Imran Khan: ఇక పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు..!
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan), ఆయన పార్టీ నేతలపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు మీడియాలో ఆయన ప్రస్తావన లేకుండా చేయాలని తాజా ఆదేశాలు ఇచ్చింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్(Pakistan) ప్రభుత్వం పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)ను ఆంక్షల చట్రంలో బంధిస్తోంది. ఆయన పార్టీపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి ఆయన అన్ని ప్రధాన మీడియా సంస్థల ప్రసారాల్లో కనిపించరు. ఆయన పేరు వినిపించదు. మే 9న ఇమ్రాన్ అరెస్టు తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆగ్రహించిన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణమని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం పేర్కొంది.
దీనికి సంబంధించి పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(PEMRA).. అక్కడి మీడియా సంస్థల(Pakistani Media)కు ఆదేశాలు ఇచ్చింది. ‘విద్వేషాన్ని వ్యాప్తి చేసేవారు, అల్లరిమూకలు, వారికి సహకరించేవారిని మీడియా నుంచి పూర్తిగా నిర్మూలించండి’అని తన ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఎక్కడా ఇమ్రాన్ ఖాన్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. కానీ ఆయన పేరు, చిత్రాలు, చివరకు ఆయన ప్రస్తావన కూడా మీడియా సంస్థల్లో కనిపించదు, వినిపిచందని తెలుస్తోంది. అయితే దీనిపై నియంత్రణ సంస్థ(PEMRA) నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
తనను, తన పార్టీని అణచివేసేందుకు అధికార పక్షం మే 9 అల్లర్లను ఒక సాకుగా చూపుతోందని ఇమ్రాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు. దానిని చూపించి పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నారని ఆరోపించారు. ఆయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కార్యకర్తలతో నిత్యం మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఖాన్కు అనుకూలంగా వ్యవహరించే మీడియా సంస్థ కూడా ఆయన పేరు ప్రస్తావించడం లేదని తెలుస్తోంది.
తాజాగా సర్వేల ప్రకారం.. పాక్లో ఇమ్రాన్ అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా నిలిచారు. ఇక ఆయన తన ప్రసంగాలు, సభలతో నిత్యం మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. ఆయనకు సంబంధించిన కంటెంట్కు వ్యూయర్షిప్ కూడా అధికంగానే ఉంటుందని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం