Covid: భవిష్యత్తులో కరోనాలాంటి మరో మహమ్మారి రావొచ్చు: ప్రముఖ చైనా వైరాలజిస్ట్
భవిష్యత్తులో కొవిడ్ వంటిదే మరో మహమ్మారి ప్రపంచంపై దాడిచేసే అవకాశముందని చైనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ షీ జెంగ్లీ హెచ్చరించారు. దీనికి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
బీజింగ్: చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించి లక్షలాది మందిని బలితీసుకుంది. జనజీవనం స్తంభించేలా చేసింది. ప్రస్తుతం దీని ప్రభావం తగ్గి అంతా సద్దుమణిగినా.. భవిష్యత్తులో కరోనా వంటి మరో ప్రాణాంతక వైరస్ దాడి చేసే అవకాశముందని ప్రముఖ వైరాలజిస్ట్ షీ జెంగ్లీ హెచ్చరించారు. దీనికి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
చైనాకు చెందిన జెంగ్లీ.. జంతువుల ద్వారా వ్యాపించే వైరస్లపై పరిశోధనలు చేస్తుంటారు. ఈమెకు ‘బ్యాట్వుమెన్’ అనే పేరుంది. ‘అసెస్మెంట్ అండ్ సెరో-డయాగ్నోసిస్ ఫర్ కరోనా వైరసెస్ విత్ రిస్క్ ఆఫ్ హ్యూమన్ స్పిల్ఓవర్’ పేరుతో జెంగ్లీ పరిశోధనలు చేశారు.‘కరోనా వైరస్ వ్యాధులకు కారణమై ఉంటే.. కచ్చితంగా భవిష్యత్తులోనూ మళ్లీ మహమ్మారి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గబ్బిలాలు, ఎలుకలు, ఒంటెలు, పందులు పాంగోలియన్ తదితర జీవులతోనే ఈ వ్యాధికారక వైరస్ వ్యాపిస్తుంది’ అని పరిశోధన పత్రాల్లో పేర్కొన్నారు. కొవిడ్ను ఎదుర్కొన్నట్లే.. భవిష్యత్తులో వచ్చే ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం సంసిద్ధంగా ఉండాలన్నారు.
వైరస్ లక్షణాలు, జనాభా, జన్యు వైవిధ్యం, గతంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిన వైరస్ల ఆధారంగా మానవాళికి ప్రమాదకరమైన 40 కరోనా వైరస్ జాతులపై వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలతో కలిసి జెంగ్లీ ఈ పరిశోధనలు చేశారు. వాటిలో ఇప్పటికే ఆరు జాతుల కరోనా వైరస్లు మనిషికి సోకి వ్యాధులకు కారణమయ్యాయని, మరో మూడు జాతులు జంతువులకు కూడా సోకినట్లు తేలింది. కాగా.. జెంగ్లీ వాదనను చైనాకు చెందిన ఇతర వైరాలజిస్ట్లు తోసిపుచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాజాలో దాడులను ముగించాలి
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధ పరిస్థితులపై స్పెయిన్లోని బార్సెలోనాలో సోమవారం ఐరోపా సమాజం (ఈయూ), అరబ్, ఉత్తర ఆఫ్రికా దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. 42 దేశాలకు చెందిన ప్రతినిధులు భేటీకి వచ్చారు. -
బుకర్ ప్రైజ్ విజేత పాల్ లించ్
ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ను 2023 సంవత్సరానికి గాను ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ గెలుచుకున్నారు. ఆయన రాసిన ‘ప్రాఫెట్ సాంగ్’ నవలకు ఈ అవార్డు లభించింది. -
నకిలీ ప్రపంచంలో ‘నిజం’ కోసం ఆరాటం
సాంకేతిక సాయంతో తన ఫొటోలను అసభ్యంగా మార్చి ప్రచారంలో పెట్టారని ఇటీవల ఒక నటి ఆక్రోశించడంతో ‘డీప్ఫేక్’ అనే పదం బాగా వెలుగులోకి వచ్చింది. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. -
అమెరికాలో పని అనుమతులపై రగడ
మెక్సికో, వెనెజువెలా, కొలంబియా వంటి లాటిన్ దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూ కొత్త సమస్యలు కొనితెస్తోంది. అమెరికాలో పంటకోతలు, పండ్లు, కూరగాయలు తెంపడం, హోటళ్లు, దుకాణాల్లో, భవన నిర్మాణంలో పనిచేయడం వంటివాటితో వలసదారులు జీవనాధారం పొందుతున్నారు. -
నల్ల సముద్రంలో తుపాను.. అంధకారంలో 20 లక్షల మంది
నల్ల సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా రష్యా ఆక్రమిత క్రిమియా అతలాకుతలమైంది. దక్షిణ రష్యాలోని సోచీ తీరంలోనూ పెద్దఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. అనాపా, కుబాన్ తదితర ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించింది. -
భారతీయ కొవిడ్ బాధితులకు ప్రయోజనం అంతంతే
కొవిడ్-19 చికిత్సకు డెక్సామెథాసోన్ మందును ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ఐరోపావాసులకు కలిగేంత ప్రయోజనం భారతీయులకు కలగలేదని ప్రముఖ వైద్యపత్రిక ‘లాన్సెట్’ ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. -
ఊపిరితిత్తుల వాపుతో బాధపడుతున్న పోప్
ఊపిరితిత్తుల వాపుతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్(86).. యాంటీబయాటిక్స్ను ఉపయోగిస్తున్నారని వాటికన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఆయనకు నిమోనియా కానీ జ్వరం కానీ లేవని స్పష్టంచేసింది. -
పాక్లో భద్రతాబలగాలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్లో తెహ్రీక్-ఎ-తాలిబాన్(టీటీపీ) తీవ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. భద్రతా బలగాల్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడిచేశారు. -
న్యూజిలాండ్కు కొత్త ప్రధానిగా లక్సన్
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్టఫర్ లక్సన్ (53) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం దేశార్థికాన్ని మెరుగుపరచడమే తన ప్రథమ లక్ష్యమని ప్రకటించారు. -
పోలండ్కు అల్పాయుష్షు ప్రభుత్వం!
పోలండ్లో సోమవారం ప్రమాణ స్వీకారం చేసే మితవాద లా అండ్ జస్టిస్ పార్టీ ప్రభుత్వానికి 14 రోజుల్లోనే ఆయుష్షు తీరిపోనుంది. అక్టోబరులో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 460 స్థానాల్లో ఆ పార్టీకి 194 మాత్రమే వచ్చాయి. -
మెటాపై 33 అమెరికా రాష్ట్రాల దావా
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల మాతృ సంస్థ ‘మెటా’.. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచాన్ని సేకరించిందని ఆరోపిస్తూ అమెరికాలోని పలు రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. -
న్యూయార్క్లో రెచ్చిపోయిన ఖలిస్థానీ మద్దతుదారులు
అమెరికాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. సిక్కుల గురుపూర్ణిమ సందర్భంగా న్యూయార్క్లోని హిక్స్విల్ గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరణ్జీత్ సింగ్ సంధూను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. -
బ్యాక్టీరియాకు నాలుగుతరాల జ్ఞాపకాలు!
ఏకకణ జీవులైనప్పటికీ బ్యాక్టీరియాకు జ్ఞాపకశక్తి సామర్థ్యం ఉంటుందని, ఆ జ్ఞాపకాలను తమ వారసులకూ చేరవేయగలవని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
సొంత పాస్పోర్టు నంబర్లే ఇవ్వాలి
వీసాల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా రాయబార కార్యాలయం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఎఫ్, ఎం, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఇవి వర్తిస్తాయి. -
కాల్పుల విరమణ మరో 2 రోజులు పొడిగింపు
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో 2 రోజులు కొనసాగనుంది. తొలుత కుదుర్చుకున్న నాలుగు రోజుల ఒప్పందం సోమవారంతో ముగియడంతో ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో 2 రోజుల పొడిగింపునకు రెండు వర్గాలు అంగీకరించాయి. -
ఉభయ కొరియాల మధ్య సైనిక గస్తీ శిబిరాల పునరుద్ధరణ
ఇటీవల ఉత్తర కొరియా ఒక నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో దక్షిణ కొరియాతో ఉద్రిక్తత పెరిగింది. సరిహద్దులో గస్తీ శిబిరాలను ఉత్తర కొరియా పునరుద్ధరించింది. దక్షిణ కొరియాతో ఇదివరకు కుదిరిన సంధికి చెల్లుచీటీ రాసింది. -
కుమార్తె పెళ్లికి రూ.490 కోట్ల వ్యయం
ఆడంబరంగా పెళ్లి చేయాలంటే హంగూ ఆర్భాటం, భారీస్థాయి విందు, ఆకట్టుకునే అలంకరణలు.. ఇవన్నీ కనిపిస్తాయి. పారిస్ వేదికగా కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ పెళ్లి మాత్రం వీటిని సరికొత్త ఎత్తుకు తీసుకువెళ్లింది. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు 14 రోజుల జుడీషియల్ రిమాండ్
వివిధ కేసుల్లో అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు పాకిస్థాన్ అకౌంటబిలిటీ న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. -
ఐస్లాండ్లో మళ్లీ భూప్రకంపనలు
ఐరోపాలోని ద్వీప దేశం ఐస్లాండ్ వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది. ఒక్క ఆదివారమే 700 ప్రకంపనలను చవిచూసింది. వీటివల్ల గ్రిండావిక్ ప్రాంతాన్ని ఇప్పటికే స్థానికులు ఖాళీ చేయాల్సి వచ్చింది. -
WHO: ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి తప్పని వేధింపులు!
ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవిత కాలంలో శారీరక/లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.