Imran khan: నన్ను చంపేందుకు ముగ్గురు షూటర్లు ప్రయత్నించారు: ఇమ్రాన్
పంజాబ్ ప్రావిన్స్లోని వజీరాబాద్లో నవంబర్ తొలి వారంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నంలో ముగ్గురు షూటర్లు పాల్గొన్నట్టు పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan) అన్నారు.
ఇస్లామాబాద్: పంజాబ్ ప్రావిన్స్లోని వజీరాబాద్లో నవంబర్ తొలి వారంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నంలో ముగ్గురు షూటర్లు పాల్గొన్నట్టు పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan) అన్నారు. దేశంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్తో ఆయన చేపట్టిన లాంగ్ మార్చ్లో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా దుండగుల కాల్పుల్లో ఆయన కుడికాలికి గాయాలైన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించిన ర్యాలీలో ఆయన తొలిసారి ప్రసంగించారు. పాక్లో అత్యంత శక్తిమంతమైన సైన్యం ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలో శనివారం రాత్రి నిర్వహించిన భారీ ర్యాలీలో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. తనను హత్య చేసేందుకు ముగ్గురు షూటర్లు ప్రయత్నించారన్నారు.
లాంగ్మార్చ్లో ఒకడు తన పైన, పీటీఐ నేతలపై కాల్పులు జరపగా.. మరోవ్యక్తి కంటెయినర్ ముందు భాగంలో కాల్పులు జరిపాడన్నారు. అలాగే, మూడో షూటర్ మొదటి సాయుధుడిని చంపేందుకు వచ్చాడని.. ఆ క్రమంలో జరిపిన కాల్పుల సమయంలోనే తూటా తగిలి ఒకరు బలైపోయారన్నారు. వజీరాబాద్లో తన హత్యకు ప్రయత్నాలు విఫలం కావడంతో మళ్లీ తనను టార్గెట్ చేసుకొనేందుకు ఎదురుచూస్తున్నారంటూ ఆరోపించారు. తనపై దాడి వెనుక ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా, ఐఎస్ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి మేజర్ జనరల్ ఫైసల్ నసీర్ ఉన్నారంటూ పదే పదే ఆరోపిస్తోన్న ఇమ్రాన్ ఖాన్.. కొత్త ఎన్నికల తేదీలను ప్రకటించే వరకు తన నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మరోవైపు, తనపై కాల్పుల ఘటన మరుసటి రోజు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో తన కుడికాలికి నాలుగు బుల్లెట్లు తగిలాయని.. ఇద్దరు షూటర్లు కాల్పులు జరిపినట్టు ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా