Prime Ministers: తలుపు ముందు తచ్చాడిన ఇద్దరు ప్రధానులు
ఈ చిత్రంలో తలుపు బయట తచ్చాడుతున్న ఆ ఇద్దరూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రట్.
ఈ చిత్రంలో తలుపు బయట తచ్చాడుతున్న ఆ ఇద్దరూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak), నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రట్(Mark Rutte). లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్లో గల అధికారిక నివాసంలో ఉండే రిషి సునాక్ అతిథిగా వచ్చిన మార్క్ రట్ను ఆహ్వానించేందుకు ఇంటి బయటకు వచ్చారు. మెట్ల వద్ద ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లబోగా తలుపు తెరుచుకోలేదు. లోపలి నుంచి తాళం పడిపోవడంతో ఇద్దరూ కాసేపు గందరగోళానికి గురయ్యారు. అటూ ఇటూ తచ్చాడారు. సునాక్ తలుపు నెట్టినా ఫలితం లేకపోయింది. ఇద్దరు ప్రధానుల ఇబ్బందిని గమనించిన ఫొటోగ్రాఫర్లు టకటకా కెమెరాలను క్లిక్మనిపించారు. కొద్దిసేపటి తర్వాత లోపల ఉన్న వ్యక్తి తలుపు తెరవడంతో నేతలిద్దరూ ఇంట్లోకి వెళ్లిపోయారు. సిబ్బందిలో ఒకరు పొరపాటున గడియ పెట్టడంతో ఇబ్బంది ఎదురైనట్లు తెలుస్తోంది. శుక్రవారం నాటి ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. భౌగోళిక, రాజకీయ అంశాలు.. ఇజ్రాయెల్ - హమాస్ ఘర్షణ వంటి పలు విషయాలు ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.
లండన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
దేవుళ్లు, ఆలయాల పేరుతో ఓట్లు.. మోదీపై పిటిషన్
దేవుళ్లు, ఆలయాల పేరుతో ప్రధాని మోదీ ఓట్లు అడుగుతున్నారని, ఎన్నికల్లో పోటీచేయకుండా ఆయనపై ఆరేళ్ల నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సోమవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.