ఆలోచనలే పెట్టుబడి.. లాభసాటిగా సాగుబడి
ఏటా ఒకే రకమైన పంటలు సాగు చేస్తూ.. నష్టపోతున్న అన్నదాతలు విభిన్న పంటలపై దృష్టి సారిస్తే లాభాల బాట పట్టొచ్చు. సేంద్రియ, ప్రకృతి సేద్యం ద్వారా పండించిన దిగుబడులకు మంచి డిమాండ్ ఉంటోంది. పండించిన పంటలను సరైన రీతిలో మార్కెటింగ్ చేసుకోవడమూ అవసరమే.
విభిన్న పంటల సాగు.. ఆపై సొంతంగా విక్రయాలు
మహబూబాబాద్ జిల్లా రైతుల స్ఫూర్తి
ఏటా ఒకే రకమైన పంటలు సాగు చేస్తూ.. నష్టపోతున్న అన్నదాతలు విభిన్న పంటలపై దృష్టి సారిస్తే లాభాల బాట పట్టొచ్చు. సేంద్రియ, ప్రకృతి సేద్యం ద్వారా పండించిన దిగుబడులకు మంచి డిమాండ్ ఉంటోంది. పండించిన పంటలను సరైన రీతిలో మార్కెటింగ్ చేసుకోవడమూ అవసరమే. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన ఓ రైతు ప్రకృతి సేద్య విధానంలో 13 ఎకరాల్లో పలు రకాల పసుపు, వరి, కందితోపాటు అంతర పంటలూ పండిస్తున్నారు. వాటిని స్వయంగా విక్రయిస్తున్నారు. డోర్నకల్కు చెందిన రైతులు పంటల ఉత్పత్తుల విక్రయాలకు యాప్ను, మార్ట్నూ ఏర్పాటు చేసుకున్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకు ‘సాగు’తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. స్ఫూర్తి పంచుతున్నారు.
18 రకాల పసుపు.. 5 రకాల వరి
కల్వల రైతు ప్రకృతి సేద్యం
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వలకు చెందిన గంట దామోదర్రెడ్డి(69) సేద్యంలో వైవిధ్యం చాటుతున్నారు. తొలుత మూడేళ్లు అరెకరంలో పెసర, వేరుసెనగ సాగు చేసేవారు. 13 ఏళ్లుగా ఆరెకరాల సొంత భూమి, ఏడెకరాల కౌలు భూమిలో 18 రకాల పసుపు, 5 రకాల వరి, 3 రకాల కంది పండిస్తున్నారు. వేరుసెనగ, నువ్వులు, పప్పుదినుసులూ సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా మినుము, పెసర, మిరప వేస్తున్నారు. 25 గుంటల్లో ఎరుపు(దేశీయ), నలుపు, మచ్చల కంది, గుంట స్థలంలో చేమదుంప వేశారు. పాలేకర్ విధానంలో జీవామృతం, కషాయాలను తయారు చేసుకుని పంటలకు వాడుతున్నారు. పంట ఉత్పత్తులను సొంతంగానే విక్రయిస్తున్నారు.
పసుపు పొడి విక్రయించి..
ఒకటిన్నర ఎకరాల్లో 18 రకాల పసుపు సాగు చేస్తున్నారు. కస్తూరి, 848, ప్రతిభ, రాజపురి, పీతాంబరి, ఎరుపు దుగ్గిరాల, సుగంధ, మామిడి అల్లం తదితరాలు ఇందులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి విత్తనాలు తెప్పించారు. రూ.లక్ష పెట్టుబడి పెడితే.. 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పొడి చేసి విక్రయిస్తే.. పెట్టుబడి పోను రూ.14 లక్షలు మిగులుతోందని దామోదర్రెడ్డి తెలిపారు.
దేశీయ వరి
దామోదర్రెడ్డి 3.5 ఎకరాల్లో ఎరుపు, నల్లపు, చెఖోవాతో పాటు చిట్టిముత్యాలు, బాస్మతి వరి సాగు చేస్తున్నారు. ఎరుపు వరి, బాస్మతి రకాలను ఆరుతడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. బియ్యాన్ని కిలో రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు.
ఆర్డర్లపై అమ్మకాలు..
పసుపును కేసముద్రంలోని మిల్లుల్లో పొడి పట్టిస్తున్నారు. పెసర, మినుము, కందులను స్వయంగా విసురురాయితో ఇంటి వద్దే పప్పుగా మార్చి.. కిలో ప్యాకెట్లను తయారు చేసి తెలుగు రాష్ట్రాల్లో 5వేల మందికి, దుబాయ్, అమెరికా ప్రాంతాల్లోని 30 మందికి పంపుతున్నారు. ఫోన్, వాట్సప్, ఎస్ఎంఎస్ల రూపంలో ఆర్డర్లు స్వీకరించి.. కొరియర్, ఆర్టీసీ కార్గో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతుంటారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడల్లో ఏటా నిర్వహించే అగ్రి ఎక్స్పోలో స్టాళ్లు పెట్టి వాటిలోనూ విక్రయిస్తుంటారు.
‘యాప్’తో లాభాల పంట!
ఖమ్మంలో రైతుల ‘కిసాన్ మార్ట్’
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్: పంటలు పండించడంలోనే కాదు.. విక్రయంలోనూ విజయపథంలో సాగుతున్నారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలేనికి చెందిన రైతులు. 2020 నవంబరులో మిరప ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీవో)ను ఏర్పాటు చేశారు. ఇందులో మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లోని 303 మంది సభ్యులుగా ఉన్నారు. అప్పుడే యాప్ను అందుబాటులోకి తెచ్చి.. దాని ద్వారా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, మసాలా దినుసులు, బియ్యం, డ్రైఫ్రూట్స్ల విక్రయాలు ప్రారంభించారు. అవసరమైన సరకుల్ని ఆర్డర్ చేస్తే.. వినియోగదారుల ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు.
రైతుల వద్దే కొనుగోలు
2021 జనవరిలో ఖమ్మంలో కిసాన్ మార్ట్ను ప్రారంభించారు. ఇందులో విక్రయించే 80 శాతం సరకులను రైతుల వద్దే కొనుగోలు చేస్తున్నారు. కందులు, పెసర్లు, బొబ్బర్లు, మినుములను మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొనుగోలు చేసి.. ఖమ్మంలోని మిల్లుల్లో మర ఆడిస్తున్నారు. రైతుల వద్ద సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి.. బియ్యం పట్టించి అమ్ముతున్నారు. నెలకు టన్ను బియ్యం విక్రయిస్తున్నారు. కారం, పసుపు, మునగాకు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, గోరింటాకు పొడులను మహిళలతో తయారు చేయించి అమ్ముతున్నారు.
రూ.60 లక్షల మూలనిధి
-రామారావు, కిసాన్మార్ట్ మిరప ఉత్పత్తిదారుల సంస్థ ఛైర్మన్
ప్రస్తుతం సంస్థ మూలనిధి సుమారు రూ.60 లక్షలు ఉంది. ప్రతి నెలా నిర్వహణ, సరకుల కొనుగోలు ఖర్చులు పోనూ రూ.50 వేల లాభం వస్తోంది. వేసవిలో 3టన్నుల మామిడిని, మునగాకు పొడిని అమెరికాకు పంపించాం. ప్రభుత్వం సహకారం అందిస్తే విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. యాప్ను 10వేల మంది వినియోగిస్తున్నారు. ప్లేస్టోర్లో ‘కిసాన్మార్ట్ ఖమ్మం’ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక