ఆటా మహాసభలకు కవిత

వచ్చే నెల 1 నుంచి మూడు వరకు వాషింగ్టన్‌లో జరిగే అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆమె గురువారం రాత్రి అమెరికాకు బయల్దేరి వెళ్లనున్నారు

Published : 30 Jun 2022 06:18 IST

నేడు అమెరికాకు పయనం

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే నెల 1 నుంచి మూడు వరకు వాషింగ్టన్‌లో జరిగే అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆమె గురువారం రాత్రి అమెరికాకు బయల్దేరి వెళ్లనున్నారు. జులై 2న కవిత ఆటా మహాసభలకు హాజరై తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 8 గంటలకు ఆటా సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తారు. బతుకమ్మ పండగపై ఆటా ప్రచురించిన ప్రత్యేక సంచికను ఇదే సమావేశంలో కవిత ఆవిష్కరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని