Royal Family: ప్రిన్స్ విలియంతో పెళ్లికి ముందు.. కేట్కు సంతాన సాఫల్య పరీక్ష..!
ప్రిన్స్ విలియమ్ (Prince William)తో వివాహానికి ముందు కేట్ మిడిల్టన్కు (Kate Middleton) సంతాన సాఫల్య పరీక్ష నిర్వహించినట్లు తాజాగా విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది.
లండన్: బ్రిటన్ రాజకుటుంబానికి సంబంధించి ఏ విషయమైనా ఎంతో ఆసక్తికరంగానే చూస్తుంటారు. బకింగ్హామ్ ప్యాలెస్లో వచ్చిన జాత్యాహంకార ఆరోపణలు మొదలు ప్రిన్స్ హ్యారీ (Prince Harry)-మేఘన్ మెర్కెల్లకు ఎదురైన పరాభవాల వంటి ఎన్నో విషయాలు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రిన్స్ విలియమ్ (Prince William)తో వివాహానికి ముందు కేట్ మిడిల్టన్కు (Kate Middleton) సంతాన సాఫల్య పరీక్ష నిర్వహించినట్లు తాజాగా విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది.
కేట్ మిడిల్టన్ను ప్రిన్స్ విలియమ్ ఏప్రిల్ 29, 2011న వివాహం చేసుకున్నారు. వెస్ట్మినిస్టర్ ఆబేలో వీరి వివాహం ఘనంగా జరిగింది. సుమారు 1900 మంది అతిథులు ఈ వేడుకకు హాజరుకాగా.. వివాహం రోజున దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. అయితే, కేట్ రాజకుటుంబేతర అమ్మాయి కావడంతో కొన్ని అసాధారణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో రాణి కాబోయే అమ్మాయికి సంతాన సాఫల్యం ఉందా? అని తెలుసుకునే పరీక్ష ముఖ్యమైంది.
టామ్ క్విన్ అనే రచయిత ‘గిల్డెడ్ యూత్: యాన్ ఇంటిమేట్ హిస్టరీ ఆఫ్ గ్రోయింగ్ అప్ ఇన్ ది రాయల్ ఫ్యామిలీ’ పేరుతో రాసిన పుస్తకంలో రాజకుటుంబంలో వివాహాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కుటుంబం పాటించే భిన్న సంప్రదాయాలను వివరించిన ఆయన.. భవిష్యత్తులో రాణి కావాల్సిన వ్యక్తి సంతాన సామర్థ్యం ఉందా అని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఒకవేళ ఆ పరీక్షలో ప్రతికూల ఫలితం వస్తే వివాహం ఆగిపోతుందనడంలో సందేహమే లేదన్నారు. 1981లో ప్రిన్సెస్ డయానా కూడా ఇటువంటి పరీక్షనే ఎదుర్కొన్నారని పుస్తకంలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!