మిసిసిపీలో ఎమర్జెన్సీ ప్రకటించిన బైడెన్
మిసిసిపి డెల్టాను తాకిన భీకరమైన టోర్నడో, తుపాను వర్షాలతో ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం తెల్లవారుజామున ప్రకటించారు.
26కు చేరిన టోర్నడో మృతుల సంఖ్య
వాషింగ్టన్, రోలింగ్ ఫోర్క్: మిసిసిపి డెల్టాను తాకిన భీకరమైన టోర్నడో, తుపాను వర్షాలతో ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం తెల్లవారుజామున ప్రకటించారు. జరిగిన నష్టాన్ని హృదయ విదారకంగా ఆయన అభివర్ణించారు. శుక్రవారం రాత్రి వీచిన తీవ్ర గాలులు, కురిసిన భారీవర్షానికి నష్టపోయిన కరోల్, హమ్ఫ్రేస్, మన్రో, షార్కీ కౌంటీలకు సమాఖ్య నిధులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. తుపాను మరణాల సంఖ్య 26కు చేరగా, డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు చర్యలు ముమ్మరం చేశాయి. వందల సంఖ్యలో జనం ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. బాధితులకు తాత్కాలిక నివాసాలు, ఇళ్ల మరమ్మతులు, వ్యాపారాల పునరుద్ధరణకు సాయం వంటి చర్యలను సమాఖ్య నిధులతో చేపట్టవచ్చని శ్వేతసౌధం నుంచి వెలువడిన ప్రకటన పేర్కొంది.
ప్రమాదం ముగిసిపోలేదు..
ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే జాతీయ వాతావరణ విభాగం మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర గాలులు, పెద్ద వడగళ్లతో తుపాను ప్రమాదం ఉందని తూర్పు లూసియానా, దక్షిణమధ్య మిసిసిపి, దక్షిణమధ్య అలబామా ప్రాంతాలను అప్రమత్తం చేశారు. శుక్రవారం రాత్రి ఈఎఫ్-4 రేటింగుతో వచ్చిన టోర్నడోకు గంటకు 265 నుంచి 320 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు జాతీయ వాతావరణ విభాగం తెలిపింది. ఈ ఉద్ధృతికి రెండు వేల జనాభా గల రోలింగ్ ఫోర్క్ పట్టణంలో ఇళ్లన్నీ కొట్టుకుపోయి శిథిలాలు పోగుపడగా, కార్లు తలకిందులయ్యాయి. దశాబ్దాల కిందటి ఓక్ చెట్ల వేర్లు బయటపడ్డాయి. మిసిసిపీలో ఆరుకు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. విస్తారమైన పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పొలాలు, చేపల చెరువులు దెబ్బతిన్నాయి.
అధ్యక్షుడితో మాట్లాడిన గవర్నర్
అధ్యక్షుడు జో బైడెన్తో మాట్లాడిన మిసిసిపి గవర్నర్ టేట్ రీవ్స్ బాధితుల పునరావాసానికి సహకారం అందిస్తామని ప్రకటించారు. ప్రాథమిక సమాచారం మేరకు గంటకు పైగా నేల మీద ఉన్న సుడిగాలి 274 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది చాలా.. చాలా అరుదైన విషయమని వాతావరణ శాస్త్రవేత్త లాన్స్ పెరిలాక్స్ తెలిపారు. టెనెస్సీ, మిసిసిపి, అలబామాల్లో 75 వేల మందికి పైగా వినియోగదారులు విద్యుత్తు లేక అవస్థలు పడ్డారు. శనివారం మధ్యాహ్నం నుంచి పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.