Bilawal Bhutto: నన్ను గాడిదలా తయారు చేశారు : పాక్ మంత్రి భుట్టో
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో తానను తాను గాడిదలా అభివర్ణించుకున్నారు. దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ.. విదేశ పర్యటనలు చేస్తున్నారని వచ్చిన విమర్శలపై స్పందిస్తూ ఇలా వ్యాఖ్యానించారు.
దిల్లీ: ఐరాసలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి పాకిస్థాన్ (Pakistan) విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto) ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన విదేశీ పర్యటనలపై స్వదేశంలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన ఆయన.. తానను తాను గాడిదలా అభివర్ణించుకున్నారు. సొంత ఖర్చుతోనే విదేశీ ప్రయాణాలు చేస్తున్నానని, తన విదేశాంగ శాఖ తనతో గాడిదలా పనిచేయించుకుంటోందని వ్యాఖ్యానించారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన.. పాక్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
కొంత కాలంగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో (Pakistan Crisis) కొట్టుమిట్టాడుతోంది. ఇటువంటి సమయంలో బిలావల్ భుట్టో విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ వచ్చిన విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ‘సొంతగా ప్రయాణ టికెట్లు, హోటల్ బిల్లులు చెల్లించే ఏకైక విదేశాంగ మంత్రి నేనే కావచ్చు. తమ దేశం, ప్రజలపై ఎటువంటి భారాన్ని వేయడం లేదు. ఒకవేళ ఖర్చులు పెట్టినా.. విదేశాంగ మంత్రిగా ఈ పర్యటన నా ప్రయోజనం కోసం కాదు. పాకిస్థాన్కు లబ్ధి చేకూర్చేందుకే. చాలా శ్రమిస్తున్నా. ఇతరులు మాత్రం సరదా పర్యటన కోసం విదేశాలకు వెళ్తారు. వీళ్లు మాత్రం (తన మంత్రిత్వ శాఖను ఉద్దేశిస్తూ) నన్ను గాడిదలా పనిచేసేలా చేశారు’ అని వివరించారు.
భుట్టో అరెస్టయ్యారంటూ వార్తలు..
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto) అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఆయన న్యూయార్క్లో అరెస్టయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి ముంతాజ్ జెరా బలోచ్ ఆ ప్రచారాన్ని ఖండించారు. అవన్నీ అబద్ధాలని, వాస్తవ విరుద్ధాలని స్పష్టం చేశారు. అధికారిక పర్యటనలో భాగంగానే ఆయన అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. మరోవైపు ఐరాస సెక్రటరీ జనరల్తో ఇప్పటికే భేటీ అయిన భుట్టో.. తమ దేశానికి సాయం చేయాలంటూ అంతర్జాతీయ సంస్థలను వేడుకుంటున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.