సికింద్రాబాద్‌ నుంచి ఖుర్దారోడ్‌కు 10, 11 తేదీల్లో ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌ నుంచి ఒడిశాలోని ఖుర్దారోడ్‌ స్టేషన్‌కు రెండు రోజులపాటు రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది.

Published : 09 May 2024 03:54 IST

ఏపీ, ఒడిశా ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి ఒడిశాలోని ఖుర్దారోడ్‌ స్టేషన్‌కు రెండు రోజులపాటు రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో సాయంత్రం 4.30కి రెండు రైళ్లు (07129, 07131) సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతాయి. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్‌, పలాస, బ్రహ్మపుర్‌ స్టేషన్లలో ఆగుతాయి. 13న ఏపీ, ఒడిశాల్లో పోలింగ్‌ ఉన్నందున రైల్వేశాఖ రైళ్లను ప్రకటించింది. 11, 12 తేదీల్లో ఖుర్దారోడ్‌ స్టేషన్‌ నుంచి రెండు రైళ్లు (07130, 07132) రాత్రి 10 గంటలకు తిరుగు ప్రయాణమై సికింద్రాబాద్‌కు చేరుకుంటాయి.

10న సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ మధ్య

సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ మధ్య ఈ నెల 10న ప్రత్యేక రైలు(07133) నడపనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. శుక్రవారం రాత్రి 7.40కి సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు మీదుగా నర్సాపూర్‌ చేరుతుంది. 11న ఇదే దారిలో రైలు(07134) తిరుగు ప్రయాణమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని