పల్లెకు రింగ్
తెలంగాణలోని నాలుగు జిల్లాల మీదుగా వెళ్లే ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం మార్గ ప్రణాళిక (అలైన్మెంట్) కోసం సేకరించాల్సిన భూములను గుర్తించే పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఆయా జిల్లాల్లోని 111 గ్రామాల
111 గ్రామాల మీదుగా ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర మార్గం
వచ్చే నెలలోగా భూముల గుర్తింపు పూర్తి
త్వరలో యజమానులకు నోటీసులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని నాలుగు జిల్లాల మీదుగా వెళ్లే ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం మార్గ ప్రణాళిక (అలైన్మెంట్) కోసం సేకరించాల్సిన భూములను గుర్తించే పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఆయా జిల్లాల్లోని 111 గ్రామాల వివరాలు ‘ఈనాడు’కు లభించాయి. భూముల గుర్తింపు ప్రక్రియను వచ్చేనెల చివరి వారంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గుత్తేదారు సంస్థకు స్పష్టం చేసింది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో క్షేత్రస్థాయిలో భూములను గుర్తించి గుర్తులను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 344 కిలోమీటర్ల మేరకు రెండు భాగాలుగా ప్రాంతీయ రింగు రోడ్డును కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే. 158 కిలోమీటర్ల ఉత్తర భాగానికి భూ సేకరణ చేసేందుకు వీలుగా మార్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఖరారు చేశాయి. ఇందుకోసం 4,620 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారుల అంచనా. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో భూముల గుర్తింపు కోసం సర్వే ముమ్మరంగా సాగుతోంది. రింగురోడ్డు దక్షిణ భాగానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం మాత్రమే తెలిపింది. దానికి తాత్కాలిక జాతీయ రహదారి నంబరును కేటాయించాల్సి ఉంది. ట్రాఫిక్ రద్దీపై మరో దఫా అధ్యయనం చేయాలని కేంద్రం కోరింది.
సమాయత్తమవుతున్న రెవెన్యూశాఖ
ఉత్తరమార్గంలో గుర్తించిన భూముల యజమానులకు త్వరలో భూ సేకరణ నోటీసులు జారీ చేసేందుకు రెవెన్యూ శాఖ సమాయత్తవుతోంది. మార్గ ప్రణాళికను రూపొందించిన కె అండ్ జె ప్రాజెక్ట్ సంస్థ ఆయా గ్రామాల జాబితాను ఇప్పటికే కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు పంపినట్లు సమాచారం. ఆ మేరకే సర్వే నిర్వహిస్తున్నారు. ఇది పూర్తయ్యాక రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. భూసేకరణ యత్నాలపై ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణ ప్రక్రియ కోసం నాలుగు జిల్లాల పరిధిలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాన్ని కేంద్రం సూచించింది. అందుకు సంబంధించిన కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు.
ఏయే గ్రామాలంటే...
సంగారెడ్డి జిల్లా: మల్కాపూర్, గిర్మాపూర్ (కొండాపూర్ మండలం). పెద్దాపూర్(సదాశివపేట). నాగపూర్, ఇరిగిపల్లె, చింతల్పల్లి, కలబ్గూర్, సంగారెడ్డి, తాడ్లపల్లె, కులబ్గూర్, (సంగారెడ్డి). కాసాల, దేవులపల్లి, హత్నూర్, దౌల్తాబాద్ (హత్నూర్). శివ్వంపేట, వెండికోల్, వెంకట కిష్టాపూర్, లింగంపల్లె, కోర్పోల్ (చౌటకూర్).
మెదక్ జిల్లా: నాగులపల్లె, మూసాపేట, మహ్మదాబాద్, పెద్దచింతకుంట, రుస్తుంపేట, సీతారాంపూర్, మల్పర్తి, అచ్చపేట్, రెడ్డిపల్లె, చిన్నచింతకుంట, ఖాజీపేట, మంతూర్, గొల్లపల్లె, తిర్మలాపూర్, తుల్జాపూర్ (నర్సాపూర్). వెంకటాపూర్ (కౌడిపల్లె), లింగోజిగూడ, కొత్తపేట, రత్నాపూర్, పాంబండ, ఉసిరికపల్లె, పోతుబోగడ, గుండ్లపల్లె, కొంతాన్పల్లి (శివ్వంపేట). వట్టూరు, దండుపల్లె, నాగులపల్లె, తూప్రాన్, ఇస్లాంపూర్, దాతరపల్లె, గుండ్రెడ్డిపల్లె, కిష్టాపూర్, వెంకటాయపల్లె, నర్సంపల్లె, మల్కాపూర్ (తూప్రాన్). మాసాయిపేట(మాసాయిపేట).
సిద్దిపేట జిల్లా: బేగంపేట, యల్కల్ (రాయిపోల్). బంగ్లా వెంటకాపూర్, మక్తామాసన్పల్లె, కోమటిబండ, గజ్వేల్, సంగాపూర్, ముట్రాజ్పల్లె, ప్రజ్ఞాపూర్, సిరిగిరిపల్లె (గజ్వేల్). మజీద్పల్లె, మెంటూర్, జబ్బాపూర్, మైలారం, కొండాయిపల్లె (వర్గల్). మర్కూక్, పాములపర్తి, అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి (మర్కూక్). అలీరాజ్పేట, ఇటిక్యాల, పీర్లపల్లె (జగ్దేవ్పూర్).
యాదాద్రి-భువనగిరి జిల్లా: గంధమల్ల, వీరారెడ్డిపల్లె, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయిపల్లి, వేల్పుపల్లి (తుర్కపల్లి). మల్లపూర్, దత్తాకపల్లి (యాదగిరిగుట్ట), భువనగిరి, రాయగిరి, కేసారం, పెంచికలపహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్నగర్, ఎర్రంబల్లి, నందనం (భువనగిరి). పహిల్వాన్పూర్, కంచనపల్లె, టేకులసోమారం, రెడ్లరేపాక, ప్రొద్దుటూర్, వర్కూట్పల్లె, గోకారం, వలిగొండ (వలిగొండ). నేలపట్ల, చిన్నకొండూర్, తాళ్లసింగారం, స్వాములవారి లింగోటం, చౌటుప్పల్, లింగోజిగూడ, పంతంగి, తంగడ్పల్లి (చౌటుప్పల్).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన