Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
అధికారిక నివాసంలో (Prime Minister) ఓ ప్రైవేటు పార్టీ నిర్వహించడంపై వచ్చిన విమర్శలకు బాధ్యుడిని చేస్తూ తన కుమారుడిని కీలక పదవి తప్పిస్తున్నట్లు జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిద (Fumio Kishida) ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదకు (Fumio Kishida) చుక్కెదురయ్యింది. తనకు (ప్రధాన మంత్రికి) రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న ఆయన కుమారుడు షొటారో కిషిదాను పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. ప్రధాని అధికారిక నివాసంలో (Prime Minister) ఓ ప్రైవేటు పార్టీ నిర్వహించడమే ఇందుకు కారణమయ్యింది. డిసెంబర్ 30 తన బంధువులతో ఇంట్లో పార్టీ చేసుకోవడం, ఆ సందర్భంగా తీసుకున్న ఫొటోలపై తీవ్ర విమర్శలు రావడంతో కుమారుడిపై ప్రధాని కిషిద చర్యలు తీసుకున్నారు.
కిషిద కుమారుడితోపాటు పలువురు బంధువులు ప్రధాని నివాసంలో ఓ పార్టీకి హాజరయ్యారు. ఆ సందర్భంగా అధికారం నివాసంలో ఉన్న రెడ్ కార్పెట్ మెట్లపై నిలబడి.. కొత్తగా కేబినెట్లో నియమితులైనవారిగా ఫొటోలకు పోజులిచ్చారు. మధ్యలో ప్రధాని కుమారుడు (ప్రధాని ఉండాల్సిన చోట) నిలబడి ఫొటోలు దిగారు. దీంతోపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లుగా.. పోడియం వద్ద అతిథులుగా నిల్చొని మరిన్ని ఫొటోలు తీసుకున్నారు. తాజాగా వీటన్నింటినీ స్థానిక మ్యాగజైన్ బయటపెట్టింది. దీంతో పీఎం కుమారుడిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కీలక పదవి నుంచి తన కుమారుడిని తప్పిస్తున్నట్లు ప్రధాని కిషిద ప్రకటించారు. మరోవైపు ఆయన కుమారుడు అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఇదేం తొలిసారి కాదు. బ్రిటన్, ప్యారిస్ పర్యటనలో భాగంగా ప్రైవేటు పర్యాటనకు అక్కడి ఎంబసీ కార్లను ఉపయోగించి విమర్శల పాలయ్యారు.
తాజా ఘటనపై జపాన్ ప్రధాని ఫుమియో స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘పీఎంకు రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న వ్యక్తి చేసిన చర్యలు అనుచితమైనవి. అందుకు ఆయనను బాధ్యుడిగా చేస్తూ.. ఆ పదవి నుంచి తొలగిస్తున్నాను. ఆయన స్థానంలో మరోవ్యక్తిని నియమించాలని నిర్ణయించాను’ అని కిషిద పేర్కొన్నారు. అయితే, అప్పుడు జరిగిన పార్టీకి వచ్చిన వారికి తానూ శుభాకాంక్షలు తెలిపానని.. కానీ, డిన్నర్ సమయంలో అక్కడ లేనని ప్రధాని కిషిద అంగీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు