మెకానికల్ను మార్చేద్దాం
ఒకవైపు పరిశ్రమలు ఆటోమేషన్ వైపు శరవేగంగా మారిపోతుంటే అందుకు తగ్గట్లు మెకానికల్ ఇంజినీరింగ్ సిలబస్ మారడం లేదు. ఫలితంగా కొత్తవారికి కొలువులు దక్కడంలేదు. ఉద్యోగాలు చేస్తున్నవారిని
ఆటోమేషన్కు తగ్గట్లు సిలబస్ మార్పు
ఐటీ సంబంధ అంశాలతో కొత్త పాఠ్య ప్రణాళిక
విద్యా, పరిశ్రమల నిపుణులతో కమిటీని నియమించిన ఏఐసీటీఈ
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం
గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తుంటే మెకానికల్ ఇంజినీరింగ్లో మన విద్యార్థులు ఇంకా స్టీమ్ ఇంజిన్తో నడిచే రైళ్ల గురించి చదువుకుంటున్నారు. మన అవసరాలు ఒకటైతే... తరగతి గదిలో చెప్పేదొకటి ఉంటోంది
-2019లో జేఎన్టీయూహెచ్లో సిలబస్పై జరిగిన సదస్సులో అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య ఎం.పి.పూనియా ఆవేదన ఇది..
ఒకవైపు పరిశ్రమలు ఆటోమేషన్ వైపు శరవేగంగా మారిపోతుంటే అందుకు తగ్గట్లు మెకానికల్ ఇంజినీరింగ్ సిలబస్ మారడం లేదు. ఫలితంగా కొత్తవారికి కొలువులు దక్కడంలేదు. ఉద్యోగాలు చేస్తున్నవారిని ఇప్పటికాలానికి అనుగుణంగా నైపుణ్యాలు లేవని తొలగిస్తున్నాయి. అందుకే విద్యార్థులు బీటెక్ మెకానికల్ బ్రాంచి అంటే దూరం అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో ఏఐసీటీఈ అప్రమత్తమై మెకానికల్ ఇంజినీరింగ్ సిలబస్ను ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని నిర్ణయించింది. ఐఐటీ బాంబే మెకానికల్ బ్రాంచి ఆచార్యుడు బి.రవి ఛైర్మన్గా పలువురు నిపుణులతో ఇటీవల కమిటీని నియమించింది.
ఐటీ పరిశ్రమకూ పనికొచ్చేలా..
అన్నిరకాల పరిశ్రమలు యంత్రాలతో పనిచేసేలా ఆటోమేషన్ దిశగా మారిపోతున్నాయి. అలాంటిచోట్ల సిబ్బంది పనిచేయాల్సి వస్తే పాలిటెక్నిక్ డిప్లొమా, ఐటీఐ పూర్తిచేసిన వారు సరిపోతారు. పరిశ్రమలు కోరుకుంటున్న నైపుణ్యాలుంటే అప్పుడు ఇంజినీర్లను నియమించుకుంటాయి. అందుకే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్(క్యాడ్), మెకట్రానిక్స్, 3డీ ప్రింటింగ్, డ్రోన్ల తయారీ, సాంకేతికతతో పాటు సాఫ్ట్వేర్ నైపుణ్యం ఉండేలా ఐటీ సంబంధ అంశాలను అధికంగా మార్చాలన్నది ఏఐసీటీఈ ఆలోచన. మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ తదితర పరిశ్రమల్లోనే కాకుండా ఐటీ పరిశ్రమల్లోనూ బీటెక్ మెకానికల్ ఇంజినీర్లను అధికంగా నియమించుకునేలా సిలబస్ను మార్చాలని మండలి భావిస్తోంది. అందుకే ఐఐటీలు, ఐఐఎస్సీ బెంగళూరు ఆచార్యులతో పాటు పరిశ్రమల నిపుణులను కూడా కమిటీలో నియమించింది. వచ్చే విద్యాసంవత్సరం(2022-23) నుంచే కొత్త సిలబస్ను అమలు చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది.
మూడో వంతూ నిండటం లేదు!
దేశవ్యాప్తంగా మెకానికల్ బ్రాంచిలో మూడో వంతు సీట్లు నిండటం గగనంగా మారింది. 2017-18 విద్యాసంవత్సరం దేశవ్యాప్తంగా 3,41,621 మెకానికల్ సీట్లు ఉండగా.. అందులో 1,59,920(46.80 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. నాలుగేళ్ల కిందటే ఆ పరిస్థితి ఉంటే ఇప్పుడు భర్తీ శాతం 35కి పడిపోయి ఉంటుందని నిపుణుల అంచనా. తెలంగాణలో 2018-19లో సీట్లు, 2021-22 విద్యాసంవత్సరంలో సీట్లతో పోల్చుకుంటే దాదాపు 40 శాతం తగ్గిపోయాయి. ప్రవేశాలు పొందినవారు ఈసారి 32.57 శాతం మాత్రమే. అదీ కన్వీనర్ కోటాలో.. యాజమాన్య కోటా సీట్లను కలుపుకొని చూస్తే నాలుగో వంతు కూడా నిండవని స్పష్టమవుతోంది. రాష్ట్రంలోనే కాదు.. ఎన్ఐటీల్లోనూ మెకానికల్ సీట్లు భారీగా మిగిలిపోయాయి. జోసా కౌన్సెలింగ్ తర్వాత ఎన్ఐటీ వరంగల్, ఏపీలో ఒక్కోచోట కూడా 15 సీట్లు భర్తీ కాలేదు. వాటికోసం మరో రెండుసార్లు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ‘అందరూ కంప్యూటర్ సైన్స్ కోరుకుంటుండటంతో జేఎన్టీయూహెచ్ అన్ని బ్రాంచీల్లో మేజర్, మైనర్ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెడుతోంది. బీటెక్ మూడో ఏడాది నుంచి మెకానికల్ విద్యార్థి... కృత్రిమ మేధ, రోబోటిక్స్ తదితర ఆసక్తి ఉన్న కోర్సులను ఎంచుకోవచ్చని’ అని మెకానికల్ ఆచార్యుడు విజయకుమార్రెడ్డి చెప్పారు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం