Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!
భూకంపంతో అతలాకుతలమైన తుర్కియే, సిరియాలు వెంటనే ‘‘స్పేస్ అండ్ మేజర్ డిజాస్టర్స్ అంతర్జాతీయ చార్టర్’ను యాక్టివేట్ చేయమని కోరాయి. అసలు ఈ చార్టర్ ఏంటో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: తుర్కియే(Turkey), సిరియా(Syria)లోని ప్రాంతాలను భారీ భూకంపం(Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, దెబ్బతిన్న రహదారులు, ధ్వంసమైన నిర్మాణాలతో ఇరుదేశాల్లో విలయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తుర్కియే, సిరియాలు.. వెంటనే ‘అంతరిక్ష, ప్రధాన విపత్తుల అంతర్జాతీయ చార్టర్(The International Charter Space and Major Disasters)’ను యాక్టివేట్ చేయమని అంతర్జాతీయ సమాజాన్ని కోరాయి. అసలు ఏంటీ చార్టర్ తెలుసుకుందాం.
వాస్తవ పరిస్థితుల అంచనాకు..
ఏటా ప్రపంచవ్యాప్తంగా తుపానులు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, సునామీ, వరదలు, కార్చిచ్చుల వంటి ప్రకృతికారక.. చమురు కాలుష్యం, పారిశ్రామిక పేలుళ్ల వంటి మానవప్రేరేపిత విపత్తులు ఏర్పడుతున్నాయి. వాటి కారణంగా మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. ఇళ్లు, నిర్మాణాలు, రోడ్లు, వంతెనలవంటి మౌలిక సదుపాయాలతోపాటు ప్రకృతి వనరులూ దెబ్బతింటున్నాయి. అయితే, భారీ విపత్తుల సమయాల్లో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం, నష్టాలను వేగంగా అంచనా వేయడం అంత సులభం కాదు.
శాటిలైట్ ఇమేజింగ్..
ఇటువంటి సమయాల్లో తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు, తద్వారా సహాయక చర్యలు మెరుగ్గా నిర్వహించేందుకు ‘శాటిలైట్ ఇమేజింగ్’ విశేషంగా సహకరిస్తుంది. ఈ దిశగానే 1999లో ఫ్రాన్స్ ‘నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్’, ‘యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ’లు కలిసి.. ‘అంతరిక్ష, ప్రధాన విపత్తుల అంతర్జాతీయ చార్టర్’ ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం 17 స్పేస్ ఏజెన్సీలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. విపత్తుల సమయంలో తమ కృత్రిమ ఉపగ్రహాల ద్వారా ప్రభావిత ప్రాంతాల ఫొటోలు, ఇతర సమాచారాన్ని సేకరించి సంబంధిత దేశాలకు ఉచితంగా అందజేస్తాయి. వాటిని విశ్లేషించి, అవసరమైన చర్యలు తీసుకోవచ్చు.
ప్రతికూల వాతావరణంలోనూ..
తాజాగా తమ భూకంప ప్రభావిత ప్రాంతాల వైపు శాటిలైట్ల దృష్టిని మళ్లించేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ‘స్పేస్ అండ్ మేజర్ డిజాస్టర్స్’ చార్టర్ను యాక్టివేట్ చేయాలని తుర్కియే అభ్యర్థించింది. సిరియా విషయంలోనూ ఐరాస చొరవ తీసుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. వెంటనే 11 స్పేస్ ఏజెన్సీలు తమ ఆప్టికల్, రాడార్ ఉపగ్రహాలను ఆపరేట్ చేసేందుకు ముందుకొచ్చాయి. తొలుత ఫ్రాన్స్కు చెందిన ఉపగ్రహాలు ఆ ప్రాంతం మీదుగా వెళ్లిన నేపథ్యంలో.. ఆ దేశం మొదటి చిత్రాలను అందించింది. ఏ సమయాల్లోనైనా, మేఘాలు ఉన్నప్పటికీ, అన్ని ప్రాంతాలనూ ఇవి స్పష్టంగా చిత్రీంచగలవు.
విపత్తుల సమయంలో..
ఇదిలా ఉండగా.. 2000 నుంచి ఇప్పటివరకు 154 దేశాల్లో, 797 సార్లు ఈ చార్టర్ను యాక్టివేట్ చేశారు. ఇందులో దాదాపు మూడో వంతు వాతావరణ సంబంధిత విపత్తుల(తుపానులు, వరదల) సమయంలో క్రీయాశీలకం చేశారు. అయితే, యుద్ధాలు, సాయుధ సంఘర్షణలు, వడగాలులు, దీర్ఘకాలంలో సాగే విపత్తు ప్రక్రియ(కరవులు)ల సందర్భాల్లో దీన్ని యాక్టివేట్ చేయరు. విపత్తు రకాన్ని బట్టి వివిధ ఉపగ్రహాలు రంగంలోకి దిగుతాయి. రాడార్శాట్, ల్యాండ్శాట్- 7/8, సెంటినల్-2 వంటివి ఉదాహరణలు. సహాయక చర్యలతోపాటు పునర్నిర్మాణ పనుల పర్యవేక్షణలోనూ ఈ శాటిలైట్ల సమాచారం కీలకంగా మారుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు