Ukraine Crisis: ఉక్రెయిన్లో 112 చిన్నారుల మృతి.. ఐరాస ఆందోళన
రష్యా దాడులు మొదలైనప్పటినుంచి ఉక్రెయిన్లో ఇప్పటివరకు 112 మంది చిన్నారులు మృతి చెందినట్లు స్థానిక ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం......
కీవ్: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాలపై పట్టు సాధించేందుకు పుతిన్ సేనలు తీవ్ర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్లో భారీగా పౌర మరణాలు నమోదవుతోన్న విషయం తెలిసిందే. పెద్దలతోపాటు చిన్నారులూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉక్రెయిన్లో 112 మంది చిన్నారులు మృతి చెందినట్లు స్థానిక ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తాజాగా వెల్లడించింది. మరో 140 మంది పిల్లలు గాయపడినట్లు తెలిపింది. కాగా ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితులు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని విచారం వ్యక్తం చేసింది.
జపోరిజియాలో 38 గంటల కర్ఫ్యూ..
దక్షిణ ఉక్రెయిన్లోని జపోరిజియా నగర శివార్లలో రష్యా తాజాగా జరిపిన దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు స్థానిక ఉప మేయర్ అనటోలీ కుర్తీవ్ తెలిపారు. మరో 17 మంది గాయపడ్డారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నగరంలో 38 గంటల కర్ఫ్యూను ప్రకటించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంట్లో నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఇటీవల ఈ నగరంలోని అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM