Donald Trump: ఫేస్బుక్, యూట్యూబ్లోకి డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ!
Donald trump back to Youtube and Facebook: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్, యూట్యూబ్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఆయా సోషల్ మీడియా ఖాతాలను సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ (Facebook), యూట్యూబ్లోకి (Youtube) రీ ఎంట్రీ ఇచ్చారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల ముందు ట్రంప్ ప్రముఖ సోషల్ మీడియాల్లోకి పునరాగమనం చేయడం ప్రాధాన్యం సతరించుకుంది. అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం ఆయన సోషల్ మీడియా ఖాతాలపై విధించిన నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ‘ఐ యామ్ బ్యాక్’ అంటూ ఫేస్బుక్, యూట్యూబ్ వేదికలపై శుక్రవారం అభిమానులను పలకరించారు.
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్నకు ఫేస్బుక్లో దాదాపు 34 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్లో సైతం 2.6 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. క్యాపిటల్ భవనంపై ఆయన అనుచరుల దాడి అనంతరం 2021లో ఆయన ట్విటర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా గ్రామ్ ఖాతాలపై నిషేధం విధించారు. ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్ వెళ్లిన వెంటనే ఆయన ఖాతాపై ఉన్న నిషేదాన్ని గతేడాది నవంబర్లోనే ఎత్తివేశారు. ఫేస్బుక్, ఇన్స్టా ఖాతాలలపై ఈ ఏడాది జనవరిలో నిషేధం తొలగించగా.. యూట్యూబ్ ఖాతా మాత్రం శుక్రవారమే అందుబాటులోకి వచ్చింది.
ఈ క్రమంలోనే ‘ఐయామ్ బ్యాక్’ అంటూ ఫేస్బుక్, యూట్యూబ్లో శుక్రవారం ట్రంప్ దర్శనమిచ్చారు. 2016 ఎన్నికల విజయోత్సవ సభ ప్రసంగాన్ని అందులో ఉంచారు. ‘ఇన్నాళ్లు మిమ్మల్ని వేచి ఉంచినందుకు క్షమించండి’ అంటూ ఓ కామెంట్ను జత చేశారు. సోషల్ మీడియాలోకి రీఎంట్రీ వెనుక 2024 ఎన్నికలే లక్ష్యమని అందులో చెప్పకనే చెప్పారు. మరోవైపు నెలల క్రితమే ట్విటర్ ఖాతా అందుబాటులోకి వచ్చినప్పటికీ ట్రంప్ ఇప్పటి వరకు అందులో ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హం. ట్విటర్లో ఆయనకు 87 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఒక్క ట్వీటూ చేయలేదని తెలుస్తోంది. ట్విటర్కు పోటీగా ఇప్పటికే ఆయన ‘ట్రూత్ సోషల్’ పేరిట సొంతంగా ఓ ప్లాట్ఫాంను నెలకొల్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..