Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
అధికారిక నివాసంలో (Prime Minister) ఓ ప్రైవేటు పార్టీ నిర్వహించడంపై వచ్చిన విమర్శలకు బాధ్యుడిని చేస్తూ తన కుమారుడిని కీలక పదవి తప్పిస్తున్నట్లు జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిద (Fumio Kishida) ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదకు (Fumio Kishida) చుక్కెదురయ్యింది. తనకు (ప్రధాన మంత్రికి) రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న ఆయన కుమారుడు షొటారో కిషిదాను పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. ప్రధాని అధికారిక నివాసంలో (Prime Minister) ఓ ప్రైవేటు పార్టీ నిర్వహించడమే ఇందుకు కారణమయ్యింది. డిసెంబర్ 30 తన బంధువులతో ఇంట్లో పార్టీ చేసుకోవడం, ఆ సందర్భంగా తీసుకున్న ఫొటోలపై తీవ్ర విమర్శలు రావడంతో కుమారుడిపై ప్రధాని కిషిద చర్యలు తీసుకున్నారు.
కిషిద కుమారుడితోపాటు పలువురు బంధువులు ప్రధాని నివాసంలో ఓ పార్టీకి హాజరయ్యారు. ఆ సందర్భంగా అధికారం నివాసంలో ఉన్న రెడ్ కార్పెట్ మెట్లపై నిలబడి.. కొత్తగా కేబినెట్లో నియమితులైనవారిగా ఫొటోలకు పోజులిచ్చారు. మధ్యలో ప్రధాని కుమారుడు (ప్రధాని ఉండాల్సిన చోట) నిలబడి ఫొటోలు దిగారు. దీంతోపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లుగా.. పోడియం వద్ద అతిథులుగా నిల్చొని మరిన్ని ఫొటోలు తీసుకున్నారు. తాజాగా వీటన్నింటినీ స్థానిక మ్యాగజైన్ బయటపెట్టింది. దీంతో పీఎం కుమారుడిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కీలక పదవి నుంచి తన కుమారుడిని తప్పిస్తున్నట్లు ప్రధాని కిషిద ప్రకటించారు. మరోవైపు ఆయన కుమారుడు అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఇదేం తొలిసారి కాదు. బ్రిటన్, ప్యారిస్ పర్యటనలో భాగంగా ప్రైవేటు పర్యాటనకు అక్కడి ఎంబసీ కార్లను ఉపయోగించి విమర్శల పాలయ్యారు.
తాజా ఘటనపై జపాన్ ప్రధాని ఫుమియో స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘పీఎంకు రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న వ్యక్తి చేసిన చర్యలు అనుచితమైనవి. అందుకు ఆయనను బాధ్యుడిగా చేస్తూ.. ఆ పదవి నుంచి తొలగిస్తున్నాను. ఆయన స్థానంలో మరోవ్యక్తిని నియమించాలని నిర్ణయించాను’ అని కిషిద పేర్కొన్నారు. అయితే, అప్పుడు జరిగిన పార్టీకి వచ్చిన వారికి తానూ శుభాకాంక్షలు తెలిపానని.. కానీ, డిన్నర్ సమయంలో అక్కడ లేనని ప్రధాని కిషిద అంగీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమని చైనాకు విదేశాంగశాఖ మరోసారి స్పష్టం చేసింది. -
Flight Journey: ‘లావుగా ఉన్నామని విమానం నుంచి దించేశారు’
లావుగా ఉన్నారనే నెపంతో ఇద్దరు మహిళలను విమానం నుంచి దించేసిన దారుణ ఘటన ఎయిర్ న్యూజిలాండ్లో (New Zealand) చోటుచేసుకుంది. -
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Salman Khan: సల్మాన్ ఖాన్- అట్లీ కాంబో.. అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే?
-
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్