లాక్డౌన్ ఎత్తివేత
తెలంగాణలో కరోనా కట్టడి కోసం గత నెల 12 నుంచి విధించిన లాక్డౌన్ను ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని, అన్ని కార్యకలాపాలను యథావిధిగా పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలను జులై 1 నుంచి పూర్తిస్థాయిలో
నేటి నుంచి పూర్తిస్థాయిలో సేవలు
1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభం
ఈ-పాస్ విధానం రద్దు
రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కట్టడి కోసం గత నెల 12 నుంచి విధించిన లాక్డౌన్ను ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని, అన్ని కార్యకలాపాలను యథావిధిగా పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలను జులై 1 నుంచి పూర్తిస్థాయిలో పునఃప్రారంభించాలని, తరగతులను ప్రత్యక్షంగా నిర్వహించాలని ఆదేశించింది. దేశంలో, ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కూడా కేసులు తగ్గుతున్న విషయాన్ని మంత్రిమండలి పరిగణనలోకి తీసుకుంది. ఇతర రాష్ట్రాల కంటే వేగంగా తెలంగాణలో కరోనా అదుపులోకి వచ్చిందని వైద్యశాఖ అధికారులందించిన నివేదికలను పరిశీలించింది. కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని నిర్ధారణకొచ్చింది. లాక్డౌన్ ప్రభావాన్ని చర్చించింది. జనజీవనం యథాతథంగా సాగాలని, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినొద్దనే ఉద్దేశంతో లాక్డౌన్ను తొలగించాలని తీర్మానించింది. అన్ని రకాల ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని అధికారులను ఆదేశించింది. రోజంతా రాకపోకలకు ఆమోదం తెలిపింది. వాహనాలకు ఈ-పాస్ విధానాన్ని రద్దు చేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరు, ఆన్లైన్ తరగతులు తదితరాలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని విద్యాశాఖకు సూచించింది. విద్యాసంస్థలు, శిక్షణ కేంద్రాలు జులై మొదటి తేదీ నుంచి పునఃప్రారంభమవుతాయని తెలిపింది. శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
నిర్లక్ష్యం తగదు
కరోనా తీవ్రత దృష్ట్యా మే నెల 12 నుంచి లాక్డౌన్ విధించిన ప్రభుత్వం దశలవారీగా సమయాల సడలింపులతో శనివారం వరకు 39 రోజులపాటు దాన్ని అమలు చేసింది. లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన వైరస్ విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ వాడకాన్ని విధిగా కొనసాగించాలని సూచించింది. స్వీయ నియంత్రణ విధానాలను పాటించాలని స్పష్టం చేసింది.
పాస్ లేకుండానే రాకపోకలు
తెలంగాణలో లాక్డౌన్ ఎత్తేయడంతో వాహన రాకపోకలకు సంబంధించిన ఈ-పాస్ల వ్యవస్థను రద్దు చేశారు. ఆదివారం నుంచి ఈ-పాస్లు లేకుండానే వాహనాలను రాష్ట్రంలోకి అనుమతించనున్నారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనదారులు మాత్రం ఆయా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగా రవాణా అనుమతులు పొంది ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
అన్లాక్పై నేడు మరో ఉత్తర్వు
లాక్డౌన్ను ఎత్తివేస్తూ ప్రభుత్వం శనివారం ఒక జీవో ఇచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు, వ్యాపార సంస్థలు, దుకాణాలు రోజంతా నడుస్తాయని అందులో పేర్కొంది. లాక్డౌన్కు ముందున్న పరిస్థితిని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. కానీ ఆంక్షల ఎత్తివేతకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో లేవు. అంతర్రాష్ట బస్సు సర్వీసులు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, సినిమా థియేటర్లు, కబ్బులు, క్రీడామైదానాలు, పబ్లతో పాటు వివాహాలు, అంత్యక్రియలకు సంబంధించి లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. లాక్డౌన్కు ముందు సైతం కొన్ని ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వీటన్నిటిపైనా స్పష్టత కోసం ప్రభుత్వం ఆదివారం మరో ఉత్తర్వును జారీ చేయనున్నట్లు తెలిసింది.
అంతర్రాష్ట్ర బస్సులు అప్పుడే కాదు
అంతర్రాష్ట్ర బస్సుల కోసం మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. తెలంగాణలో లాక్డౌన్ను ఎత్తివేసినా, ఆంధ్రప్రదేశ్లో రాత్రి వేళ కర్ఫ్యూ కొనసాగుతుండడమే దీనికి కారణం. అక్కడ ప్రస్తుతం సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి సర్వీసులు నడపలేమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
కేసులు పెరిగితే మళ్లీ లాక్డౌన్
ప్రజల సౌలభ్యం, సాధారణ జనజీవనం కోసం లాక్డౌన్ ఎత్తివేశాం. మళ్లీ కరోనా కేసులు పెరిగి పరిస్థితి అదుపు తప్పితే.. మరోసారి లాక్డౌన్ విధించి, కఠిన ఆంక్షలు అమలు చేస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో లాక్డౌన్ విధించడంతో వ్యాధి నియంత్రణలోకి వచ్చింది. మరోవైపు అనేక రంగాలపై లాక్డౌన్ ప్రభావం చూపింది. వ్యాధి వ్యాప్తిపై రోజూ అంచనా వేస్తాం. కేసులు తీవ్రమైతే మరోసారి లాక్డౌన్ విధించేందుకు వెనుకాడబోం. ప్రజలు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి.
-మంత్రిమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..