world Bank: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఇండో అమెరికన్ అజయ్ బంగా?
ప్రపంచ బ్యాంకు (World Bank) అధ్యక్ష పదవికి ఇండో అమెరికన్ అజయ్ (Ajay Banga) బంగా పేరును అమెరికా నామినేట్ చేసింది. గతంలో ఆయన మాస్టర్కార్డ్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు.
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు (World Bank) అధ్యక్షుడిగా ఇండో అమెరికన్ అజయ్ బంగా (Ajay Banga) పేరును అమెరికా నామినేట్ చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ (David Malpass) పదవీకాలం ముగియక ముందే పదవీవిరమణ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో తర్వాతి అధ్యక్షుడు ఎవరు అనే దానిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మాస్టర్కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగా పేరును అమెరికా నామినేట్ చేసింది. ఈ మేరకు అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. డేవిడ్ మాల్పాస్ ప్రకటన తర్వాత ప్రపంచ బ్యాంకు నామినేషన్లను స్వీకరించడం మొదలు పెట్టింది. మార్చి 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. సాధారణంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికన్, ఐఎంఎఫ్ అధ్యక్షుడిగా యూరోపియన్ దేశానికి చెందిన వ్యక్తి ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఇండో అమెరికన్ అయిన అజయ్ బంగా పేరు దాదాపు ఖారారైనట్లేనని చెప్పొచ్చు. అంతేకాకుండా వరల్డ్ బ్యాంకులో అత్యధిక షేర్లు అమెరికావే. అందువల్ల అధ్యక్షుడి నియామకంలో అగ్రరాజ్యం మాటే చెల్లుబాటు అవుతుంది.
63 ఏళ్ల అజయ్ బంగా ప్రస్తుతం ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్లో వైస్ ఛైర్మన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో మాస్టర్కార్డ్ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. అత్యవసర సవాళ్లను పరిష్కరిస్తూ పబ్లిక్-ప్రైవేట్ వనరులను సమీకరించడంలో బంగాకు అత్యంత అనుభవముందని జో బైడెన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురువుతున్న పర్యావరణ ముప్పు లాంటి సమస్యలను ప్రభావవంతగా ఎదుర్కొనేందుకు అవసరమైన రుణసాయం చేస్తూ, ప్రపంచ అభివృద్ధికి మరింత దోహదం చేస్తారనే నమ్మకంతోనే అతడి పేరును ప్రతిపాదించినట్లు బైడెన్ చెప్పుకొచ్చారు.
అజయ్ బంగా పుణె లోని ఖడ్కీలో జన్మించారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన.. ఆహ్మదాబాద్ ఐఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు. వాణిజ్యం, పరిశ్రమల రంగంలో ఆయన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం ఆయన్ను గౌరవిస్తూ 2016లో పద్మశ్రీతో సత్కరించింది. 2012లో విదేశాంగ విధాన సంఘం అవార్డు సాధించారు. 2019లో ది ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ హానర్, బిజినెస్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ గ్లోబర్ లీడర్ షిప్ అవార్డు పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.