Robot: ప్రపంచంలోనే తొలిసారి.. రోబో సాయంతో ఐవీఎఫ్.. కవల పిల్లల జననం
ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్ విజయవంతమైంది. ఇద్దరు పండంటి ఆడపిల్లలు జన్మించారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే.. పిల్లలు లేని జంటలకు ఉపయుక్తంగా మారే అవకాశముంది.
ఇంటర్నెట్ డెస్క్: వైద్య రంగం మరో మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్ విజయవంతమైంది. పండంటి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. ఎంఐటీ టెక్నాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం.. స్పెయిన్లోని బార్సిలోనాకి చెందిన ఓ ఇంజినీర్ల బృందం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. మానవ అండంలోకి రోబో సాయంతో శుక్రకణాలను ప్రవేశపెట్టింది. రెండు పిండాలు అభివృద్ధి చెంది.. 9 నెలల తర్వాత ఇద్దరు కవలలు జన్మించారు. ఈ ప్రయోగానికి న్యూయార్క్ సిటీలోని న్యూహోప్ ఫెర్టిలిటీ సెంటర్ వేదికైంది. సామాన్యులకు అందని ద్రాక్షగా మిగిలిపోతున్న సాధారణ ఐవీఎఫ్ స్థానంలో రోబో ద్వారా చేసిన ఐవీఎఫ్ అందుబాటులోకి వస్తే.. పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న చాలా జంటలకు ఉపయుక్తంగా మారే అవకాశం ఉంది.
ఈ ప్రయోగం చేపట్టిన ఇంజినీర్లకు ఫెర్టిలిటీ అంశంపై పెద్దగా అనుభవం ఏమీ లేదు. సూదిలాంటి సన్నని రోబోను ఉంచేందుకు.. వీళ్లు సోనీ ప్లే స్టేషన్ 5 కంట్రోలర్ను ఉపయోగించారు. అందులో శుక్రకణాలను నింపి ఉంచారు. కెమెరా ద్వారా మానవ అండాన్ని చూసిన రోబో.. తనంతట తానే ముందుకు చొచ్చుకెళ్లి.. అండంపై స్పెర్మ్ను జారవిడిచింది. అక్కడికి రెండు రోజుల వ్యవధిలో అవి ఫలదీకరణం చెంది.. పిండాలుగా మారినట్లు ఇంజినీర్ల బృందం వెల్లడించింది. 9 నెలల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీస్ తన నివేదికలో పేర్కొంది. ప్రసుత్తం అవలంబిస్తున్న ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)తో పోల్చితే, దీనికయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోబోను ఓవర్ట్యూర్ లైఫ్ అనే స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసింది. అతి తక్కువ ఖర్చుతో ఆటోమేటిక్ ఐవీఎఫ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఈ ప్రయోగం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్లో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ఓవర్ట్యూర్ లైఫ్ చెబుతోంది.
ప్రస్తుతం చాలా మంది అవలంబిస్తున్న ఐవీఎఫ్ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టాలి. చాలా జాగ్రత్తగా మైక్రోస్కోప్ ద్వారా పరిశీలిస్తూ అండంతో, శుక్రకణాన్ని ఫలదీకరణం చెందించాల్సి ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టినా.. కొన్నిసారు ఇది విఫలమైన సందర్భాలూ ఉంటాయి. ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది చిన్నారులు ఐవీఎఫ్ ద్వారా జన్మిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక