Ukraine: స్టార్లింక్ను వాడుకోవడానికి ఉక్రెయిన్ సేనలను అనుమతించలేదు: స్పేస్ఎక్స్
Ukraine: కమ్యూనికేషన్, బ్యాంకింగ్ వంటి అత్యవసర సేవల కోసం స్టార్లింక్ నెట్వర్క్ను ఎలాన్ మస్క్ ఉక్రెయిన్కు అందించారు. అయితే, దాన్ని సైనిక అవసరాలకు వాడుకోవడానికి అనుమతించలేదని తాజాగా స్పేస్ఎక్స్ వెల్లడించింది.
వాషింగ్టన్: రష్యా (Russia) దాడులతో ఉక్రెయిన్ (Ukraine)లో కమ్యూనికేషన్ల వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇది ఆసుపత్రులు, బ్యాంకింగ్ వంటి అత్యవసర సేవలకు అడ్డంకిగా మారింది. దీనికి పరిష్కారంగా బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ అక్కడ స్టార్ లింక్ నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. అంటే తక్కువ ఎత్తులో ఉండే ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ సేవల్ని పొందేలా ఏర్పాట్లు చేసింది.
ఈ స్టార్లింక్ సేవల్ని కేవలం అత్యవసర సేవల కోసం మాత్రమే ఉపయోగించుకోవాలన్నది కంపెనీ నియమం. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని సైనిక అవసరాలకు వినియోగించుకోవడానికి నిబంధనలు అంగీకరించవు. కానీ, ఉక్రెయిన్ సేనలు స్టార్లింక్ నెట్వర్క్ను రష్యాపై దాడులకు ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలా చేయడానికి తాము అంగీకరించలేదని స్పేస్ఎక్స్ అధ్యక్షుడు గ్విన్ షాట్వెల్ తాజాగా వెల్లడించారు. స్టార్లింక్ శాటిలైట్ సాంకేతికతను ఉక్రెయిన్ సేనలు వినియోగించుకోకుండా తాము తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఉక్రెయిన్లో స్టార్లింక్ను సైనికల అవసరాలకు వాడుకోవడానికి ఎలాన్ మస్క్ అంగీకరించడం లేదంటూ గతకొంత కాలంగా వినిపిస్తోంది. షాట్వెల్ ప్రకటనతో తాజాగా అది నిరూపితమైంది. ఆయుధంగా వాడుకోవడానికి స్టార్లింక్ను రూపొందించలేదని షాట్వెల్ స్పష్టం చేశారు. కమ్యూనికేషన్ అవసరాలకు వాడుకునేందుకు మిలిటరీని ఒక దశ వరకు అనుమతించాల్సి వచ్చిందని తెలిపారు. కానీ, దాడుల కోసం వినియోగించడం మాత్రం కుదరదని తేల్చి చెప్పారు.
ఉక్రెయిన్ సేనలు పలు సందర్భాల్లో స్టార్లింక్ సాంకేతికతను ప్రశంసించాయి. కమ్యూనికేషన్లను కొనసాగించడంతో పాటు డ్రోన్లు, ఆయుధాలతో రష్యన్ సేనలను లక్ష్యంగా చేసుకునేందుకు ఈ కీలక సాంకేతికత తమకు ఎంతగానో ఉపయోగపడుతోందని బహిరంగంగానే ప్రకటించాయి. ఆ తర్వాత స్పేస్ఎక్స్ ఈ విషయాన్ని అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. తమ సేవలకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. కానీ, మస్క్ ఈ వార్తల్ని వెంటనే ఖండించారు. ఉక్రెయిన్కు ఉచితంగానే స్టార్లింక్ సేవల్ని అందిస్తున్నామని తెలిపారు. అయితే, తాజాగా షాట్వెల్ మాత్రం భిన్నమైన ప్రకటన చేశారు. కీలకమైన ఈ స్టార్లింక్ ప్రాజెక్ట్కు నిధులు సమకూర్చాలని తాను మాత్రమే పెంటగాన్ను కోరినట్లు తెలిపారు. దీంతో మస్క్కు సంబంధం లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.