజల్లులు
ఈనాడు డిజిటల్, ఈనాడు- హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో వరుణుడు తెరిపినివ్వలేదు. శివారు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచీ దంచికొట్టగా.. నగరమంతటా తేలికపాటి జల్లులు కురిశాయి. గురువారం రాత్రి కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు తేరుకోలేదు. ఖైరతాబాద్, షేక్పేట, యూసుఫ్గూడ, కూకట్పల్లి, జల్పల్లి, హయత్నగర్, జీడిమెట్ల, కొంపల్లి ఉమామహేశ్వరకాలనీల్లో భారీగా వరదనీరు చేరింది. గతేడాది వర్షం మిగిల్చిన చేదు మరకల్ని గుర్తు చేస్తూ ఉమామహేశ్వరకాలనీలో దాదాపు ముప్పైకి పైగా ఇళ్లు నీట మునిగాయి. జీహెచ్ఎంసీ, జలమండలి, డీఆర్ఎఫ్ విభాగాల సహాయక చర్యలు కొనసాగాయి. నగర శివారులోని రామచంద్రాపురంలో అత్యధికంగా 4.5 సెం.మీ., శేరిలింగంపల్లిలో 3 సెం.మీ. వాన కురవగా, అత్యల్పంగా షేక్పేటలో 0.1 సెం.మీ. పడింది. లింగంపల్లిలో 1.38 సెం.మీ., బీహెచ్ఈఎల్లో 1.35 సెం.మీ., వనస్థలిపురంలో 1.18 సెం.మీ, మణికొండ 0.78 సెం.మీ., గచ్చిబౌలి 0.65సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.
చిక్కుకున్న జలపాతం సందర్శకులు
మామడ, న్యూస్టుడే: జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన వారు అకస్మాత్తుగా వచ్చిన వరదలో చిక్కుకొన్న సంఘటన శుక్రవారం నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తాపూర్ వాగువద్ద చోటుచేసుకుంది. వాగు ఉప్పొంగడంతో నిర్మల్కు చెందిన 18 మంది సందర్శకులు బయటకు రాలేకపోయారు. సర్పంచి సంతోష్, ఎస్ఐ వినయ్ల ఆధ్వర్యంలో స్థానికులు సందర్శకులను సాయంత్రం 6.30 గంటలకు క్షేమంగా తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
బతుకుబండిపై పిడుగు పోటు
ముగ్గురి మృతి
కౌటాల, కౌటాల గ్రామీణం-న్యూస్టుడే: పొలం పనులు ముగించుకొని ఎద్దులబండిపై ఇంటికి వస్తున్న ముగ్గురు పిడుగుపాటుకు బలయ్యారు. ఘటన కుమురం భీం జిల్లా కౌటాల మండలం ముత్తంపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోర్కుట్ పున్నయ్య(45), డొంగ్రె పద్మ(40), శ్వేత (20), మరో ఇద్దరు శుక్రవారం సాయంత్రం పొలం పనులు ముగించుకొని ఎడ్ల బండిపై ఇంటికి వస్తున్నారు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. బండిపై పిడుగు పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఒక ఎద్దు కూడా చనిపోయింది. పున్నయ్య భార్య, కుమారుడు బతికి బయటపడ్డారు.
ప్రవాహంలో ప్రయాణం.. కొద్దిలో తప్పిన ప్రమాదం
నాంపల్లి, గుర్రంపోడు- న్యూస్టుడే: ప్రవాహ ఉద్ధృతిని అంచనా వేయకుండా ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని వాగులు ప్రవహించాయి. ఇదే సమయంలో చండూరు మండలం చామలపల్లికి చెందిన నేర్లకంటి నరేశ్, రాములు ద్విచక్రవాహనంపై నాంపల్లి మండలం నర్సింహులగూడెం వచ్చారు. వర్షం తగ్గగానే స్వగ్రామానికి బయలుదేరారు. నర్సింహులగూడెం శివారులోని వాగు రోడ్డుపైన ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ద్విచక్రవాహనంతో వాగును దాటే ప్రయత్నించగా అదుపు తప్పి పడిపోయారు. వాగులో కొట్టుకుపోతున్న వీరిలో ఒకరు కల్వర్టు రెయిలింగును పట్టుకోగా.. మరో వ్యక్తి ఓ చెట్టుకొమ్మను పట్టుకొని ప్రాణాలు నిలుపుకొన్నారు. స్థానికులు తాళ్ల సహాయంతో ఇద్దరినీ రక్షించగా.. ద్విచక్రవాహనం మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?