Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపైకి 10 వేలమంది పోలీసులు!
ఓ అవినీతి కేసులో విచారణకుగానూ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారం లాహోర్ నుంచి ఇస్లామాబాద్కు పయనమయ్యారు. మరోవైపు.. దాదాపు 10 వేల మంది పోలీసులు లాహోర్లోని ఆయన ఇంటిపైకి వెళ్లారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) నివాసంలోకి ఎట్టకేలకు పోలీసులు ప్రవేశించారు. తోషాఖానా అవినీతి కేసులో విచారణకు హాజరయ్యేందుకుగానూ ఇమ్రాన్ శనివారం లాహోర్ (Lahore) నుంచి ఇస్లామాబాద్(Islamabad)కు బయల్దేరారు. ఈ క్రమంలోనే ఇటు దాదాపు 10 వేల మంది పోలీసులు లాహోర్ జమాన్ పార్క్(Zaman Pakr)లోని ఆయన ఇంటిపైకి వెళ్లారు. ఇమ్రాన్ మద్దతుదారుల క్యాంపులను, బారికేడ్లను తొలగించారు. కార్యకర్తలను చెదరగొట్టి.. పదుల సంఖ్యలో అరెస్టులు చేశారు. ఇరుపక్షాల మధ్య తోపులాటలో పలువురు పోలీసులు, పీటీఐ శ్రేణులకు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పీటీఐ(PTI)’ ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. ‘జమాన్ పార్క్లో దారుణమైన హింస సాగుతోంది. ఏదైనా జరిగితే.. మళ్లీ దాన్ని ప్రమాదంగా చిత్రీకరిస్తారా?’ అని ప్రశ్నించింది.
ఇమ్రాన్ ఖాన్ సైతం పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. ‘ఇంట్లో బుష్రా బేగం ఒంటరిగా ఉన్నారు. ఆ సమయంలో నివాసంపై పంజాబ్ పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఏ చట్టం ప్రకారం ఇలా చేస్తున్నారు? ఇదంతా.. పరారీలో ఉన్న నవాజ్ షరీఫ్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు లండన్ ప్లాన్లోని భాగమే’ అని ట్విటర్ వేదికగా ఆరోపించారు. ఇదిలా ఉండగా.. అవినీతి కేసులో ఇమ్రాన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తుండగా.. ఆయన మద్దతుదారులు అడ్డుకొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య పలుమార్లు ఘర్షణ తలెత్తింది. అయితే, జమాన్ పార్క్ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకే తాజా పోలీసు ఆపరేషన్ చేపట్టినట్లు స్థానిక మంత్రి అమీర్ మీర్ మీడియాతో చెప్పారు. ‘‘ఇమ్రాన్ నివాసంలో సోదాలు నిర్వహించాలని యాంటీ టెర్రరిజం కోర్టు వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకే పోలీసులు ఆయన ఇంట్లోకి ప్రవేశించారు" అని తెలిపారు.
అంతకుముందు లాహోర్ నుంచి ఇస్లామాబాద్ బయల్దేరిన ఇమ్రాన్ కాన్వాయ్లోని ఓ వాహనం మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ కారు బోల్తాపడింది. అయితే, ఇమ్రాన్ వాహనానికి మాత్రం ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు రానున్న నేపథ్యంలో ఇస్లామాబాద్లో 144 సెక్షన్ విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం