Rajnath Singh: త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తు
భారత తొలి త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 13 మంది మృత్యువాతపడ్డ హెలికాప్టర్ ప్రమాదంపై త్రివిధ దళాలు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి.
హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంటులో రాజ్నాథ్ ప్రకటన
జనరల్ రావత్ మృతిపై ఉభయ సభల సంతాపం
ఘటనాస్థలంలో లభ్యమైన బ్లాక్బాక్స్
విషమంగా గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ పరిస్థితి
మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలింపు
దిల్లీలోని విమానాశ్రయంలో గురువారం త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ పార్ధివదేహం
వద్ద నివాళులు అర్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ
ఈనాడు-చెన్నై; న్యూస్టుడే- బెంగళూరు, కోయంబత్తూరు; దిల్లీ: భారత తొలి త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 13 మంది మృత్యువాతపడ్డ హెలికాప్టర్ ప్రమాదంపై త్రివిధ దళాలు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో ఈ దర్యాప్తు సాగుతున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. తమిళనాడులోని కున్నూర్ సమీపంలో బుధవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనపై పార్లమెంటు ఉభయ సభల్లో ఆయన ప్రకటన చేశారు. మరోవైపు- హెలికాప్టర్ కూలిపోయిన స్థలంలో అధికారులు బ్లాక్బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను నిర్ధారించడంలో అది కీలకంగా మారనుంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ పరిస్థితి విషమంగా ఉంది.
జనరల్ రావత్ సహా ఇతర మృతులకు లోక్సభ, రాజ్యసభ గురువారం నివాళులర్పించాయి. వారి మృతికి సంతాప సూచకంగా ఎంపీలు కొద్దిసేపు మౌనం పాటించారు. ప్రమాదంపై ఉభయ సభల్లోనూ రాజ్నాథ్ ప్రకటన చేశారు. ‘‘వాయుసేనకు చెందిన ఎంఐ-17వి5 హెలికాప్టర్ సూలూర్ వైమానిక స్థావరం నుంచి బుధవారం ఉదయం 11:48 గంటలకు గాల్లోకి లేచింది. మధ్యాహ్నం 12:15 గంటలకు అది వెల్లింగ్టన్కు చేరుకోవాల్సింది. కానీ దాదాపు 12:08 గంటలకు సులూర్ వైమానిక స్థావరంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో హెలికాప్టర్కు సంబంధాలు తెగిపోయాయి. తర్వాత కున్నూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడాన్ని కొంతమంది స్థానికులు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లారు. మంటల్లో కాలిపోయిన హెలికాప్టర్ శకలాలు వారికి కనిపించాయి. సహాయక బృందాలు, స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని.. బాధితులను కాపాడేందుకు ప్రయత్నించారు. వారిని హుటాహుటిన వెల్లింగ్టన్లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందగానే మేం వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధరిని బుధవారమే ఘటనాస్థలానికి పంపించాం’’ అని రక్షణ మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో త్రివిధ దళాల దర్యాప్తునకు వాయుసేన ఆదేశించినట్లు చెప్పారు. ఆ బృందం బుధవారమే వెల్లింగ్టన్కు చేరుకొని పని ప్రారంభించిందని తెలిపారు. జనరల్ రావత్ సహా ఇతర మృతుల అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పారు.
వరుణ్ సింగ్ తల్లిదండ్రులతో మాట్లాడుతున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
యోధుడిని కోల్పోయాం: ఓం బిర్లా
జనరల్ రావత్ మృతిపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నైపుణ్యవంతుడైన ఓ యోధుడిని, అసమాన వ్యూహచతురుడిని దేశం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. నాలుగు దశాబ్దాలకు పైగా దేశ సేవలో గడిపిన రావత్.. భద్రతారంగంలో గణనీయమైన సంస్కరణలు తెచ్చారని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అన్ని పార్టీల సభాపక్ష నాయకులు విడివిడిగా సంతాపం తెలిపేందుకు అనుమతించాలని విపక్ష నేత మల్లికార్జునఖర్గే కోరగా.. అలాంటి సంప్రదాయం లేదని, సభ మొత్తం నివాళులర్పిస్తుందని హరివంశ్ తెలిపారు.
వరుణ్ సింగ్కు 80% కాలిన గాయాలు
హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ను గురువారం ఉదయం వెల్లింగ్టన్ ఆసుపత్రి నుంచి రోడ్డుమార్గంలో తొలుత సూలూర్కు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రికి ప్రత్యేక విమానంలో తరలించారు. ఆయనకు 80% కాలిన గాయాలయ్యాయి. వరుణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్పై ఉంచారు. మరో 48 గంటలపాటు వెంటిలేటర్పైనే ఉంచి చికిత్స అందించనున్నట్లు వైద్యులు చెప్పారని వరుణ్ తండ్రి విశ్రాంత కర్నల్ కె.పి.సింగ్ తెలిపారు. అంతకుముందు- వెల్లింగ్టన్ ఆసుపత్రిని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించారు. వరుణ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు. గ్రూప్ కెప్టెన్ ప్రాణాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రపతికి వివరాలు చెప్పిన రాజ్నాథ్
హెలికాప్టర్ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరాలు చెప్పారు. త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతితో రాజ్నాథ్ గురువారం భేటీ అయ్యారు. ప్రమాద ఘటన, అనంతరం తలెత్తిన పరిస్థితుల గురించి ప్రథమ పౌరుడికి మంత్రి సమగ్రంగా వివరించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!