పల్లెకు రింగ్
తెలంగాణలోని నాలుగు జిల్లాల మీదుగా వెళ్లే ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం మార్గ ప్రణాళిక (అలైన్మెంట్) కోసం సేకరించాల్సిన భూములను గుర్తించే పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఆయా జిల్లాల్లోని 111 గ్రామాల
111 గ్రామాల మీదుగా ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర మార్గం
వచ్చే నెలలోగా భూముల గుర్తింపు పూర్తి
త్వరలో యజమానులకు నోటీసులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని నాలుగు జిల్లాల మీదుగా వెళ్లే ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం మార్గ ప్రణాళిక (అలైన్మెంట్) కోసం సేకరించాల్సిన భూములను గుర్తించే పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఆయా జిల్లాల్లోని 111 గ్రామాల వివరాలు ‘ఈనాడు’కు లభించాయి. భూముల గుర్తింపు ప్రక్రియను వచ్చేనెల చివరి వారంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గుత్తేదారు సంస్థకు స్పష్టం చేసింది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో క్షేత్రస్థాయిలో భూములను గుర్తించి గుర్తులను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 344 కిలోమీటర్ల మేరకు రెండు భాగాలుగా ప్రాంతీయ రింగు రోడ్డును కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే. 158 కిలోమీటర్ల ఉత్తర భాగానికి భూ సేకరణ చేసేందుకు వీలుగా మార్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఖరారు చేశాయి. ఇందుకోసం 4,620 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారుల అంచనా. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో భూముల గుర్తింపు కోసం సర్వే ముమ్మరంగా సాగుతోంది. రింగురోడ్డు దక్షిణ భాగానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం మాత్రమే తెలిపింది. దానికి తాత్కాలిక జాతీయ రహదారి నంబరును కేటాయించాల్సి ఉంది. ట్రాఫిక్ రద్దీపై మరో దఫా అధ్యయనం చేయాలని కేంద్రం కోరింది.
సమాయత్తమవుతున్న రెవెన్యూశాఖ
ఉత్తరమార్గంలో గుర్తించిన భూముల యజమానులకు త్వరలో భూ సేకరణ నోటీసులు జారీ చేసేందుకు రెవెన్యూ శాఖ సమాయత్తవుతోంది. మార్గ ప్రణాళికను రూపొందించిన కె అండ్ జె ప్రాజెక్ట్ సంస్థ ఆయా గ్రామాల జాబితాను ఇప్పటికే కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు పంపినట్లు సమాచారం. ఆ మేరకే సర్వే నిర్వహిస్తున్నారు. ఇది పూర్తయ్యాక రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. భూసేకరణ యత్నాలపై ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణ ప్రక్రియ కోసం నాలుగు జిల్లాల పరిధిలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాన్ని కేంద్రం సూచించింది. అందుకు సంబంధించిన కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు.
ఏయే గ్రామాలంటే...
సంగారెడ్డి జిల్లా: మల్కాపూర్, గిర్మాపూర్ (కొండాపూర్ మండలం). పెద్దాపూర్(సదాశివపేట). నాగపూర్, ఇరిగిపల్లె, చింతల్పల్లి, కలబ్గూర్, సంగారెడ్డి, తాడ్లపల్లె, కులబ్గూర్, (సంగారెడ్డి). కాసాల, దేవులపల్లి, హత్నూర్, దౌల్తాబాద్ (హత్నూర్). శివ్వంపేట, వెండికోల్, వెంకట కిష్టాపూర్, లింగంపల్లె, కోర్పోల్ (చౌటకూర్).
మెదక్ జిల్లా: నాగులపల్లె, మూసాపేట, మహ్మదాబాద్, పెద్దచింతకుంట, రుస్తుంపేట, సీతారాంపూర్, మల్పర్తి, అచ్చపేట్, రెడ్డిపల్లె, చిన్నచింతకుంట, ఖాజీపేట, మంతూర్, గొల్లపల్లె, తిర్మలాపూర్, తుల్జాపూర్ (నర్సాపూర్). వెంకటాపూర్ (కౌడిపల్లె), లింగోజిగూడ, కొత్తపేట, రత్నాపూర్, పాంబండ, ఉసిరికపల్లె, పోతుబోగడ, గుండ్లపల్లె, కొంతాన్పల్లి (శివ్వంపేట). వట్టూరు, దండుపల్లె, నాగులపల్లె, తూప్రాన్, ఇస్లాంపూర్, దాతరపల్లె, గుండ్రెడ్డిపల్లె, కిష్టాపూర్, వెంకటాయపల్లె, నర్సంపల్లె, మల్కాపూర్ (తూప్రాన్). మాసాయిపేట(మాసాయిపేట).
సిద్దిపేట జిల్లా: బేగంపేట, యల్కల్ (రాయిపోల్). బంగ్లా వెంటకాపూర్, మక్తామాసన్పల్లె, కోమటిబండ, గజ్వేల్, సంగాపూర్, ముట్రాజ్పల్లె, ప్రజ్ఞాపూర్, సిరిగిరిపల్లె (గజ్వేల్). మజీద్పల్లె, మెంటూర్, జబ్బాపూర్, మైలారం, కొండాయిపల్లె (వర్గల్). మర్కూక్, పాములపర్తి, అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి (మర్కూక్). అలీరాజ్పేట, ఇటిక్యాల, పీర్లపల్లె (జగ్దేవ్పూర్).
యాదాద్రి-భువనగిరి జిల్లా: గంధమల్ల, వీరారెడ్డిపల్లె, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయిపల్లి, వేల్పుపల్లి (తుర్కపల్లి). మల్లపూర్, దత్తాకపల్లి (యాదగిరిగుట్ట), భువనగిరి, రాయగిరి, కేసారం, పెంచికలపహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్నగర్, ఎర్రంబల్లి, నందనం (భువనగిరి). పహిల్వాన్పూర్, కంచనపల్లె, టేకులసోమారం, రెడ్లరేపాక, ప్రొద్దుటూర్, వర్కూట్పల్లె, గోకారం, వలిగొండ (వలిగొండ). నేలపట్ల, చిన్నకొండూర్, తాళ్లసింగారం, స్వాములవారి లింగోటం, చౌటుప్పల్, లింగోజిగూడ, పంతంగి, తంగడ్పల్లి (చౌటుప్పల్).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం