Suella Braverman: బ్రేవర్మన్.. అవకాశాలతోపాటే వెంటాడిన వివాదాలు!
ఉద్వాసనకు గురైన బ్రిటన్ విదేశాంగ మంత్రి సుయేలా బ్రేవర్మన్ను మొదటి నుంచి వివాదాలు వెంటాడాయి.
లండన్: బ్రిటన్ హోంశాఖ మంత్రి, భారత సంతతి సుయేలా బ్రేవర్మన్ (Suella Braverman)పై ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) వేటు వేసిన విషయం తెలిసిందే. లండన్లో పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీని నియంత్రించడంలో పోలీసుల తీరును విమర్శించడం తదితర పరిణామాలు ఆమె తొలగింపునకు కారణమయ్యాయి. అయితే, బ్రేవర్మన్ మొదటినుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. రిషి సునాక్ ఆమెను మంత్రివర్గంలో తీసుకోవడంపై సొంత పార్టీ ‘కన్జర్వేటివ్’తోపాటు ప్రతిపక్షాల నుంచీ వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ.. నేరస్థులపై ఉక్కుపాదం మోపడంతోపాటు దేశ సరిహద్దులను రక్షించుకోవడంపై దృష్టి సారిస్తారంటూ సునాక్ ఆమెకు అవకాశం ఇచ్చారు. చివరకు అదే వివాదాస్పద వైఖరి కారణంగా ఆమె తన పదవి పోగొట్టుకున్నారు.
భారత్తో ఒప్పందంపై ఆందోళన..
బ్రిటన్ విధాన నిర్ణయాలు, ముఖ్యంగా వలస విధానంలో బ్రేవర్మన్ తీసుకున్న నిర్ణయాలు, వెల్లడించిన అభిప్రాయాలు విమర్శలకు దారితీశాయి. వీసా కాలపరిమితి ముగిసినా.. చాలా మంది భారతీయులు ఇంకా బ్రిటన్లోనే ఉండిపోతున్నారంటూ బ్రేవర్మన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. బ్రిటన్లో వీసా కాలపరిమితి మించి ఉంటున్న వారిలో భారతీయులే అత్యధికులని పేర్కొనడం చిక్కుల్లో పడేసింది. భారత్తో ఓపెన్ బార్డర్ మైగ్రేషన్ పాలసీపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. ఈ ఒప్పందం వల్ల పెద్ద ప్రయోజనం లేదని విమర్శించారు. అయితే, భారత్ తీవ్రంగా స్పందించడంతో బ్రిటన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరో సమయంలో.. తమ దేశానికి అక్రమంగా వలస వచ్చేవారిని ఆఫ్రికా దేశమైన రువాండాకు తరలించడం తన కల అని పేర్కొనడం గమనార్హం.
రిషి సునాక్ కీలక నిర్ణయం: సుయెల్లా బ్రేవర్మన్పై వేటు
బ్రిటన్లో ఆశ్రయంతోపాటు ప్రత్యేక ప్రయోజనాలు పొందేందుకు కొంతమంది స్వలింగ సంపర్కుల్లా నటిస్తున్నారంటూ గత సెప్టెంబరులో బ్రేవర్మన్ వ్యాఖ్యానించారు. స్థానిక యువతులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న వారిలో అధికులు బ్రిటిష్- పాకిస్థానీయులేనని ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. బ్రిటన్ వీధులను ఆక్రమించి నివసిస్తున్నవారిలో చాలా మంది విదేశాల నుంచి వచ్చినవారేనని, తమ జీవనశైలిలో భాగంగానే వారు ఇలా ఉంటున్నారని పేర్కొన్నారు. బ్రిటన్ దక్షిణ తీరంలో శరణార్థుల తాకిడిని వలసదారుల దండయాత్రగా అభివర్ణించడం దుమారం రేపింది. లండన్ వెలుపల అతి వేగంగా కారును నడిపినందుకు వేసిన ఫైన్, పాయింట్లను దాచిపెట్టేందుకు ప్రయత్నించారని ఆమెపై విమర్శలొచ్చాయి.
ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత..
మాజీ ప్రధాని లిజ్ ట్రస్ మంత్రివర్గంలోనూ హోంశాఖ మంత్రిగా పనిసిన బ్రేవర్మన్.. ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘిస్తున్నారంటూ ట్రస్పై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే వృత్తిపర తప్పిదాలతో రాజీనామా చేశారు. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడి రాజీనామా చేసిన ఆమెను.. తిరిగి అదే పదవిలో ఎలా నియమిస్తారంటూ రిషి సునాక్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తాయి. అయితే.. చేసిన తప్పులను అంగీకరించినందునే తిరిగి అదే పదవిలో నియమించామంటూ రిషి సునాక్ అప్పట్లో ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే తాజాగా పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీపై చేసిన వ్యాఖ్యలు పదవి కోల్పోవడానికి కారణమయ్యాయి. థెరెసా మే, బోరిస్ జాన్సన్ ప్రభుత్వాల్లోనూ బ్రేవర్మన్ ఆయా బాధ్యతలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది. -
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
Israel: హమాస్కు మిగిలి ఉన్న రఫా ప్రాంతంపై దండయాత్ర తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా ఇది జరుగుతుందన్నారు. -
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు ఇకపై వారానికి 24 గంటలు మాత్రమే పని చేసుకునే వీలుంటుంది. -
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
భారత్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో లండన్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. -
కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్
కత్తితో దూసుకొచ్చిన ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లండన్ (London)లో ఈ ఘటన జరిగింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
అవినీతిపరులకు భాజపా కేరాఫ్గా మారింది: కేటీఆర్
-
స్టాయినిస్ అర్ధశతకం.. ముంబయిపై లఖ్నవూ విజయం
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు