TS News:ఇలాంటి ముఖ్యమంత్రిని ఇప్పటిదాకా చూడలేదు
తెలంగాణలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ధర్మయుద్ధం ప్రారంభమైందని, ఇందులో భాజపా విజయం సాధిస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అడిగే
కేసీఆర్ భయస్తుడు... అందుకే సంజయ్ను అరెస్టు చేయించారు
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్
భావోద్వేగానికి గురైన బండి సంజయ్
ఈనాడు, హైదరాబాద్; న్యూస్టుడే, గన్ఫౌండ్రి; న్యూస్టుడే, బేగంపేట: తెలంగాణలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ధర్మయుద్ధం ప్రారంభమైందని, ఇందులో భాజపా విజయం సాధిస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు, నిరసనలకు అధికారపక్షం సమాధానం చెప్పకుండా.. నేతలను జైలుకు పంపడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ భయస్తుడని, ఇలాంటి సీఎంను దేశంలో ఎక్కడా చూడలేదని అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సభలో శివరాజ్సింగ్ చౌహాన్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనను తీవ్రంగా విమర్శించారు.
గద్దె దించే వరకు విశ్రమించం..
‘శ్రీకృష్ణుడి జననంతో తనకు ప్రమాదమన్న భయంతో కంసుడు తన సోదరికి పుట్టిన పిల్లలందరినీ చంపించాడు. ఆ జైల్లోనే పుట్టిన కృష్ణుడు కంసుడిని వధించాడు... కేసీఆర్కు కలలో కూడా సంజయ్ గుర్తుకు వస్తుండడంతో భయంతో అరెస్టు చేయించారు.పిరికివాళ్లు, బయపడేవారే ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని జైలుకు పంపుతారు ఈ ముఖ్యమంత్రి ఎంతమందిని అరెస్టు చేస్తారో చూద్దాం. కేసీఆర్.. నేను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ని. తెలంగాణ గడ్డపైకి వచ్చా. భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జీ చేస్తే ఊరుకుంటామా? భాజపా అంటే బిర్యానీ అనుకున్నరా? మీ అరాచకపాలనకు వ్యతిరేకంగా భాజపా పోరాటానికి మద్దత్వివడానికే ఇక్కడికి వచ్చాను. మీరు రెండోసారి అయితే... నేను నాలుగోసారి సీఎం అయ్యాను. కానీ విపక్షాలతో మీలాగా నేను ఎన్నడూ వ్యవహరించలేదు. మీ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి మద్దత్వివడానికే ఇక్కడికి వచ్చాను. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు భాజపా శ్రేణులు విశ్రమించే ప్రసక్తి లేదు’ అని శివరాజ్ అన్నారు.
కేసీఆర్ను ఎలుకగా మార్చాలి...
శివరాజ్సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ‘కేసీఆర్ ఒక కథ చెబుతా విను.. అడవిలో తపస్సు చేసుకునే సాధువు ఓ ఎలుకను పిల్లి తినేందుకు ప్రయత్నిస్తే రక్షించాడు. దాని ప్రాణాలు కాపాడేందుకు కమండలంలో నీళ్లను చల్లి పులిగా మార్చాడు. పులి రూపంలో ఉన్న ఆ ఎలుక తన పూర్వరూపం బయటకు తెలియకుండా ఉండాలని సాధువునే చంపాలనుకుంది. దీంతో ఆ సాధువు తిరిగి దానిని ఎలుకగా మార్చేశాడు. అలాగే ఎలుక మాదిరిగా ఉన్న కేసీఆర్ను ప్రజలు ముఖ్యమంత్రి చేశారు. 2023 ఎన్నికల్లో తిరిగి ఆయనను ఎలుకగా మార్చాలి’ అన్నారు.
పంజాబ్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్పై నిలిపివేస్తే నిరసనకారుల చర్యకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మద్దతిస్తారా? ఇదేం రాజనీతి? అని శివరాజ్సింగ్ చౌహాన్ ప్రశ్నించారు.
* భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ఛుగ్ మాట్లాడుతూ ‘కరీంనగర్లో సంజయ్ అరెస్టు జలియన్వాలాబాగ్ ఘటనను తలపించింది. ఆ నగర పోలీసు కమిషనర్ జనరల్ డయ్యర్లా వ్యవహరించారు’ అంటూ మండిపడ్డారు.
ఉద్యోగులు ఓపిక పట్టాలి: సంజయ్
కేసీఆర్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉసురు పోసుకుంటున్నారని సంజయ్ విమర్శించారు. ‘భాజపా దేశంలోనే పెద్ద పార్టీ. నీది గింత పార్టీ. కేసీఆర్ను వదిలేది లేదు. ఆయన జైలుకు వెళితే శాశ్వతంగా అక్కడే ఉండాలని ప్రజలు పూజలు చేస్తరు. కేసులు, అరెస్టులే కేసీఆర్కు ఆయుధాలైతే.. జైళ్లు, బందిఖానాలే భాజపా పోరుగడ్డలుగా మారతాయి. సీఎంకు వంతపాడుతున్న సంఘాల నేతల భరతం పట్టాలని ఉద్యోగుల్ని కోరుతున్నా. 317 జీవో సవరించేదాకా భాజపా పోరాడుతుంది. లేదంటే ఉద్యోగులు రెండేళ్లు ఓపిక పడితే రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం రాగానే ఆ జీవోని రద్దు చేస్తుంది’ అన్నారు. సభలో ప్రసంగిస్తూ ‘మేమేం తప్పు చేశామో కేసీఆర్ చెప్పాలి. దళిత మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను జైలుకు పంపారు. ఇంకా అయిదుగురు కార్యకర్తలు జైలులో ఉన్నారు. ఒక కార్యకర్త కాలు విరిగింది’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. డీకే అరుణ, లక్ష్మణ్, రాజాసింగ్ కూడా కేసీఆర్పై విమర్శలు గుప్పించారు.
* కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యాక భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్కి ఘనస్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ర్యాలీగా పార్టీ ఆఫీసుకు వచ్చిన సంజయ్ శివరాజ్సింగ్ చౌహాన్కు పాదాభివందనం చేశారు. భాజపా ఎమ్మెల్యే ఈటల, నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, జితేందర్రెడ్డి, వివేక్, గరికపాటి మోహన్రావు పాల్గొన్నారు.
* భాజపా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 9న వరంగల్ సభకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, 11న మహబూబ్నగర్ సభకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ వస్తారని భాజపా తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం