Elon at Twitter: ట్విటర్ బోర్డులో ఎలాన్ మస్క్..!
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్లోకి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రవేశించారు.
స్వాగతం పలికిన ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్
దిల్లీ: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్లోకి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రవేశించారు. సంస్థలో 9శాతం వాటాను సొంతం చేసుకున్న మస్క్ను తాజాగా తమ బోర్డులోకి స్వాగతిస్తున్నట్లు ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ నియామకం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్న ఆయన.. ఇటీవల మస్క్తో జరిపిన చర్చల అనంతరం తమ సంస్థకు ఆయన మరింత విలువను తెస్తారని స్పష్టంగా తెలిసిందన్నారు.
‘సేవలపై విశ్వాసంతోపాటు విమర్శలనూ చేయగల వ్యక్తి ఎలాన్ మస్క్. తమ సంస్థ, బోర్డుకు కూడా ఇటువంటివే అవసరం. రానున్న రోజుల్లో ఈ సామాజిక మాధ్యమాన్ని మరింత బలోపేతం చేస్తాడనే విశ్వాసం ఉంది’ అంటూ ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇందుకు బదులిచ్చిన మస్క్.. ట్విటర్ను గణనీయంగా మెరుగుపరిచేందుకు పరాగ్తోపాటు బోర్డుతో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాను అని అన్నారు. ఇక ఎలాన్ మస్క్ ట్విటర్లో వాటా తీసుకోవడాన్ని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్ డోర్సే కూడా స్వాగతించారు.
ఇదిలాఉంటే, ట్విటర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎలాన్ మస్క్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ట్విటర్లో వాక్ స్వాత్రంత్యంపై ప్రశ్నలు పెరుగుతున్నాయని విమర్శించారు. కొత్త సామాజిక మాధ్యమాన్ని సృష్టించే దిశగా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన కొత్త సోషల్మీడియాను తీసుకొస్తారని అంతా భావించినప్పటికీ ట్విటర్లో వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరచారు. తాజాగా ట్విటర్ బోర్డులో నియామకం అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ