సంచి ఉంచి.. స్థలాన్ని సూచించి!

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవునితిర్మలాపూర్‌ గ్రామంలో ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో కల్లాలు లేకపోవడంతో ధాన్యం ఆరబోయడానికి అక్కడి రైతులకు పెద్దకొత్తపల్లి-వనపర్తి బీటీ రహదారే దిక్కు.

Published : 28 Nov 2021 05:04 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవునితిర్మలాపూర్‌ గ్రామంలో ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో కల్లాలు లేకపోవడంతో ధాన్యం ఆరబోయడానికి అక్కడి రైతులకు పెద్దకొత్తపల్లి-వనపర్తి బీటీ రహదారే దిక్కు. కోతల అనంతరం కొనుగోలు కేంద్రానికి అందరూ ఒకేసారి ధాన్యాన్ని తీసుకొస్తే స్థలం దొరకదన్న ఉద్దేశంతో ఆ గ్రామ రైతులు రహదారి వెంట ఇలా సంచులు ఉంచి, గాలికి కొట్టుకుపోకుండా వాటిపై రాళ్లు పెట్టారు. ఇది తమ స్థలం అని సూచించేలా రైతులు సుమారు 3 కిలోమీటర్ల మేర సంచులతో ‘రిజర్వు’ చేసుకున్న ఈ చిత్రం కల్లాల కొరతకు అద్దం పడుతోంది.  

- న్యూస్‌టుడే, పెద్దకొత్తపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని