niranjan reddy: రాజీనామా సవాలుకు తోక ముడిచిన సంజయ్
‘వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి గురువారం సాయంత్రం 5 గంటల లోగా లేఖ తెప్పించాలని, అలా చేయలేని పక్షంలో రాజీనామా చేయాలని తాను విసిరిన సవాలుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోక
ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి లేఖ తెప్పించమంటే స్పందన లేదు
దొడ్డు వడ్లు కొనబోమన్న కేంద్రం లేఖను బయటపెడితే మళ్లీ అడుగుతున్నారు
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం ఇచ్చిన లేఖను చూపుతున్న నిరంజన్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్, వనపర్తి, న్యూస్టుడే: ‘వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి గురువారం సాయంత్రం 5 గంటల లోగా లేఖ తెప్పించాలని, అలా చేయలేని పక్షంలో రాజీనామా చేయాలని తాను విసిరిన సవాలుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోక ముడిచారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆక్షేపించారు. గురువారం ఆయన రెండు దఫాలుగా విలేకరులతో మాట్లాడారు. ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో మాట్లాడుతూ.. ‘‘యాసంగిలో రైతులు సాగుచేసే వరిపంట కొంటామని సాయంత్రం 5 గంటల్లోగా కేంద్రం నుంచి సంజయ్ అనుమతి లేఖ తెప్పించాలి. లేదంటే కేంద్రం లేఖ ఇచ్చే వరకు భాజపా నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. కేంద్ర మంత్రి పదవికి కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్ రాజీనామా చేయాలి. ఒకవేళ ధాన్యం కొనుగోలుపై మాట్లాడింది అబద్ధమైతే నేనే రాజీనామా చేస్తా’’ అని నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. సాయంత్రం వనపర్తిలో మాట్లాడుతూ.. ‘‘దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం చెప్పిందని మేమంటే.. కేంద్రం నుంచి అలాంటి లేఖ ఏమైనా ఉంటే బయటపెట్టమని సంజయ్ అడిగారు. ఇప్పుడు లేఖను చూపిస్తే ఆయన మళ్లీ అడగడం విడ్డూరంగా ఉంది. ఆయనకు ఆంగ్లం తెలియకుంటే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు. పంజాబ్ రాష్ట్రంలో మాదిరే తెలంగాణలోనూ కేంద్రం ఎందుకు వరి ధాన్యం సేకరించదని ప్రశ్నించారు.
మూడు గంటల్లో ముగిసిన సంజయ్ దీక్ష
‘‘బండి సంజయ్ రైతు దీక్ష అంటూ హడావిడి చేశారు. కేవలం మూడు గంటలకే దీక్ష ముగించి పారిపోయిన వారు రేపటి నుంచి తెలంగాణ మొత్తం దీక్షలు చేస్తారా? అసలు ఎందుకు దీక్ష తలపెట్టారో ఆయనకే తెలియాలి. రాష్ట్రంలో సాగునీటి వసతి కల్పించి పచ్చని పంటలను సాగు చేస్తున్నందుకా? రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నందుకా’’ అని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ‘‘ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్లోనూ ఇవ్వని విధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. భాజపా పాలిత రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ తెలుసు. ఉత్తర్ప్రదేశ్లో పంటలు కొనడం లేదని సాగు చేసిన పంటలను రైతులు తగులబెట్టుకుంటున్నట్లు భాజపా ఎంపీ వరుణ్గాంధీ ట్వీట్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల మీదికి కేంద్ర మంత్రి కుమారుడు వాహనం ఎక్కించిన విషయం మరవొద్దు. చేతనైతే నల్ల చట్టాలకు, విద్యుత్తు చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు చేసి రద్దు చేయించాలి’’ అని మంత్రి నిరంజన్రెడ్డి సవాలు విసిరారు.
కేంద్రం కొనగా మిగిలింది మేం కొంటాం
‘‘రాష్ట్రంలో వానాకాలంలో 1.35 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని కేంద్రానికి తెలిపితే 59.70 లక్షల టన్నుల కొనుగోలుకు అంగీకరించింది. మొత్తం కొనాలని చెబితే.. అంత వరి వేశారా? శాటిలైట్లో కనిపించడం లేదు అంటూ తాత్సారం చేస్తోంది. ఇప్పటికీ ఉన్నతాధికారులు దిల్లీలో ఉండి కేంద్రానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వానాకాలం పంటలో ఎఫ్సీఐ కొనుగోలు చేయగా మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. ఇందుకు ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు’’ అని తెలిపారు.
సంజయ్ ఆ లేఖ తెస్తే పాదాభివందనం చేస్తా: మంత్రి ఎర్రబెల్లి
బాలసముద్రం, న్యూస్టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష ఎందుకో తమకు అర్థం కావడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం సాయంత్రం హనుమకొండలోని తన నివాసంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎఫ్సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని బండి సంజయ్ కేంద్రం నుంచి లేఖ తెస్తే తాను పాదాభివందనం చేస్తానన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేసిందన్నారు. వానాకాలం, యాసంగి పంటలను తప్పకుండా కొంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం