Google: ఇంటర్వ్యూ చేస్తుండగా.. హెచ్ఆర్కి లేఆఫ్..!
గూగుల్(Google) ప్రకటించిన భారీ లేఆఫ్లో పలువురు ఉద్యోగులు ఊహించని రీతిలో ఉద్యోగాన్ని కోల్పోయారు. తాజాగా ఓ వ్యక్తి వెల్లడించిన స్టోరీ కూడా ఈ తరహాలోనిదే.
వాషింగ్టన్: దిగ్గజ సంస్థ గూగుల్(Google) చేపట్టిన భారీ లేఆఫ్స్లో రోజుకో కొత్త స్టోరీ వెలుగులోకి వస్తోంది. తమ పనిలో నిమగ్నమై ఉండగానే ఉద్యోగం పోయినవాళ్లున్నారు. సంస్థ కోసం ఒకరిని ఇంటర్వ్యూ చేస్తోన్న సమయంలోనే హెచ్ఆర్ సిబ్బంది ఒకరు ఉద్యోగం కోల్పోయారని ఓ వార్త సంస్థ కథనం పేర్కొంది. రిక్రూట్మెంట్ విభాగంలో ఉన్నవారికి కూడా ఈ లేఆఫ్స్ గురించి తెలియకపోవడం గమనార్హం.
డాన్ లానిగాన్ ర్యాన్.. గూగుల్లో రిక్రూట్మెంట్ విభాగ ఉద్యోగి. ఫోన్లో ఆయన ఇంటర్వ్యూ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాల్ కట్ అయింది. అలాగే సంస్థకు చెందిన ఒక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. తనతో పాటు మరికొందరికి ఈ పరిస్థితి ఎదురైంది. ఇదొక సాంకేతిక లోపంగా మేనేజర్ భావించినట్లు ర్యాన్ చెప్పారు. అయితే ఆ వెంటనే ఈ-మెయిల్ ద్వారా లేఆఫ్ సందేశం వచ్చినట్లు తెలిపారు. ఇలా అర్ధాంతరంగా సంస్థ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. తనకు ఇటీవలే మరో ఏడాదికి కాంట్రాక్టును పొడిగించారని.. జీతం గురించి కూడా చర్చించారని.. అంతలోనే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల గూగుల్ (Google) వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారమిచ్చారు. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రతిభను, మూలధనాన్ని అధిక ప్రాధాన్యతల వైపు మళ్లించడంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని అందులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?