China: కరోనా ఉద్ధృతిపై అవన్నీ తప్పుడు నివేదికలే: చైనా
చైనాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కానీ, దీనిపై ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న నివేదికలను ఆ దేశం ఖండించింది.
బీజింగ్: కరోనా వైరస్ కొత్త వేరియంట్లతో చైనా విలవిల్లాడుతోంది. కొవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్కు డిమాండ్ ఏర్పడిందని, శ్మశాన వాటికలు రగులుతూనే ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ వార్తలను చైనా తోసిపుచ్చింది. ఇవన్నీ వక్రీకరించిన కథనాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా ప్రారంభమైన నాటి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని వెల్లడించింది.
‘ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాం. దశలవారీగా వైరస్ విజృంభిస్తోంది. దానిని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సమయానుకూలంగా శాస్త్రీయ పద్ధతులను చైనా అనుసరిస్తోంది’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు.
కరోనా కేసుల సునామీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ జీరో కొవిడ్ విధానం నుంచి చైనా క్రమంగా దూరంగా జరుగుతోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు వచ్చే నెల 8వ తేదీ నుంచి క్వారంటైన్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. కొవిడ్ స్థాయిని క్లాస్ ‘ఎ’ ఇన్ఫెక్షన్ల నుంచి క్లాస్ ‘బి’ కి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ ప్రకటించింది. తద్వారా కొవిడ్ రోగులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి తప్పనిసరి క్వారంటైన్ సహా కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో లాక్ డౌన్ అవసరం లేకుండా పోయింది. చైనాలో 40 రకాల ఇన్ఫెక్షన్లను ఎ,బి,సి కేటగిరిల్లో వర్గీకరించారు. ‘ఎ’ కేటగిరిలో కలరా, ప్లేగు వంటివి ఉన్నాయి. మరోపక్క అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో చైనీయులు విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
చైనా ఉద్ధృతిని చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనా నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే భారత్, ఇటలీ, జపాన్, తైవాన్ వంటి దేశాలుండగా.. తాజాగా అమెరికా కూడా చేరింది. తమ దేశానికి వచ్చే చైనీయులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసింది. దీని ప్రకారం విమానం ఎక్కడానికి 48 గంటల ముందు వచ్చిన నెగెటివ్ ధ్రువపత్రాన్ని చూపించాల్సి ఉంది. జనవరి 5 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. చైనాతో పాటు హాంకాంగ్, మకావు నుంచి వచ్చే వారికి కూడా ఇది వర్తిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.