South Korea: అణ్వాయుధాలే ప్రయోగిస్తే.. అంతం చేస్తాం..! కిమ్కు హెచ్చరిక
ఉత్తర కొరియా ఒకవేళ అణ్వాయుధాలే ఉపయోగిస్తే.. దక్షిణ కొరియా- అమెరికా కూటమి ప్రతిస్పందనతో కిమ్ పాలన అంతం అవుతుందని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ హెచ్చరించారు.
సియోల్: వరుస క్షిపణి ప్రయోగాలు, కవ్వింపు చర్యలతో ఉత్తర కొరియా (North Korea) నుంచి ముప్పు ఎదుర్కొంటున్న వేళ.. దక్షిణ కొరియా (South Korea) సేనలు సియోల్ వీధుల్లో కదం తొక్కాయి. 75వ ‘సాయుధ బలగాల దినోత్సవం (Armed Forces Day)’ పురస్కరించుకుని నిర్వహించిన సైనిక కవాతు (Military Parade)లో భాగంగా పెద్దఎత్తున ఆయుధ సంపత్తిని ప్రదర్శించాయి. ఈ స్థాయి ప్రదర్శన పదేళ్లలో ఇదే మొదటిసారి. ఉత్తర కొరియా ఆగడాలను కట్టడి చేసేందుకు పటిష్ఠమైన సైన్యాన్ని నిర్మిస్తామని దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) ఈ సందర్భంగా ప్రతినబూనారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలే ప్రయోగిస్తే.. అమెరికాతో కలిసి కిమ్ (Kim Jong Un) పాలనను అంతం చేస్తామని హెచ్చరించారు.
యుద్ధ ట్యాంకులు, ఫిరంగి వ్యవస్థలు, డ్రోన్లు, ఉత్తర కొరియాలోని ఏ మూలకైనా చేరుకోగల శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులు, ఇతర ఆయుధ వ్యవస్థలను దక్షిణ కొరియా ప్రదర్శించింది. వేలాది మంది సైనికులు రైఫిళ్లు, జెండాలతో పరేడ్లో పాల్గొన్నారు. 300 మంది అమెరికన్ సైనికులూ ఇందులో భాగమయ్యారు. 2013 తర్వాత ఇదే అతిపెద్ద మిలిటరీ పరేడ్ అని స్థానిక అధికారులు పేర్కొన్నారు. శత్రువులో భయాన్ని పుట్టించే బలమైన మిలిటరీని నిర్మించేందుకు కృషి చేస్తానని దేశాధ్యక్షుడు యోల్ ఈ సందర్భంగా చెప్పారు. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే వెంటనే ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ఒకవేళ అణ్వాయుధాలే ఉపయోగిస్తే.. దక్షిణ కొరియా- అమెరికా కూటమి ప్రతిస్పందనతో కిమ్ పాలన అంతం అవుతుందని పేర్కొన్నారు.
అణుదాడికి సిద్ధంగా ఉండండి..: కిమ్ జోంగ్ ఉన్
గతేడాది అధికారం చేపట్టిన యూన్ సుక్ యోల్.. దక్షిణ కొరియా సైనిక సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేస్తున్నారు. ఉ.కొరియాను ఎదుర్కొనేందుకు, దాని అణ్వాయుధ ఆశయాలను నిలువరించేందుకుగానూ అమెరికాతో కలిసి సైనిక కసరత్తులను విస్తరిస్తున్నారు. మరోవైపు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల రష్యాలో పర్యటించడం.. అమెరికా సహా దాని మిత్రదేశాలను ఆందోళనకు గురిచేసింది. రష్యాకు ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సరఫరా, ప్రతిఫలంగా కిమ్ క్షిపణి కార్యక్రమాలకు మాస్కో సాయం అందేలా ఒప్పందాలు జరుగుతాయేమోనని అనుమానం వ్యక్తం చేశాయి. అయితే, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ ఇటువంటి ఒప్పందాలు చేసుకుంటే ఊరుకోమని యూన్ సుక్ యోల్ ఇప్పటికే స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్