లాక్డౌన్ ఎత్తివేత
తెలంగాణలో కరోనా కట్టడి కోసం గత నెల 12 నుంచి విధించిన లాక్డౌన్ను ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని, అన్ని కార్యకలాపాలను యథావిధిగా పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలను జులై 1 నుంచి పూర్తిస్థాయిలో
నేటి నుంచి పూర్తిస్థాయిలో సేవలు
1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభం
ఈ-పాస్ విధానం రద్దు
రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కట్టడి కోసం గత నెల 12 నుంచి విధించిన లాక్డౌన్ను ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని, అన్ని కార్యకలాపాలను యథావిధిగా పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలను జులై 1 నుంచి పూర్తిస్థాయిలో పునఃప్రారంభించాలని, తరగతులను ప్రత్యక్షంగా నిర్వహించాలని ఆదేశించింది. దేశంలో, ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కూడా కేసులు తగ్గుతున్న విషయాన్ని మంత్రిమండలి పరిగణనలోకి తీసుకుంది. ఇతర రాష్ట్రాల కంటే వేగంగా తెలంగాణలో కరోనా అదుపులోకి వచ్చిందని వైద్యశాఖ అధికారులందించిన నివేదికలను పరిశీలించింది. కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని నిర్ధారణకొచ్చింది. లాక్డౌన్ ప్రభావాన్ని చర్చించింది. జనజీవనం యథాతథంగా సాగాలని, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినొద్దనే ఉద్దేశంతో లాక్డౌన్ను తొలగించాలని తీర్మానించింది. అన్ని రకాల ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని అధికారులను ఆదేశించింది. రోజంతా రాకపోకలకు ఆమోదం తెలిపింది. వాహనాలకు ఈ-పాస్ విధానాన్ని రద్దు చేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరు, ఆన్లైన్ తరగతులు తదితరాలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని విద్యాశాఖకు సూచించింది. విద్యాసంస్థలు, శిక్షణ కేంద్రాలు జులై మొదటి తేదీ నుంచి పునఃప్రారంభమవుతాయని తెలిపింది. శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
నిర్లక్ష్యం తగదు
కరోనా తీవ్రత దృష్ట్యా మే నెల 12 నుంచి లాక్డౌన్ విధించిన ప్రభుత్వం దశలవారీగా సమయాల సడలింపులతో శనివారం వరకు 39 రోజులపాటు దాన్ని అమలు చేసింది. లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన వైరస్ విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ వాడకాన్ని విధిగా కొనసాగించాలని సూచించింది. స్వీయ నియంత్రణ విధానాలను పాటించాలని స్పష్టం చేసింది.
పాస్ లేకుండానే రాకపోకలు
తెలంగాణలో లాక్డౌన్ ఎత్తేయడంతో వాహన రాకపోకలకు సంబంధించిన ఈ-పాస్ల వ్యవస్థను రద్దు చేశారు. ఆదివారం నుంచి ఈ-పాస్లు లేకుండానే వాహనాలను రాష్ట్రంలోకి అనుమతించనున్నారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనదారులు మాత్రం ఆయా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగా రవాణా అనుమతులు పొంది ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
అన్లాక్పై నేడు మరో ఉత్తర్వు
లాక్డౌన్ను ఎత్తివేస్తూ ప్రభుత్వం శనివారం ఒక జీవో ఇచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు, వ్యాపార సంస్థలు, దుకాణాలు రోజంతా నడుస్తాయని అందులో పేర్కొంది. లాక్డౌన్కు ముందున్న పరిస్థితిని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. కానీ ఆంక్షల ఎత్తివేతకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో లేవు. అంతర్రాష్ట బస్సు సర్వీసులు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, సినిమా థియేటర్లు, కబ్బులు, క్రీడామైదానాలు, పబ్లతో పాటు వివాహాలు, అంత్యక్రియలకు సంబంధించి లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. లాక్డౌన్కు ముందు సైతం కొన్ని ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వీటన్నిటిపైనా స్పష్టత కోసం ప్రభుత్వం ఆదివారం మరో ఉత్తర్వును జారీ చేయనున్నట్లు తెలిసింది.
అంతర్రాష్ట్ర బస్సులు అప్పుడే కాదు
అంతర్రాష్ట్ర బస్సుల కోసం మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. తెలంగాణలో లాక్డౌన్ను ఎత్తివేసినా, ఆంధ్రప్రదేశ్లో రాత్రి వేళ కర్ఫ్యూ కొనసాగుతుండడమే దీనికి కారణం. అక్కడ ప్రస్తుతం సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి సర్వీసులు నడపలేమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
కేసులు పెరిగితే మళ్లీ లాక్డౌన్
ప్రజల సౌలభ్యం, సాధారణ జనజీవనం కోసం లాక్డౌన్ ఎత్తివేశాం. మళ్లీ కరోనా కేసులు పెరిగి పరిస్థితి అదుపు తప్పితే.. మరోసారి లాక్డౌన్ విధించి, కఠిన ఆంక్షలు అమలు చేస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో లాక్డౌన్ విధించడంతో వ్యాధి నియంత్రణలోకి వచ్చింది. మరోవైపు అనేక రంగాలపై లాక్డౌన్ ప్రభావం చూపింది. వ్యాధి వ్యాప్తిపై రోజూ అంచనా వేస్తాం. కేసులు తీవ్రమైతే మరోసారి లాక్డౌన్ విధించేందుకు వెనుకాడబోం. ప్రజలు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి.
-మంత్రిమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం