North Korea: ఉత్తర కొరియా ఉద్ధృతితో కొత్త వేరియంట్లు పుట్టుకురావొచ్చు..!
ఉత్తర కొరియాలో కరోనావైరస్ విజృంభిస్తోన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఆ దేశ వాసులు లక్షల్లో మిస్టరీ జ్వరం బారినపడుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు.
ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఆ దేశ వాసులు లక్షల్లో మిస్టరీ జ్వరం బారినపడుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ఉద్ధృతి కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చేందుకు దోహదం చేయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
ఉత్తర కొరియాలో కరోనా పరిస్థితులపై స్పందిస్తూ.. ‘కరోనా కట్టడికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధనాలు వాడకపోతే.. ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే పరిణామమే. ఎటువంటి నియంత్రణ లేకుండా వైరస్ వ్యాప్తి చెందితే.. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే చెప్తోంది’ అంటూ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైక్ ర్యాన్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే టీకాలు వేయని, అరకొర వైద్య సేవలు అందుబాటులో ఉన్న ఆ దేశంలోని కొవిడ్ పరిస్థితులపై ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ హెచ్చరికలు చేశారు. అక్కడ వ్యాప్తిని అరికట్టేందుకు ఔషధాలు, టీకాలు, పరీక్షా సాధానాలు, సాంకేతిక సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
వారి పరిస్థితి మరింత దిగజారుతుంది: యూఎన్
ఇప్పటికే కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందిపడుతోన్న ఉత్తర కొరియా ప్రజలకు తాజా కొవిడ్ ఆంక్షలు భయంకరంగా మారనున్నాయని ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎటువంటి వివక్ష లేకుండా, సమయానుకూలంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు కట్టుబడి ఉండేలా వాటిని అమలు చేయాలని కోరింది.
ఇక బుధవారం 2.32 లక్షల మందికి పైగా కరోనా బారినపడ్డారు. ఆరు మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.7 మిలియన్లకు చేరగా.. మరణాలు 62కు పెరిగాయి. తాము కొద్దిసంఖ్యలోనే ఒమిక్రాన్ కేసుల్ని గుర్తించగలిగామని ఉత్తర కొరియా అధికారులు చెప్తుండగా.. ఈ జ్వరం కేసులన్నీ కొవిడ్ కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఉద్ధృతికి అధికారుల అపరిపక్వత, ఆలస్యంగా స్పందించడమే కారణమని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మండిపడ్డారు. రెట్టింపు వేగంతో పనిచేయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం