France: ఉత్కంఠకు తెర..! ఎట్టకేలకు బయల్దేరిన ‘భారతీయుల’ విమానం
భారతీయులతో కూడిన విమానం ఎట్టకేలకు ఫ్రాన్స్నుంచి బయల్దేరింది. మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రెంచ్ అధికారులు ఈ విమానాన్ని అదుపులోకి తీసుకొన్న విషయం తెలిసిందే.
పారిస్: ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకొన్న భారతీయ ప్రయాణికులున్న విమానం ఎట్టకేలకు పారిస్ (Paris) నుంచి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం ఈ విమానం దుబాయి నుంచి పారిస్ మీదుగా నికరాగువాకు చేరుకోవాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం దీన్ని భారత్కు మళ్లించారు. సోమవారం ఉదయమే ఈ విమానం టేకాఫ్ తీసుకోవాల్సి ఉండగా.. కొంతమంది ప్రయాణికులు భారత్కు వచ్చేందుకు నిరాకరించడంతో కాసేపు గందరగోళం తలెత్తినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
303 మంది భారతీయులు గురువారం రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానంలో దుబాయి నుంచి నికరాగువాకు వెళ్తూ.. మార్గమధ్యంలో ఫ్రాన్స్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఇంధనం కోసం పారిస్ సమీపంలోని వాట్రీ విమానాశ్రయంలో ఆగినప్పుడు.. మానవ అక్రమ రవాణా అనుమానంతో స్థానిక అధికారులు ఆ విమానాన్ని అధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం స్పందించి.. స్థానిక అధికారులతో చర్చించింది. ఆదివారం న్యాయమూర్తులు విచారణ జరిపారు. అంతలోనే విమానం బయలుదేరేందుకు అనుమతులు వచ్చాయి.
భారతీయుల విమానానికి లైన్క్లియర్
ప్రయాణికుల్లో 11 మంది ఏ తోడులేని మైనర్లు ఉన్నారు. మరోవైపు కొంతమంది ఫ్రాన్స్లోనే ఆశ్రయం పొందేందుకు అభ్యర్థించారు. దీంతోపాటు ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉండిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం భారత్కు బయల్దేరిన ఈ విమానంలో ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది. మంగళవారం తెల్లవారుజామున ముంబయి విమానాశ్రయానికి ఇది చేరుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!