Ukraine Crisis: ‘అణు దాడి’కి రష్యా సన్నాహాలు..!
ఉక్రెయిన్ (Ukraine)పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా (Russia) తమ దాడులను మరింతగా పెంచేందుకు సిద్ధమవుతోంది. ఆ దేశంలో అణ్వాయుధాల (nuclear weapons)ను ప్రయోగించేందుకు సన్నాహాలు
మాస్కో: ఉక్రెయిన్ (Ukraine)పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా (Russia) తమ దాడులను మరింతగా పెంచేందుకు సిద్ధమవుతోంది. ఆ దేశంలో అణ్వాయుధాల (nuclear weapons)ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు తాము అణ్వస్త్ర సామర్థ్యం గల క్షిపణి దాడులపై సాధన చేస్తోన్నట్లు స్వయంగా క్రెమ్లిన్ ప్రకటించడం గమనార్హం.
రష్యాలోని కలినిన్గ్రాడ్ నగరంలో తమ దళాలు అణు సామర్థ్యం గల క్షిపణి దాడులను ప్రాక్టీస్ చేస్తున్నట్లు రష్యా బుధవారం ప్రకటించింది. బాల్టిక్ సముద్రంపై ఉన్న ఎంక్లేవ్లో ఇస్కాండెర్ మొబైల్ బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థకు చెందిన ఎలక్ట్రానిక్ ప్రయోగ వ్యవస్థతో మాక్ డ్రిల్ చేపట్టినట్లు రష్యా రక్షణశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో భాగంగా శత్రువుల వైమానిక స్థావరాలు, మౌలిక సదుపాయాలు, సైనిక పరికరాలు, కమాండ్ పోస్ట్లపై ఒకటి అంతకంటే ఎక్కువ సార్లు క్షిపణులు ప్రయోగించేలా సాధన చేసినట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ ప్రయోగాల తర్వాత జరిగే ప్రతిదాడి నుంచి సైనిక సిబ్బంది తప్పించుకునే విన్యాసాలను కూడా చేపట్టినట్లు పేర్కొంది. దాడుల అనంతరం వెలువడే రేడియేషన్, రసాయన పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపైనా సాధన చేసినట్లు తెలిపింది. ఈ డ్రిల్లో 100 మందికి పైగా రష్యా వ్యూహాత్మక దళాలు పాల్గొన్నట్లు వెల్లడించింది.
‘సైనిక చర్య’ పేరుతో ఉక్రెయిన్పై రష్యా సాగిస్తోన్న సైనిక చర్యకు 70రోజులు దాటింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ మీదకు తమ సేనలను పంపిన నాటి నుంచే రష్యా అణు దాడులపై దృష్టిపెట్టింది. ఉక్రెయిన్పై యుద్ధంలో పశ్చిమ దేశాలు నేరుగా జోక్యం చేసుకుంటే ప్రతిదాడి తీవ్రంగా ఉంటుందని క్రెమ్లిన్ అనేక సార్లు హెచ్చరించింది. అటు పుతిన్ కూడా వ్యూహాత్మక అణ్వాయుధలను సిద్ధం చేసుకుంటున్నట్లు గతంలో పలుమార్లు హెచ్చరికలు చేశారు. ఇప్పుడు ఆ దాడులకు సన్నాహాలు చేస్తుండటంతో ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్