Ukraine crisis: అదే సమయంలో రష్యాతో ద్వైపాక్షిక చర్చలు: జెలెన్స్కీ
ఉక్రెయిన్ సంక్షోభానికి కేవలం దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని దేశాధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం పునరుద్ఘాటించారు. చర్చల విషయంలో ఇరు దేశాల ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో ఆయన ఓ టీవీ ఛానెల్తో ఈ మేరకు వ్యాఖ్యానించారు...
కీవ్: ఉక్రెయిన్ సంక్షోభానికి కేవలం దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని దేశాధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం పునరుద్ఘాటించారు. చర్చల విషయంలో ఇరు దేశాల ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో ఆయన ఓ టీవీ ఛానెల్తో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘పోరు కొనసాగుతోంది. యుద్ధం రక్తమయమవుతోంది. కానీ, చివరకు దౌత్యం ద్వారానే దీనికి తెరపడుతుంది. ఇరు దేశాల మధ్య నిర్ణయాత్మక చర్చలు జరగనున్నాయి. మధ్యవర్తులు ఉంటారా? వారు లేకుండానేనా? అధ్యక్ష స్థాయిలోనా?.. ఏ ఫార్మాట్లో జరుగుతాయో తెలియదు. కానీ.. కొన్ని విషయాలను చర్చల ద్వారానే చేరవేయగలం. మేం ప్రతిదీ తిరిగి పొందాలని కోరుకుంటున్నాం. కానీ.. రష్యా అలా భావించడం లేదు’ అని ఆరోపించారు.
చర్చల ఫలితాలు ఉక్రెయిన్కు న్యాయం చేకూర్చేలా ఉండాలని జెలెన్స్కీ స్పష్టం చేశారు. తమ దేశానికి భద్రతా హామీలు అందించే పత్రంపై ఉక్రెయిన్ భాగస్వాములు, మిత్రదేశాలు సంతకం చేస్తాయని చెప్పారు. అదే సమయంలో రష్యాతో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని తెలిపారు. మేరియుపోల్ అజోవ్స్తల్ స్టీల్ వర్క్స్లో లొంగిపోయిన ఉక్రెయిన్ సిబ్బందిని రష్యా చంపకూడదన్న ముందస్తు షరతుతోనే చర్చలకు ముందుకొస్తామన్నారు. మాస్కోతో చర్చలు నిలిచిపోయాయని ఇటీవల కీవ్ ప్రధాన సంధానకర్త మైఖైలో పోడోల్యాక్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ.. చర్చలను కొనసాగించడం కీవ్ అధికారులకే ఇష్టం లేదన్నారు. రష్యా వార్తాసంస్థల ప్రకారం.. ఇరుపక్షాల మధ్య చివరిసారి చర్చలు ఏప్రిల్ 22న జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
భారత ఎన్నికల విషయంలో తమ ప్రమేయం ఉండదని అమెరికా (USA) స్పష్టం చేసింది. రష్యా ఆరోపణలను ఖండించింది. -
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
ఫోరిడాలో పోలీసులు ఓ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ నల్లజాతీయుడు మృతి చెందడంతో అక్కడ నిరసన వ్యక్తమైంది. -
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం