Huzurabad By Election: ఈటలకే జీ హుజూర్
ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా... తెరాస, భాజపాల మధ్య నువ్వానేనా అన్నట్లు జరిగిన హోరాహోరీ పోరులో ఈటల ఘన విజయం సాధించారు.
హోరాహోరీ పోరులో తెరాసపై భాజపా విజయకేతనం
హుజూరాబాద్లో 23,855 ఓట్ల ఆధిక్యంతో రాజేందర్ గెలుపు
ధరావతు గల్లంతైన కాంగ్రెస్
మంగళవారం రాత్రి ఫలితం వెలువడిన అనంతరం కరీంనగర్లో నిర్వహించిన విజయోత్సవంలో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ఈటల రాజేందర్, బండి సంజయ్
ఈనాడు డిజిటల్, కరీంనగర్: ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా... తెరాస, భాజపాల మధ్య నువ్వానేనా అన్నట్లు జరిగిన హోరాహోరీ పోరులో ఈటల ఘన విజయం సాధించారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై 23,855 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నాలుగు నెలలుగా సాగిన ఈ పోరుపై రాజకీయ వర్గాలతోపాటు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మొదటినుంచీ ఈటలదే ఆధిపత్యం
మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ఆరంభమైనప్పటి నుంచి ఈటల ఆధిపత్యం ప్రదర్శించారు. రెండు రౌండ్లు (8, 11) మినహా అన్నింటిలో భాజపా ఆధిక్యాన్ని కొనసాగించింది. తెరాస అభ్యర్థి సొంత గ్రామంలో కూడా భాజపా ఎక్కువ ఓట్లను దక్కించుకుంది. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడమే కాకుండా కేవలం 3,014 ఓట్లకే పరిమితమైంది. ఈటల రాజీనామాతో వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయానికి తెరాస తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ రాజేందర్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. హుజూరాబాద్, జమ్మికుంట పురపాలక సంఘాల్లోనూ పట్టును నిరూపించుకొన్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, గ్రామాలవారీగా ఉన్న వ్యక్తిగత సంబంధాలు ఈ ప్రతిష్ఠాత్మక పోరులో ఆయనకు విజయాన్ని చేకూర్చి పెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2004 నుంచి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన ఈటలకు ఇది ఏడో విజయం. గతంలో రెండుసార్లు రాజీనామా చేసి గెలుపొందగా, ఇప్పుడు మూడోసారి రాజీనామా చేసి విజయం సాధించారు. ఆరుసార్లు కారు గుర్తుపై గెలిచిన రాజేందర్ ఈ ఉపఎన్నికలో కమలం గుర్తుపై పోటీచేసి గెలుపొందారు.
విజయచిహ్నం చూపుతున్న ఈటల దంపతులు, భాజపా నేతలు ధర్మారావు, వివేక్
తెరాస ఆవిర్భవించిన కొంతకాలానికే ఆ పార్టీలో చేరిన ఈటల అప్పటి నుంచి కీలకనేతగా పని చేశారు. తెరాస శాసనసభ పక్ష నేతగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఆర్థిక, పౌరసరఫరాలు, ఆరోగ్య శాఖల మంత్రిగా పని చేశారు. ఈ ఏడాది ఆరంభంలో ఎసైన్డ్ భూములు ఆక్రమించుకొన్నారని ఆయనపై విచారణకు ఆదేశించడంతోపాటు మంత్రివర్గం నుంచి తొలగించారు. దీంతో శాసనసభ స్థానానికి రాజీనామా చేసి భాజపాలో చేరి ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. సుదీర్ఘకాలం నియోజకవర్గంలో ఉన్న సంబంధాలను పటిష్ఠం చేసుకొనే ప్రయత్నం చేశారు.
తెరాస, భాజపాతో చెదిరిన కాంగ్రెస్
ఈ ఎన్నికల్లో అభ్యర్థి ఖరారు నుంచి ప్రచారం వరకూ కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడింది. దీన్ని తెరాస, భాజపాలు అవకాశంగా మలచుకుని పలువురు కాంగ్రెస్ నేతల్ని చేర్చుకున్నాయి. కాంగ్రెస్ స్థానిక నేతల్లో కీలకమైనవారు చాలామంది తెరాసలోనో, భాజపాలోనో చేరిపోవడంతో కాంగ్రెస్కు నియోజవర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం సమస్యగా మారింది. నాయకులతో పాటు కాంగ్రెస్ ఓట్లపైనా రెండు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే 2018 ఎన్నికల్లో 69,737 ఓట్లను పొందిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి కేవలం 3014 ఓట్లకే పరిమితమైంది.
సుదీర్ఘ ప్రచారం...అలుపెరుగని నేతలు
జూన్ 12న శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటల రెండు రోజుల అనంతరం 14న భాజపాలో చేరారు. అప్పటినుంచి హుజూరాబాద్లో ఎన్నికల సందడి మొదలైంది. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా అధికార తెరాస, భాజపాలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. సుదీర్ఘకాలం ప్రచారం జరిగిన ఎన్నికగా రికార్డు సృష్టించింది. నేతలు అలుపెరగకుండా ప్రచారం చేశారు. ఆగస్టు 11న తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పార్టీ ప్రకటించింది. అంతకుముందు నుంచే తెరాస, భాజపాలు ప్రచారాన్ని చేపట్టాయి. అభ్యర్థుల ఖరారు అనంతరం ప్రచారం తారస్థాయికి చేరుకుంది. కాగా హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగా ‘దళితబంధు’ పథకం చర్చనీయాంశమైంది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దీనిని నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బుల పంపిణీతో పాటు అధికార దుర్వినియోగం జరుగుతోందని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్న ఎన్నికల సిబ్బంది
పోస్టల్ ఓట్లతో తెరాసదే పైచేయి
హుజూరాబాద్ ఎన్నికల్లో పోస్టల్ ఓట్లలో తెరాస ఎక్కువ దక్కించుకుంది. తెరాసకు 455 ఓట్లు రాగా, భాజపాకు 242 ఓట్లు, కాంగ్రెస్కు రెండు ఓట్లు వచ్చాయి.
రాత్రి 7 గంటల వరకు లెక్కింపు
కరీంనగర్లోని ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. మొత్తం 14 టేబుళ్లపై ఈ ప్రక్రియను 22 రౌండ్లుగా చేపట్టారు. 306 పోలింగ్ బూత్లలో ఉన్న ఓట్లను లెక్కించేందుకు ప్రతి రౌండ్కు అరగంట నుంచి ముప్పావుగంట సమయం పట్టింది. 30 మంది అభ్యర్థులుండటం వల్ల ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండేసి ఈవీఎంలలో ఉన్న అభ్యర్థుల ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. దీంతో అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా ఫలితాలు బయటకు వచ్చాయి.
* కౌంటింగ్ కేంద్రానికి ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ వచ్చి ఓట్ల సరళిని చూసి వెళ్లిపోయారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇక్కడికి రాలేదు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఫలితం వెలువడిన తర్వాత లెక్కింపు కేంద్రానికి వచ్చి ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
27 మందికి 11,726 ఓట్లు
నోటాకు 1036 ఓట్లు
ఈనాడు, హైదరాబాద్: భాజపా, తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు కాకుండా మిగిలిన 27 మందికి 11,726 ఓట్లు పోలయ్యాయి. లెక్కించిన 2,05,965 ఓట్లలో భాజపా, తెరాస, కాంగ్రెస్లకు 1,93,203 ఓట్లు రాగా నోటాకు 1036 ఓట్లు పోలయ్యాయి. ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్, స్వతంత్ర అభ్యర్థి సాయన్నలు పలు రౌండ్లలో కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించారు. మొదటి రౌండ్లో కాంగ్రెస్కు 119 ఓట్లు రాగా శ్రీకాంత్కు 122 వచ్చాయి. ఏడో రౌండ్లో కాంగ్రెస్కు 94 రాగా.. ఆయనకు 98 ఓట్లు లభించాయి. ఎనిమిదో రౌండ్లో కాంగ్రెస్కు 89 ఓట్లు పోలవగా సాయన్నకు 118, శ్రీకాంత్కు 92 ఓట్లు వచ్చాయి. 18వ రౌండ్లోనూ కాంగ్రెస్ కన్నా వారు ముందు నిలిచారు. 19, 20 రౌండ్లలో సాయన్న కాంగ్రెస్ కంటే ఎక్కువే సాధించారు. సాయన్న 1,942 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!