China: డ్రాగన్ కాఠిన్యం.. జంతువుల్లా బోనుల్లో ప్రజల క్వారంటైన్..!
ఈ చిత్రంలో వరుసగా కన్పిస్తున్న మెటల్ బాక్స్లు.. కొవిడ్ అనుమానితుల కోసం చైనా ఏర్పాటు చేసిన క్వారంటైన్ క్యాంప్ గదులు..! కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు
ఇంటర్నెట్డెస్క్: ఈ చిత్రంలో వరుసగా కన్పిస్తున్న మెటల్ బాక్స్లు.. కొవిడ్ అనుమానితుల కోసం చైనా ఏర్పాటు చేసిన క్వారంటైన్ క్యాంప్ గదులు..! కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు జీరో కొవిడ్ వ్యూహాన్ని అనుసరిస్తోంది డ్రాగన్ సర్కారు. ఈ క్రమంలో రోగులు, అనుమానితుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఆంక్షల పేరుతో వారిని జంతువుల మాదిరిగా బలవంతంగా నిర్బంధిస్తోంది. అక్కడ ఒక్క కేసు వచ్చినా ఊరంతా క్వారంటైన్లో ఉండాల్సిందే. అది కూడా ఇళ్లల్లో కాదు.. అధికారులు ఏర్పాటు చేసిన ఇలాంటి క్వారంటైన్ శిబిరాల్లో..!
చైనాలోని అతిపెద్ద నగరాలైన షియాన్, టియాంజిన్, అన్యాంగ్ ప్రాంతాల్లో మళ్లీ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో ఆయా నగరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎంతలా అంటే.. ఒక ప్రాంతంలో ఒక్క వ్యక్తికి పాజిటివ్గా తేలినా.. ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ బలవంతంగా క్వారంటైన్ శిబిరాలను తరలిస్తున్నారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా రెండు వారాల పాటు ఈ బాక్సుల్లాంటి గదుల్లో ఉండాల్సిందే. వీటిలో ఒక బెడ్తో పాటు మరుగుదొడ్డి ఉంటుంది. ఈ గదులకు చిన్న కిటికీలు ఉంటాయి. అందులో నుంచి కేవలం తల మాత్రమే బయటకు పెట్టి రోజువారీ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇక చిన్నారులు కూడా పెద్దల సమక్షంలో కాకుండా ఒంటరిగా గదుల్లో ఉండాల్సిందేనట.
చైనాలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలను క్వారంటైన్లకు తరలిస్తున్నారు. ఇందుకోసం వందల బస్సులను ఏర్పాటు చేశారు. ప్రజలను తరలించేందుకు క్యూలైన్లలో ఉన్న బస్సులు, చిన్నారులకు పీపీఈ కిట్లు వేసిన తరలిస్తున్న వీడియోలను ఇటీవల కొందరు సోషల్మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్గా మారాయి.
బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్కు సమయం దగ్గరపడుతోన్న వేళ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా కఠిన ఆంక్షలు విధిస్తోంది. ప్రస్తుతం అక్కడ దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు క్వారంటైన్లో ఉన్నారు. కొన్ని నగరాల్లో కఠిన లాక్డౌన్ అమల్లో ఉండటంతో ప్రజలకు నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు కొనుక్కునేందుకు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆంక్షల వల్ల వైద్య చికిత్స అందక ఇటీవల ఓ గర్భిణీ శిశువును కోల్పోవాల్సి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి