తీరొక్క పూలతో బతుకమ్మ ఆడిన కవిత, జెన్నిఫర్‌

తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం నర్కూడ సమీపంలోని అమ్మపల్లి దేవాలయ ప్రాంగణంలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ నీరటి తన్వి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.

Published : 01 Oct 2022 05:53 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం నర్కూడ సమీపంలోని అమ్మపల్లి దేవాలయ ప్రాంగణంలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ నీరటి తన్వి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌తో కలిసి కవిత ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా ప్రజాప్రతినిధులతో తీరొక్క పూలతో కవిత బతుకమ్మలు పేర్చారు. దాదాపు 2గంటల పాటు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. మరోవంక. ఇదే సమయంలో అమ్మపల్లి దేవాలయాన్ని గవర్నర్‌ తమిళిసై ఆకస్మికంగా సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని