Modi: చైనా నెటిజన్లలోనూ ‘మోదీ’ పాపులర్.. నిక్నేమ్ కూడా పెట్టారట..!
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నరేంద్ర మోదీ(Narendra Modi) .. చైనా నెటిజన్లలోనూ పాపులర్ అయినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా కొందరు నేతలు ఎంతో గుర్తింపు పొందుతూ, ప్రశంసలు దక్కించుకుంటున్నప్పటికీ.. చైనీయుల (China) మెప్పు పొందడం కాస్త అరుదనే చెప్పొచ్చు. అటువంటి వారి మనసును కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గెలుచుకున్నట్లు ఓ అంతర్జాతీయ నివేదిక ఒకటి వెల్లడించింది. ఆయనపై అభిమానంతో ‘మోదీ చిరంజీవుడు’ అనే మారుపేరుతోనూ వారు పిలుచుకుంటున్నట్లు సమాచారం. చైనా- భారత్ల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోన్న వేళ.. మోదీ విషయంలో చైనీయులకు సానుకూల అభిప్రాయం ఉందని పేర్కొంటూ అమెరికాకు చెందిన వ్యూహాత్మక సంబంధాల మ్యాగజైన్ ‘ది డిప్లొమాట్’ పేర్కొంది.
‘భారత్ను చైనా ఏవిధంగా చూస్తోంది..?’ పేరిట ఈ మ్యాగజైన్లో ఓ కథనం ప్రచురితమైంది. ‘నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్.. ప్రపంచంలోని ప్రధాన దేశాలతో సమతౌల్యాన్ని కొనసాగిస్తోందని చైనీయులు భావిస్తున్నారు’ అని సినా విబో వంటి చైనా సామాజిక మాధ్యమాలను విశ్లేషించే ము చున్షాన్ అనే జర్నలిస్టు తాజా కథనంలో వెల్లడించారు.
చైనా ఇంటర్నెట్లో మోదీకి అసాధారణమైన మారుపేరు ఉంది. అదే ‘మోదీ లావోషియన్’. అసాధారణ సామర్థ్యాలు ఉన్న వృద్ధ వ్యక్తిని అలా పిలుస్తుంటారు. ‘ఇతర నేతలతో పోలిస్తే మోదీ భిన్నమైన వ్యక్తి అని చైనా నెటిజన్ల భావన. మోదీ వస్త్రధారణ, ఆహార్యంతోపాటు ఆయన విధానాలు మునుపటి నేతలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకోవడంతోపాటు మొండితనం వంటి తీరును గమనించి.. మోదీని అలా పిలుస్తున్నారని అనిపిస్తోంది’ అని చున్షాన్ అభిప్రాయపడ్డారు.
ఇతర ప్రధాన దేశాలతో భారత్ సంబంధాలను ప్రస్తావించిన ము చున్షాన్ .. రష్యా, అమెరికా, ఇతర దక్షిణాసియా దేశాలతో భారత్ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం కొంత మంది చైనా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోందని చెప్పారు. 20 ఏళ్లుగా అంతర్జాతీయ మీడియా వ్యవహారాలను చూస్తున్నానని.. చైనా నెటిజన్లు ఓ విదేశీ నేతకు ఇలా నిక్నేమ్ పెట్టడం చాలా అరుదని ము చున్షాన్ వెల్లడించారు. చైనా ప్రజలపై మోదీ ముద్ర వేశారనడానికి ఇదో నిదర్శనంగా చెప్పొచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.