China: కరోనా ఉద్ధృతిపై అవన్నీ తప్పుడు నివేదికలే: చైనా
చైనాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కానీ, దీనిపై ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న నివేదికలను ఆ దేశం ఖండించింది.
బీజింగ్: కరోనా వైరస్ కొత్త వేరియంట్లతో చైనా విలవిల్లాడుతోంది. కొవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్కు డిమాండ్ ఏర్పడిందని, శ్మశాన వాటికలు రగులుతూనే ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ వార్తలను చైనా తోసిపుచ్చింది. ఇవన్నీ వక్రీకరించిన కథనాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా ప్రారంభమైన నాటి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని వెల్లడించింది.
‘ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాం. దశలవారీగా వైరస్ విజృంభిస్తోంది. దానిని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సమయానుకూలంగా శాస్త్రీయ పద్ధతులను చైనా అనుసరిస్తోంది’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు.
కరోనా కేసుల సునామీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ జీరో కొవిడ్ విధానం నుంచి చైనా క్రమంగా దూరంగా జరుగుతోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు వచ్చే నెల 8వ తేదీ నుంచి క్వారంటైన్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. కొవిడ్ స్థాయిని క్లాస్ ‘ఎ’ ఇన్ఫెక్షన్ల నుంచి క్లాస్ ‘బి’ కి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ ప్రకటించింది. తద్వారా కొవిడ్ రోగులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి తప్పనిసరి క్వారంటైన్ సహా కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో లాక్ డౌన్ అవసరం లేకుండా పోయింది. చైనాలో 40 రకాల ఇన్ఫెక్షన్లను ఎ,బి,సి కేటగిరిల్లో వర్గీకరించారు. ‘ఎ’ కేటగిరిలో కలరా, ప్లేగు వంటివి ఉన్నాయి. మరోపక్క అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో చైనీయులు విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
చైనా ఉద్ధృతిని చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనా నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే భారత్, ఇటలీ, జపాన్, తైవాన్ వంటి దేశాలుండగా.. తాజాగా అమెరికా కూడా చేరింది. తమ దేశానికి వచ్చే చైనీయులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసింది. దీని ప్రకారం విమానం ఎక్కడానికి 48 గంటల ముందు వచ్చిన నెగెటివ్ ధ్రువపత్రాన్ని చూపించాల్సి ఉంది. జనవరి 5 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. చైనాతో పాటు హాంకాంగ్, మకావు నుంచి వచ్చే వారికి కూడా ఇది వర్తిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక కార్యకలాపాలు కొనసాగించిన ఓ సెక్స్ వర్కర్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు నేతలు, హమాస్ నాయకులపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు. -
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో.. ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్ నియమితులయ్యారు. -
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్ ప్రమేయం ఉందా?
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. ఇరాన్ అధ్యక్షుడు (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో శత్రుదేశం ఇజ్రాయెల్ (Israel) పాత్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రపంచంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదాలివే..
Helicopter Crashes: ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన అత్యంత ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదాలు ఏవో చూద్దాం -
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
పారిస్లోని ఓ లగ్జరీ ఉత్పత్తుల కంపెనీలో భారీ చోరీ జరిగింది. మారణాయుధాలతో వచ్చిన దుండగులు రూ. కోట్ల విలువైన ఆభరణాలు, వస్తువులను ఎత్తుకెళ్లారు. -
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
తుర్కియే పంపిన అత్యాధునిక బైరక్తర్ అకిన్సి డ్రోన్లు ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ గాలింపులో బాగా ఉపయోగపడ్డాయి. ప్రమాద స్థలం వివరాలను అత్యంత కచ్చితత్వంతో ఇరాన్కు అందజేశాయి. -
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ విదేశాంగ మంత్రిని కోల్పోవడం ఇరాన్కు పెద్ద ఎదురు దెబ్బగా నిలిచింది. -
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
ఇరాన్ అధ్యక్షుడు రైసీ చాలా వేగంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఎదిగారు. ప్రాసిక్యూటర్గా జీవితం మొదలుపెట్టిన ఆయన అధ్యక్ష స్థానానికి చేరుకొన్నారు. -
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చివరి క్షణాలకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పటి ఫొటో అది. -
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బెల్ 212గా గుర్తించారు. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం ప్రపంచదేశాలను షాక్కు గురిచేసింది. -
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
ఇరాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశాధ్యక్షుడి ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా దేశ బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై చర్చ మొదలైంది. -
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
Iran president Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ధ్రువీకరించింది. -
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఐఆర్ఎన్ఏ పేర్కొంది. అక్కడి సహాయక బృందాలను పంపినట్లు వెల్లడించింది. -
రోదసిలోకి తెలుగుతేజం
తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. -
అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆకాశంలో రాకాసి ఉల్క
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. -
గాజాపై గగనతల దాడిలో 27 మంది మృతి
ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. -
బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్తుల కంటే రిషి సునాక్ దంపతుల సంపదే ఎక్కువ
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. -
కాంగోలో తిరుగుబాటుకు విఫలయత్నం
దేశంలో తిరుగుబాటుకు జరిగిన ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లు కాంగో సైన్యం ఆదివారం ప్రకటించింది. దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే