పుత్రుడి లీల.. పత్రాల గోల!
రెండేళ్లుగా ప్రజాస్వామ్య రక్షకుడిగా, అవినీతిరహితుడిగా అమెరికా అధికార పీఠంపై ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న అధ్యక్షుడు జో బైడెన్ నిజాయతీపై తొలిసారి సందేహాలు మొదలయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు బైడెన్కు కొత్త చిక్కులు
రెండేళ్లుగా ప్రజాస్వామ్య రక్షకుడిగా, అవినీతిరహితుడిగా అమెరికా అధికార పీఠంపై ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న అధ్యక్షుడు జో బైడెన్ నిజాయతీపై తొలిసారి సందేహాలు మొదలయ్యాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటికి ఎఫ్బీఐని పంపించి... ఆయన పదవి నుంచి దిగిపోతూ ఇవ్వకుండా తీసుకువెళ్లిన రహస్య పత్రాలను బైడెన్ యంత్రాంగం గతంలో బయటపెట్టింది. ట్రంప్పై క్రిమినల్ విచారణను కూడా మొదలెట్టింది. తద్వారా 2024లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్న ట్రంప్ను బైడెన్ రాజకీయంగా దెబ్బతీయాలని చూశారు. తాజాగా కొద్దిరోజుల కిందట బైడెన్ పాత కార్యాలయంలో తన సహచరులు చేసిన ‘తవ్వకాలు’ ఆయన్ను అనూహ్యంగా ఇబ్బందుల్లో పడేశాయి. సహచరుల వెతుకులాటలో గతంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు సేకరించిన అధికారిక రహస్య పత్రాలు బయటపడ్డాయి. తాజాగా మరోచోట కూడా మరికొన్ని రహస్య పత్రాలు దొరికినట్లుగా చెబుతున్నారు. తొలి విడత పత్రాలు నవంబరులో బయటపడగా... ఇప్పటిదాకా ఆ విషయాన్ని దాచి పెట్టడం గమనార్హం. ఇవన్నీ ఉక్రెయిన్, ఇరాన్, బ్రిటన్లకు సంబంధించిన రహస్య పత్రాలు! ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉక్రెయిన్పై అమెరికా విధాన నిర్ణయాల బాధ్యతను ఉపాధ్యక్షుడిగా బైడెన్ చూసేవారు. నాటి రహస్య పత్రాలు తన కార్యాలయంలోకి ఎలా వచ్చాయో తెలియదని... విచారణలో న్యాయశాఖకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని చెబుతూ బైడెన్ కార్యాలయం తప్పించుకోజూసినా ఇది అక్కడితో ఆగేలా లేదు. కారణం- ఉక్రెయిన్తో ఆయన కుమారుడు హంటర్ బైడెన్కున్న లంకె! తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఉక్రెయిన్, చైనా కంపెనీల వ్యాపారలావాదేవీల ద్వారా అవినీతి పద్ధతుల్లో సంపాదించారన్నది ఆయనపై ఉన్న విమర్శ. వాటిపై విచారణ జరుగుతోంది కూడా. హంటర్ అవినీతి సంపాదన జో బైడెన్కు తెలిసే జరిగిందన్నది రిపబ్లికన్ల ఆరోపణ. అందుకే తాజాగా ప్రతినిధుల సభలో మెజార్టీ సంపాదించిన రిపబ్లికన్లు బైడెన్ బ్యాంకు లావాదేవీల వివరాలను ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖను డిమాండ్ చేశారు.
వెలుగులోకి మరిన్ని రహస్య పత్రాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రోజురోజుకూ మరింతగా సమస్యల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆయన నివాసంలో మరిన్ని అధికారిక రహస్య పత్రాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని శ్వేతసౌధం గురువారం వెల్లడించింది. ఆ పత్రాలన్నీ 2009-16 మధ్య బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటినాటివే. వాషింగ్టన్లోని బైడెన్ ప్రైవేటు నివాసమైన పెన్ బైడెన్ సెంటర్లో గతేడాది నవంబరులో రహస్య పత్రాలు బయటపడిన సంగతి ఇటీవల వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ పత్రాలు దొరికిన తర్వాత న్యాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ దేశాధ్యక్షుడి న్యాయవాదులు డెలావర్లో విల్మింగ్టన్, రహబత్ బీచ్ల్లోని బైడెన్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అక్కడ గుర్తించిన పత్రాలను బుధవారం వరకు క్షుణ్నంగా పరిశీలించారు. వాటిలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికి సంబంధించిన అధికారిక రహస్య పత్రాలు కూడా కొద్ది సంఖ్యలో ఉన్నట్లు తేల్చారు. మొత్తం పత్రాల్లో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ విల్మింగ్టన్ నివాసంలోని స్టోరేజీ ప్రదేశంలో దొరికాయి.
సమస్యాత్మక పుత్రరత్నం!
బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ది ఓ సమస్యాత్మక నేపథ్యం! ప్రతిష్ఠాత్మక యేల్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన హంటర్ దేశీయంగా లాబీయింగ్ (పనులు చక్కదిద్దటం)లో ఉండేవారు. తండ్రి ఉపాధ్యక్షుడయ్యాక అది వదిలేసి అంతర్జాతీయ వ్యాపార బంధాలపై దృష్టిసారించారు. ఉక్రెయిన్కు చెందిన ఇంధన కంపెనీ బురిస్మా బోర్డులో చేరారు. ఏడాదికి 6 లక్షల డాలర్లు బురిస్మా నుంచి ఆయనకు అందాయి. అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న ఆ కంపెనీ యజమాని జ్లొచెవిస్కీతో ఆయన చెట్టపట్టాలు ప్రశ్నార్థకమయ్యాయి. 2016, 2017ల్లో పన్ను వ్యవహారాలకు సంబంధించి, నిబంధనలకు విరుద్ధంగా తుపాకీ కొనుగోలు చేయటంలాంటి ఆరోపణలతో ఆయనపై విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది.
అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తదితర ఉన్నతస్థాయిలోని కొద్ది మందికి మాత్రమే రహస్య పత్రాలు అందుబాటులో ఉంటాయి. తమ పదవీకాలం పూర్తికాగానే వాటిని అమెరికా జాతీయ ఆర్కైవ్స్కు అప్పగించి వెళ్లాలనేది నిబంధన.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు.