విద్యా సంస్థలతో కలిసి కొత్తతరం సాంకేతికతల అభివృద్ధి
రక్షణ రంగంలో కొత్తతరం సాంకేతికతల అభివృద్ధికి 300 విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని రక్షణ శాఖ ఆర్అండ్డీ కార్యదర్శి, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఛైర్మన్
ఆస్కి వెబినార్లో డీఆర్డీవో ఛైర్మన్ జి.సతీష్రెడ్డి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రక్షణ రంగంలో కొత్తతరం సాంకేతికతల అభివృద్ధికి 300 విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని రక్షణ శాఖ ఆర్అండ్డీ కార్యదర్శి, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించి రూ.వెయ్యి కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నట్లు చెప్పారు. పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు కలిసి పనిచేస్తే ప్రపంచస్థాయి సాంకేతికతలను భారత్ అభివృద్ధి చేయగలదని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం రక్షణ రంగ ఆర్అండ్డీని వేగవంతం చేయడంపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి) గురువారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఒకప్పుడు డీఆర్డీవో డిజైన్ రూపొందించి అభివృద్ధి చేసి ఇస్తే పరిశ్రమలు వాటిని ఉత్పత్తి చేసేవి. ప్రస్తుతం ప్రైవేటు రంగంలోని పరిశ్రమలు సొంతంగానే క్షిపణులు, బాంబులను సైతం స్వయంగా డిజైన్ చేసే స్థాయికి ఎదిగాయి. డీఆర్డీవో రెండు వేల పరిశ్రమలతో కలిసి పనిచేస్తోంది. అలాగే రక్షణ రంగ సాంకేతికతల్లో కృత్రిమ మేధ వినియోగంపై దృష్టి పెట్టాం. డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధిలో మరింత వేగం పెంచాల్సి ఉంది. ప్రైవేటు సంస్థలు, అంకుర సంస్థలు వీటిపై బాగా పని చేస్తున్నాయి.
శాస్త్రవేత్తలకు ఐఐఎంలో శిక్షణ
శాస్త్రవేత్తలు డిజైన్ పరంగా పట్టు చూపిస్తున్నా.. మేనేజ్మెంట్, పరిపాలన నైపుణ్యాల్లో కొంత వెనకబడి ఉన్న మాట వాస్తవం. వీటిని అధిగమించేందుకు కీలక స్థానాల్లో ఉన్నవారికి ఐఐఎంలో శిక్షణ ఇప్పిస్తున్నాం. యాంటీ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి సైన్యం నుంచి ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పటికే సాంకేతికతను ఐదు కంపెనీలకు బదలాయించాం. క్షిపణులు, రాడార్లతో పాటు మరికొన్ని అంశాల్లో భారత్ ఇప్పటికే స్వయం సమృద్ధి సాధించింది. ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్న మిగతా వాటిపై దృష్టి పెట్టాలి. ప్రస్తుతం రక్షణ రంగంలో 60 శాతం స్వదేశీ ఉత్పత్తులు, టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. త్వరలోనే ఇది 80 శాతానికి చేరుతుంది. దేశీయంగా కొత్తతరం విమాన ఇంజిన్ల అభివృద్ధిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదివరకే అభివృద్ధి చేసిన కావేరి ఇంజిన్ను ఇతరత్రా వినియోగించుకునే అవకాశం ఉంది’’ అని వివరించారు. సమావేశంలో ఆస్కి ఛైర్మన్ కె.పద్మనాభయ్య తదితరులు మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి