ప్రయాణికులకు సారీ చెప్పేందుకు.. తైవాన్ నుంచి జపాన్కు ఎయిర్లైన్స్ అధిపతి!
తమ సంస్థ కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఓ ఎయిర్లైన్ (Airline) ఛైర్మన్ చేసిన పని అంతర్జాతీయంగా వైరల్ అయ్యింది. దేశం దాటి వెళ్లి మరీ ఆయన ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అనుకోని పరిస్థితుల్లో విమానాలు ఆలస్యమవడం లేదా రద్దయినప్పుడు ప్రయాణికులు (Airline Passengers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎయిర్లైన్ సంస్థలు వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. కొన్నిసార్లు గంటలు గంటలు ఎయిర్పోర్టు (Airport)లో ఎదురుచూడాల్సి వస్తుంది. తాజాగా తైవాన్కు చెందిన స్టార్లక్స్ ఎయిర్లైన్స్ (Starlux Airlines) విమాన ప్రయాణికులకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. జపాన్ (Japan) ఎయిర్పోర్టులో వారు చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎయిర్లైన్స్ అధిపతి.. స్వయంగా ఆ దేశానికి వెళ్లి ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు.
జపాన్ రాజధాని టోక్యో శివారులోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయంలో మే 6వ తేదీన స్టార్లక్స్ ఎయిర్లైన్స్ (Starlux Airlines)కు చెందిన ఓ విమానం తైవాన్ రాజధాని తైపీ బయల్దేరాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. దీంతో అందులోని ప్రయాణికులను తైపీ వెళ్లే మరో విమానంలోకి ఎక్కించారు. అప్పటికే ఆ విమానంలో కొంతమంది ప్రయాణికులున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. రెండో విమానం కూడా ఆలస్యమైంది. అర్ధరాత్రి వరకు ప్రయాణికులను విమానంలోనే ఉంచిన ఎయిర్లైన్ సిబ్బంది.. చివరకు విమానం రద్దయిందని తాపీగా చెప్పారు. దీంతో 300 మందికి పైగా ప్రయాణికులు రాత్రంతా ఎయిర్పోర్టులోనే గడపాల్సి వచ్చింది. మరుసటి రోజు వీరిని మరో విమానంలో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
దీంతో స్టార్లక్స్ సంస్థ తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుడు, సంస్థ ఛైర్మన్ చాంగ్ కు వీ హుటాహుటిన తైవాన్ (Taiwan) నుంచి జపాన్ బయల్దేరారు. మే 7వ తేదీన నరిటా ఎయిర్పోర్టులో దిగి అక్కడ చిక్కుకున్న ప్రయాణికులను స్వయంగా కలిసి క్షమాపణలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వాతావరణ పరిస్థితుల కారణంగా తొలి విమానం ఆలస్యమైంది. దీంతో మరో విమానంలో వారిని పంపించాలని ప్రయత్నించినా.. నిర్వహణ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. రెండో విమానంలోని సిబ్బంది పనివేళలు ముగియడంతో అది కూడా ఆలస్యమైంది. ఇందుకు క్షమాపణలు తెలియజేస్తున్నా. ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇస్తాం’’ అని తెలిపారు. ఎట్టకేలకు 16 గంటలు ఆలస్యంగా ఆ ప్రయాణికులు ఎయిర్పోర్టు నుంచి తమ గమ్యస్థానాలకు బయల్దేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
-
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్