Moscow: మాస్కోపై డ్రోన్ల దాడి..!
రష్యా రాజధాని మాస్కోపై కొన్ని వారాల వ్యవధిలోనే మరోసారి డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొంత మంది స్వల్పంగా గాయపడ్డారు.
ఇంటర్నెట్డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. రష్యా(Russia) రాజధాని మాస్కో(Moscow)పై నేడు డ్రోన్ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని రష్యా అధికారులు ధ్రువీకరించారు. ఈ దాడుల్లో కొంతమంది స్వల్పంగా గాయపడ్డట్లు పేర్కొన్నారు. తమ గగనతల రక్షణ వ్యవస్థలు చాలా వరకు డ్రోన్లను కూల్చివేశాయని తెలిపారు. ఈ దాడుల తర్వాత ఆ నగరంలోని అత్యవసర సేవల వ్యవస్థలు మొత్తాన్ని అప్రమత్తం చేశారు.
ఈ దాడులపై మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రీ మాట్లాడుతూ మాస్కో వైపుగా తరలివస్తున్న పలు డ్రోన్లను కూల్చివేశామని టెలిగ్రామ్ ఛానెల్లో పేర్కొన్నారు. ఈ డ్రోన్లను ఎక్కడి నుంచి.. ఎవరు ప్రయోగించారనే విషయం స్పష్టంగా తెలియలేదు. మాస్కో శివార్లలో కొన్ని డ్రోన్లను కూల్చేశారు. కొంత మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉక్రెయిన్ ఈ ఉగ్ర దాడులకు కారణమని రష్యా ఆరోపించింది. దాడి కోసం ప్రయోగించిన 8 డ్రోన్లను కూల్చివేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడికి కారణమైన కుట్రదారులను గుర్తిస్తున్నామని పేర్కొంది.
మాస్కోపై డ్రోన్ దాడులతో తమకు సంబంధం లేదని ఉక్రెయిన్ వెల్లడించింది. ‘‘వాస్తవానికి దాడుల తీవ్రం కావడం చూసి సంతోషిస్తాం. కానీ, వాటితో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఉక్రెయిన్పై చేసిన దాడులకు రష్యా కర్మఫలం అనుభవించడం క్రమంగా పెరుగుతోంది’’ అని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖెలోవ్ పొడల్యాక్ పేర్కొన్నారు.
మాస్కో నగర నడిబొడ్డున, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా కీలక పరిపాలనా యంత్రాంగమంతా కార్యకలాపాలు నిర్వహించే క్రెమ్లిన్ భవనాలపై మే తొలివారంలో రెండు డ్రోన్లు దాడి చేశాయి. ఈ భవనాల్లో అధ్యక్ష కార్యాలయం, నివాసం కూడా ఉన్నాయి. అయితే లక్ష్యాలను ఢీకొట్టకముందే ఆ డ్రోన్లను కూల్చేశామని అప్పట్లో రష్యా ప్రకటించింది. పుతిన్ను హత్య చేసేందుకే వీటిని ఉక్రెయన్ పంపిందని, ఇది ఉగ్రవాదచర్య అని పేర్కొంది. దాడి వీడియో దృశ్యాలు స్థానిక మాస్కో న్యూస్కు చెందిన టెలిగ్రామ్ ఛానల్లో కనిపించాయి. ఇందులో క్రెమ్లిన్ భవనాల వెనుక పొగ కమ్మిన దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో స్వతంత్రతను ఎవరూ ధ్రువీకరించలేదు. అయితే రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ‘‘మేం పుతిన్ లేదా మాస్కోపై దాడి చేయం’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..