మన్యం వీరుడే మనకు స్ఫూర్తి
బ్రిటిష్ పాలకుల్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశంలోని కోట్లాది ఆదివాసీల ధైర్యానికి, స్థైర్యానికి, సంస్కృతికి ప్రతీక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ‘దమ్ముంటే నన్ను ఆపండి’ అని గర్జించి బ్రిటిష్ సైనికుల
‘ఒకే భారత్... శ్రేష్ఠ భారత్’ భావనకు ఆయన ప్రతీక
అల్లూరి ఆదర్శంగా సవాళ్లపై పోరాటం
సీతారామరాజు జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం ఆవిష్కరణ
భీమవరం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
మనదే రాజ్యం, వందేమాతరం ఒక్కటే..
సీతారామరాజు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ‘మనదే రాజ్యం’ అన్న నినాదంతో ఆయన దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. వందేమాతరం, మనదే రాజ్యం అన్న భావన ఒక్కలాంటివే. మన్యం వీరుడిగా ఆంగ్లేయులతో పోరాటం ప్రారంభించినప్పుడు అల్లూరి సీతారామరాజు వయసు 24-25 సంవత్సరాలే. అంత చిన్న వయసులోనే ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయనతో కలసి బ్రిటిషర్లపై పోరాడిన ఎందరో యువకులు తమ జీవితాలను పణంగా పెట్టారు. వారి త్యాగాల నుంచి యావత్ జాతి.. శక్తిని, స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి.
- ప్రధాని మోదీ
బ్రిటిష్ పాలకుల్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశంలోని కోట్లాది ఆదివాసీల ధైర్యానికి, స్థైర్యానికి, సంస్కృతికి ప్రతీక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ‘దమ్ముంటే నన్ను ఆపండి’ అని గర్జించి బ్రిటిష్ సైనికుల తుపాకులకు ఎదురొడ్డిన ఆ మహావీరుడి ధైర్యసాహసాలే స్ఫూర్తిగా.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై 130 కోట్ల మంది ప్రజలు ఐకమత్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా, అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం నిర్వహించిన ఉత్సవాల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెదఅమిరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని సభా వేదికపై నుంచి రిమోట్ కంట్రోల్తో వర్చువల్గా ప్రారంభించారు. ‘మన్యం వీరుడు, తెలుగుజాతి యుగపురుషుడు, తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా.. అంటూ స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన నేలపై మనమందరం కలుసుకోవడం మన అదృష్టం’ అంటూ మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి, మన్యంలో రంప తిరుగుబాటు జరిగి వందేళ్లయిన సందర్భంగా ఈ సంవత్సరమంతా దేశంలో పలు చోట్ల ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. యావత్ భారతజాతిని ఒక్కతాటిపై నిలుపుతున్న ‘ఒకే భారత్.. శ్రేష్ఠ భారత్’ భావనకు అల్లూరి అసలైన ప్రతీక అని కొనియాడారు. ఆ భావన అనాదిగా దేశ చరిత్రలోనూ, సాంస్కృతిక చింతనలోనూ మమేకమైందన్నారు.
యువత నడుం బిగించాలి
‘అప్పట్లో యువతే స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపించింది. దేశాభివృద్ధికి యువత మళ్లీ నడుం కట్టేందుకు ఇది మంచి సమయం. ప్రస్తుతం యువతకు ఎన్నో అవకాశాలు, వారి ప్రతిభను చాటుకోవడానికి మరెన్నో వేదికలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకుని కలల్ని సాకారం చేసుకోవాలి. యువకులు, మహిళలు, దళితులు, ఆదివాసీలతోపాటు, అణచివేతకు గురైన వర్గాలన్నీ ముందుకొచ్చి దేశానికి నాయకత్వం వహిస్తే.. భారత్ అభివృద్ధిని ఎవరూ నిలువరించలేరు’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ
ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి అని, ఇక్కడికి రావడం తన అదృష్టమని ప్రధాని అన్నారు. ఈ వీరభూమికి శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. సీతారామరాజు 125వ జన్మదినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశం తరపున ఆయనకు పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎందరో దేశభక్తులకు, స్వాతంత్య్ర సమరయోధులకు పురిటిగడ్డ అని ప్రధాని కొనియాడారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు వంటివారు జన్మించిన పుణ్యభూమి ఈ ప్రాంతమని కొనియాడారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయుల తుపాకులకు ఎదురొడ్డి పోరాడిన గొప్ప యోధుడన్నారు. ‘దేశం కోసం బలిదానాలు చేసిన ఆ యోధులందరి కలల్ని ఈ అమృత కాలంలో సాకారం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఎనిమిదేళ్లుగా భారత ప్రభుత్వం దేశంలోని గిరిజనుల సంక్షేమానికి అవిశ్రాంత కృషి చేస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారిగా గిరిజనుల సంస్కృతిని, ఘన వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు గిరిజన మ్యూజియంలు ఏర్పాటు చేస్తోంది. దానిలో భాగంగానే లంబసింగిలో అల్లూరి సీతారామరాజు స్మారక గిరిజన స్వాతంత్య్ర యోధుల మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
అల్లూరి నడయాడిన ప్రాంతాల అభివృద్ధి
అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేసి జాతికి అంకితమిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ‘విశాఖ జిల్లా పాండ్రంగిలో ఆయన జన్మస్థలాన్ని, రంప తిరుగుబాటులో భాగంగా ఆయన దాడి చేసిన చింతపల్లి పోలీస్స్టేషన్ను పునరుద్ధరిస్తాం. మోగల్లులో అల్లూరి ధ్యాన మందిరాన్ని నిర్మిస్తాం. అమృత మహోత్సవాల స్ఫూర్తి చిహ్నంగా వీటి నిర్మాణాలు చేపడతాం. మన స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల్లోని చారిత్రక ఘట్టాలను దేశ ప్రజలందరికీ తెలియజేయాలన్న సంకల్పానికి అల్లూరి 125వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిదర్శనం. స్వాతంత్య్ర సంగ్రామం కొంత కాలానికో, కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదు.. ఇది దేశంలోని నలుమూలలకూ చెందిన ఎందరో త్యాగధనుల చరిత్ర. మన దేశ భిన్నత్వం, ఐకమత్యం, సంస్కృతిలోని శక్తికి స్వాతంత్య్రోద్యమం అసలు సిసలు ప్రతీక’ అని ఆయన పేర్కొన్నారు.
మాతృభాషలో బోధనతో ఎంతో మేలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్కిల్ ఇండియా మిషన్’ వల్ల గిరిజన కళలు, నైపుణ్యాలకు కొత్త గుర్తింపు లభిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమం... గిరిజనుల కళాత్మక నైపుణ్యాలద్వారా ఆదాయ సముపార్జనకు మార్గం చూపిందన్నారు. ‘ఆకాంక్షిత జిల్లాల’ పథకం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, వారి విద్యాభివృద్ధికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. గిరిజనుల పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు దేశవ్యాప్తంగా 750 ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మాతృభాషలో బోధనకు పెద్దపీట వేస్తున్నామని.. ఇది గిరిజన ప్రాంతాల పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు.
90 అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర
గిరిజన యువతకు జీవనోపాధి మార్గాల్ని పెంచేందుకు ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు మోదీ తెలిపారు. ‘కేవలం 12 అటవీ ఉత్పత్తులకే కనీస మద్దతు ధర ఉండగా మేం ఆ సంఖ్యను 90కి పెంచాం. 3 వేలకుపైగా వనగణ వికాస కేంద్రాలు, 50వేలకు పైగా వనగణ స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాం. గిరిజన కళాకృతులు, ఉత్పత్తులకు సరికొత్త అవకాశాలు కల్పించేందుకు ఈ గ్రూపులు ఎంతో తోడ్పడుతున్నాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు.
సామాజిక ఐక్యతా సంస్కర్త అల్లూరి: జగన్
సామాజిక ఐక్యత ఆవశ్యకతను, గొప్పతనాన్ని చాటిచెప్పిన గొప్ప సంస్కర్త అల్లూరి సీతారామరాజు అని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. భావాలపరంగా ఎన్నటికీ మరణం లేని విప్లవవీరుడాయన అని కొనియాడారు. భీమవరం సభలో సోమవారం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘తెలుగుజాతికి, భారత దేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు. అడవి బిడ్డలకు ఆరాధ్య దైవం. ఆయన వ్యక్తిత్వానికి, గొప్పతనానికి, త్యాగానికి నివాళులర్పిస్తున్నాం. ఆ మహనీయుడి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే.. ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టాం. అక్కడా ఆయన కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోంది. దేశం, అడవి బిడ్డల కోసం తనను తాను అర్పించుకున్న ఆ మహావీరుడికి వందనం. సీతారామరాజు ఎప్పటికీ చరితార్ధుడే. ఆయన త్యాగం ప్రతి ఒక్కరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంది’ అని జగన్ కొనియాడారు.
ఏడాది పాటు జయంత్యుత్సవాలు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను సోమవారం నుంచి వచ్చే సంవత్సరం జులై 4 వరకూ ఏడాది పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ప్రకటించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దిల్లీ, విశాఖపట్నం, హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహిస్తామని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రాంతాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. భీమవరం సభలో ఆయన ప్రసంగించారు. ‘ఈ ఏడాదంతా ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో అల్లూరి పేరు మార్మోగాలి. ఆయన కుటుంబీకుల్ని, ఆయనతో కలిసి పనిచేసిన గిరిజన సైన్యంలోని ముఖ్యులైన గంటం దొర, మల్లు దొర, వీరయ్య దొర, కంకిపాటి ఎండుపడాల్, శంకోజీ ముక్కడు, బొంకుల మోదిగాడు, భీమవరానికి చెందిన వేగిరాజు సత్యనారాయణ (అగ్గిరాజు) తదితరుల కుటుంబీకుల్ని కలుస్తాం’ అని కిషన్రెడ్డి తెలిపారు.
ఆహ్వానం పలికారు... జాబితాలో పేరు లేదన్నారు
తెదేపా నేత అచ్చెన్నాయుడు
ఈనాడు, అమరావతి- భీమవరం అర్బన్, న్యూస్టుడే: అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆహ్వానం మేరకు భీమవరం వెళ్లిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అవమానం ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోదీకి హెలిప్యాడ్ దగ్గర స్వాగతం పలికేవారి జాబితాలోగానీ, వేదికపైకి ఆహ్వానితుల్లోగానీ తన పేరు లేదని తెలియడంతో... అచ్చెన్నాయుడు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. భీమవరంలో అల్లూరి విగ్రహానికి నివాళులర్పించి వెనుతిరిగారు. అచ్చెన్నాయుడుకు సంబంధించి ప్రొటోకాల్ విషయంలో పొరపాటు జరిగిందని.. దానికి చింతిస్తున్నామని, క్షమాపణ కోరుతున్నట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ప్రజలతో మమేకమయ్యేందుకే ఈ వేడుకను నిర్వహించామని, రాజకీయాలను పరిష్కరించేందుకు కాదని సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM